‘ముఖ్యమంత్రి వ్యాఖ్యలు నిరంకుశత్వానికి నిదర్శనం’ | - | Sakshi
Sakshi News home page

‘ముఖ్యమంత్రి వ్యాఖ్యలు నిరంకుశత్వానికి నిదర్శనం’

Jan 20 2026 8:01 AM | Updated on Jan 20 2026 8:01 AM

‘ముఖ్యమంత్రి వ్యాఖ్యలు   నిరంకుశత్వానికి నిదర్శనం’

‘ముఖ్యమంత్రి వ్యాఖ్యలు నిరంకుశత్వానికి నిదర్శనం’

ఆదిలాబాద్‌టౌన్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ గద్దెలను కూల్చమంటూ పిలుపునివ్వడం సీఎం నిరంకుశత్వానికి నిదర్శనమని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ము ఖ్యమంత్రి ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రజల గుండెల్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ అని, ఆ పార్టీని చెరిపేయ డం ఎవరితరం కాదని స్పష్టం చేశారు. అలాగే కొరటా–చనాఖా ప్రాజెక్ట్‌కు జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధుల పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఇందులో పార్టీ పట్టణ అధ్యక్షుడు అజయ్‌, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement