
సివిల్స్లో సందీప్ సత్తా
● రెండో ప్రయత్నంలో మెరుగైన ర్యాంక్
ఆదిలాబాద్టౌన్: గమ్యం చేరే వరకు లక్ష్యాన్ని వీడ డం లేదు.. సివిల్స్లో తొలి ప్రయత్నంలో సాధించిన ర్యాంక్తో సంతోషపడకుండా మరో ప్రయత్నం చేశాడు.. తాజాగా మరింత మెరుగైన ర్యాంక్ సాధించాడు.. అయినా విశ్రమించేది లేదని మరో ప్రయత్నానికి సిద్ధమవుతాన ని చెబుతున్నాడు జిల్లా కేంద్రానికి చెందిన సందీప్. ఆదిలాబాద్రూరల్ మండలంలోని అంకోలి గ్రామానికి చెందిన ఆద వెంకటేశ్– వాణి దంపతులు పట్ట ణంలోని రవీంద్రనగర్లో నివాసం ఉంటున్నారు. వెంకటేశ్ ఇంటెలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. వీరి కుమారుడు సందీప్ మంగళవారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో ఆల్ఇండియా స్థాయిలో 667వ ర్యాంక్ సాధించాడు. ఐఆర్ఎస్కు ఎంపికయ్యాడు. అయితే మొదటి ప్రయత్నంలో 830 వ ర్యాంక్ సాధించగా, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐఆర్ఎస్)లో ఉద్యోగంలో చేరా డు. సెలవులో ఉండి పుస్తకాలతో కుస్తీ పట్టాడు. ఈసారి గతం కంటే మెరుగైన ర్యాంక్ సాధించాడు. అయితే ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని చెబుతున్నాడు ఇతడు. సందీప్ 5వ త రగతి వరకు ఆదిలాబాద్ పట్ట ణంలోని లిటిల్ఫ్లవర్లో అ భ్యసించగా, 6నుంచి 10వతరగతి వరకు కాగజ్నగర్ నవోదయాలో చదివాడు. హైదరాబాద్లో ఇంటర్ పూర్తిచేశాడు. జేఈఈ మెయిన్స్లో 550వ ర్యాంక్ సాధించాడు. బిహార్లోని ధన్బా ద్ ఐఐటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. సందీప్ సివిల్స్లో ర్యాంక్ సాధించడంపై కుటుంబీకులు, బంధువులు అభినందనలు తెలిపారు.