అభివృద్ధి పనుల్లో అలసత్వం ఉపేక్షించం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల్లో అలసత్వం ఉపేక్షించం

Apr 20 2025 2:01 AM | Updated on Apr 20 2025 2:01 AM

అభివృద్ధి పనుల్లో అలసత్వం ఉపేక్షించం

అభివృద్ధి పనుల్లో అలసత్వం ఉపేక్షించం

నిర్మల్‌చైన్‌గేట్‌: ‘అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యానికి తావులేదు.. అలసత్వం వహించే వారిని ఉపేక్షించేది లేదు.. పని చేయకుంటే వారిని పక్కన పెట్టుడే.. అ అలాగే గడువులోపు నాణ్యతతో పూర్తి చేయించా లి..’ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణనీటి సరఫరా, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. నిర్మల్‌ కలెక్టరేట్‌లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధి పనులపై శనివారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. టెండర్‌ దశ నుంచే పనులు వేగవంతం చేసి, వర్షాకాలానికి ముందు పూర్తిచేయాలన్నారు. ఆలస్యం చేస్తున్న గుత్తేదారులకు నోటీసులు జారీ చేసి, త్వరగా పూర్తి చేయించాలని సూచించారు. పనుల నాణ్యతపై రాజీలేకుండా చూ డాలని, కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. సాగు, తాగునీటి సమస్యల పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు స్ప ష్టం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులకు వాస్తవాలు చెప్పాలని ఫీల్డ్‌ విజిట్‌చేసి ఎప్పటికప్పుడు ఏఈలు భగీరథ పనులు సమీక్షించుకోవాలన్నారు.

అంగన్‌వాడీల బలోపేతం, సౌకర్యాల విస్తరణ

త్వరలో అంగన్‌వాడీల్లో టీచర్లు, ఆయాల ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. సొంత భవనాలు లేని కేంద్రాలకు రూ.12 లక్షలతో పక్కా భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. గతంలో మండలానికి ఒక భవనం నిర్మిస్తే, ఇప్పుడు రెండు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలకు సొంత భవనాలు, విద్యుత్‌, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పి స్తామన్నారు. మినీ అంగన్‌వాడీలను అప్‌ గ్రేడ్‌ చేస్తామని, సీనియర్‌ సిటిజన్‌ డే కేర్‌ సెంటర్లు, ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

మహిళా సంఘాలకు చెక్కులు..

మంత్రి సీతక్క, కలెక్టరేట్‌కు చేరుకోగానే పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. మహిళా పోలీసులు ఏర్పాటు చేసిన ‘శివంగి’ బృందాన్ని లాంఛనంగా ప్రారంభించి, రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుంద ని కొనియాడారు. తర్వాత మహిళా సంఘాలకు, మెప్మాలకు మంజూరైన చెక్కులను కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేశా రు. బ్యాంకు లింకేజీ, రుణాల మంజూరు, వసూలు లో నిర్మల్‌ జిల్లా ప్రగతిని మంత్రి ప్రశంసించారు. సమావేశంలో ఎంపీ గోడం నగేశ్‌, నిర్మల్‌, ఆదిలా బాద్‌, ముధోల్‌, ఖానాపూర్‌, సిర్పూర్‌, అసిఫాబా ద్‌, బోథ్‌ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, పాయ ల్‌ శంకర్‌, పవార్‌ రామారావు పటేల్‌, వెడ్మ బొజ్జు పటేల్‌, పాల్వాయి హరీశ్‌బాబు, కోవ లక్ష్మి, అనిల్‌ జాదవ్‌, ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఐసీడీఎస్‌ సెక్రటరీ అనితా రామచంద్రన్‌, మంచిర్యాల, నిర్మల్‌ కలెక్టర్లు కుమా ర్‌ దీపక్‌,అభిలాష అభినవ్‌, ఐటీడీఏ పీవోఖుష్బూ గుప్తా, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నిర్లక్ష్యానికి తావులేదు

అలాంటి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి

త్వరలో అంగన్‌వాడీల్లో ఖాళీల భర్తీ

రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్‌, మిషన్‌ భగీరథ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖలపై సమీక్ష

అభివృద్ధి పనుల తీరుపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అసంతృప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement