Telangana News: 'శ్రద్ధ' ప్రచారం పైనే.. పనులపై మాత్రం కాదు..!
Sakshi News home page

'శ్రద్ధ' ప్రచారం పైనే.. పనులపై మాత్రం కాదు..!

Sep 11 2023 1:38 AM | Updated on Sep 11 2023 11:05 AM

- - Sakshi

పనులను పరిశీలిస్తున్న గండ్రత్‌ సుజాత

ఆదిలాబాద్‌: రాజకీయ లబ్ధి కోసం చేయని పనులను చేసినట్లుగా భారీ హోర్డింగ్‌ల ద్వారా ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్యే జోగు రామన్న పనుల పురోగతిని విస్మరించడం హాస్యస్పదంగా ఉందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్‌ సుజాత ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని డాల్డా కంపెనీ వద్ద నిర్మిస్తున్న రైల్వే ఫ్లైఓవర్‌ వంతెన పనులను ఆదివారం ఆమె పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.

పనుల పురోగతిపై అక్కడి ఇంజినీరింగ్‌ అధికారితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు నత్తనడకన సాగుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము అభివృద్ధికి ఏ మాత్రం వ్యతిరేకం కాదని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని స్వీకరిస్తామన్నారు. కానీ ఫ్లై ఓవర్‌ వంతెనకు సంబంధించి ఫిల్లర్ల నిర్మాణం కూడా కాకుండానే ప్రజలను మభ్యపెట్టేలా పూర్తి అయినట్లుగా దాని ఫొటోలతో హోర్డింగుల ద్వారా ప్రచారం చేయడం శోచనీయమన్నారు.

పనులు ప్రారంభించి మూడు నెలలు దాటినా నేటికీ ఫిల్లర్ల నిర్మాణాలు జరుగకపోవడం ఎమ్మెల్యే చిత్తశుద్ధికి అద్దం పడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తే నిర్వాసితులకు పరిహారం ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు అల్లూరి సంజీవ్‌ రెడ్డి , అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement