-
రాష్ట్ర నలుమూలల నుంచి మహాసభకు హాజరవుతున్న బీసీలు
-
‘వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరు’
సాక్షి, అమరావతి : ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ ఉదయం ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరని మరోసారి నిరూపించారు. బీసీని అయిన నన్ను ఇచ్చిన మాట మేరకు ఎమ్మెల్సీని చేశారు నన్ను. బీసీల స్థితిగతులపై అధ్యయనం చేసే బాధ్యత ఇచ్చారు. బీసీలను ఆదుకోవడానికి ఏం చేయాలో అధ్యయనం చేయమన్నారు. బీసీలకు ఎవ్వరూ ఇవ్వనటువంటి డిక్లరేషన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చారు. అంతేకాదు బీసీ గర్జనలోనే వైఎస్సార్ సీపీకి వచ్చిన ఒకే ఒక్క ఎమ్మెల్సీని ఇచ్చారు. ఇది బీసీలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా.’ అని అన్నారు. నామినేషన్ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్కుమార్ యాదవ్, ముస్తఫా, ఆదిమూలం సురేష్, మేక ప్రతాప్ అప్పారావు, కంబల జోగులు, రక్షణ నిధి, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, జంకే వెంకట రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీసీల వరపుత్రుడు వైఎస్ జగన్
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): అద్భుత ఆలోచనలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల వరపుత్రుడిగా మారిపోయారని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు చేసిన పాదయాత్రలో ఆయన చూసిన సమస్యలను గుండెలో పెట్టుకుని కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికే ఈ మహత్తర ఆలోచన చేశారని ఆయన తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి బీసీ డిక్లరేషన్ దేశ చరిత్రలో ఎవ్వరూ చేయలేదని, జగన్ సీఎం అయిన తర్వాత దీన్ని అమల్లోకి తీసుకొచ్చాక అన్ని రాష్ట్రాల ప్రజలు ఇలాంటి బీసీ డిక్లరేషన్ కావాలని అడుగుతారన్నారు. ఏలూరులో బీసీ డిక్లరేషన్ సభ తర్వాత రాష్ట్రంలో పండగ వాతావారణం కనిపిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో 139 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఏటా రూ.15వేల కోట్లు నిధులు ఇస్తామనడం అభినందనీయమన్నారు. సీఎం అయిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తాననడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. బీసీలకు ఉద్యో గ, ఉపాధి అవకాశాల్లో 50 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న హామీ ఓ సాహసోపేతమైన నిర్ణయమన్నా రు. దుస్తుల నుంచి తినే తిండి, ఉండే ఇళ్ల వరకు ఏది కావాలన్నా దానిలో బీసీల పాత్రే ఉంటుందని, అలాంటి వారికి సమాజంలో అందరితో సమానంగా ప్రాధాన్యత కల్పించాలనే పెద్దపీట వేశారని తెలి పారు. బీసీల సమస్యలను పరిష్కరించేందుకు శా శ్వత ప్రాతిపదికన కమిషన్ వేసి సుప్రీంకోర్టు న్యా యమూర్తిని నియమిస్తామని చెప్పడం సంతోషదాయకమన్నారు. తెలంగాణలో ఓబీసీలో కొనసాగుతున్న బీసీ కులాలను యథా విధిగా బీసీల్లో కొనసాగించాలని కేసీఆర్ను కోరుతామని చెప్పడం కూ డా తమకు స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. చిరువ్యాపారులకు, కులవృత్తిదారులకు గుర్తింపుకార్డులిచ్చి ఏటా పెట్టుబడి రుణాలిస్తామనడం జగన్లో ఉన్న మంచిపాలనా చతురతకు నిదర్శనమన్నారు. నా మినేటెడ్ పనుల్లో 50 శాతం బీసీలకే ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడం కూడా ఆనందం కలిగించిందన్నారు. అన్నదాత సుఖీభవా అంటూ రైతు రుణమాఫీయే ఇప్పటివరకు సర్కారు పూర్తిచేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఓట్లు మాత్రమే వారికి కావాలి.. చంద్రబాబునాయుడు బీసీల ఓట్లు వేయించుకుని వదిలేయడం తప్ప సమస్యల పరిష్కారానికి ఎలాంటి చొరవ తీసుకోలేదని గుర్తు చేశారు. నిత్యం సభలు, సమావేశాల్లో తాను బీసీల పక్షపాతినని చెప్పుకోవడమే తప్ప చేసిన పనులేవీ లేవని దుయ్యబట్టారు. వైఎస్సార్ నిరుపేదలు చదువుకో వాలని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే చంద్రబాబు మాత్రం ఆ ఫీజులు చెల్లించడానికి కూ డా ఒప్పుకోవడం లేదని అన్నారు. జగన్ ప్రకటిం చిన బీసీల డిక్లరేషన్పై టీడీపీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని, చేతనైతే బీసీలకు న్యాయం చేయాలని సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అనేక చోట్ల పునాది రాళ్లు వేసేస్తే ఓట్లు పడవన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. సమావేశంలో సురంగి మోహనరావు, బొనిగి రమణమూర్తి, మార్పు ధర్మారావు, చల్లా రవికుమార్, పాలిశెట్టి మధుబాబు, మార్పు మన్మధరావు తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు అండ
సాక్షి ప్రతినిధి,తూర్పుగోదావరి, కాకినాడ : బీసీలంటే వెనుకబడిన తరగతులు కాదు..మన జాతికి వెన్నెముక కులాలు’ ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. అందుకు తగ్గట్టుగానే డిక్లరేషన్లో బీసీ ఉపకులాలన్నింటికీ పెద్ద పీట వేశారు. అన్ని కులాలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయింపులపై స్పష్టత బీసీల అభ్యున్నతికి దోహదపడే విధంగా డిక్లరేషన్ ఉందని అభివర్ణిస్తున్నారు. మాట ఇస్తే మడమ తిప్పని కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా అమలు చేస్తారని, బడుగుల జీవితాలను మార్చుతారని ఆశిస్తున్నారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి బీసీల అభివృద్ధే ధ్యేయంగా పనిచేశారు. ఆయన మరణానంతరం బీసీల్ని పట్టించుకునే నాయకుడు కరువయ్యారు. వైఎస్సార్ ఉన్నంత కాలం కుల వృత్తులను ప్రోత్సహించడమే కాకుండా ఫీజు రియింబర్స్మెంట్, అందరికీ ఇళ్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, కార్పొరేషన్ రుణాలు...ఇలా అన్ని రకాలుగా బీసీలను ఆదుకున్న ఘనత వైఎస్కే దక్కిందని...ఆ తర్వాత పాలకులు గాలికొదిలేశారన్న అభిప్రాయం గట్టిగా ఉంది. ఈ నేపథ్యంలో బీసీలను ఆదుకునేందుకు మళ్లీ వైఎస్ వారసత్వంగా, వారి ఆశయ సాధన దిశగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి సమగ్ర అధ్యయనం చేసి, కులాల వారీగా ఆదుకునేందుకు దోహదపడేలా డిక్లరేషన్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక...దాదాపు ఐదేళ్లుగా అధికారంలో ఉండి బీసీలకు ఇచ్చిన 119 హామీల్లో ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేయకుండా ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను కాపీ కొడుతూ, వాటినే తమ హామీలుగా చెప్పుకోవడాన్ని బీసీ వర్గాలు తప్పు పడుతున్నాయి. 40 ఏళ్ల అనుభవం గల నాయకుడికి సొంత ఆలోచనలు రాలేదంటే బీసీలపై ఆయనకు చిత్తశుద్ధి లేదనేది స్పష్టమవుతుందని బీసీలు చెబుతున్నారు. జిల్లాలో 19 నియోజక వర్గాల్లోనూ బీసీల ప్రభావం ఉంది. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు విషయంలో చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో బీసీలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు మళ్లీ పలు హామీలు ఇచ్చినా బీసీలు నమ్మడం లేదు. మాట ఇస్తే తప్పకుండా అమలు చేస్తారన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్పై నమ్మకం పెట్టుకున్నారు. దీంతో బీసీలు వైఎస్సార్సీపీకి అండగా నిలుస్తున్నారు. కార్పొరేషన్లతోఎంతో ప్రయోజనం వెనుకబడిన తరగతుల వారిని ఆదుకోవాలంటే వారికి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఉండాలన్న ఉద్దేశంతో బీసీ వర్గంలోని 139 కులాలకు కార్పొరేషన్లు ప్రకటించారు. కేవలం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వదిలేయడమే కాకుండా సమృద్ధిగా నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. వీరందరికీ న్యాయం చేయాలన్న ఆశయంతో బీసీలకు ప్రతి ఏడాది రూ.15 వేల కోట్లు ఖర్చుపెట్టాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు బీసీల కోసం కేటాయిస్తున్నారు. దీంతో జిల్లాలో ఉన్న 32 లక్షల బీసీలు లబ్ధి పొందనున్నారు. 8 లక్షల మందిబీసీ విద్యార్థులకు ఊరట బీసీ విద్యార్థుల ఫీజు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని వైఎస్ జగన్ ప్రకటించారు. దీనివల్ల ఐఏఎస్, ఐపీఎస్ ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఎంసీఎ, ఎంబీఎ తదితర ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంది. దాదాపు ప్రభుత్వమే వారి చదువుల బాధ్యత తీసుకున్నట్టు అవుతుంది. అంతటితో ఆగకుండా హాస్టల్లో చదివే విద్యార్థులకు ఏటా రూ. 20వేలు మెస్ చార్జీల కింద కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని వైఎస్ జగన్ ప్రకటించడంతో వారి ఆనందానికి అంతులేకుండా పోయింది. వైఎస్ జగన్ ప్రకటనతో జిల్లాలో 8 లక్షల మంది బీసీ విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. డెయిరీలకుపాలు పోస్తే రూ.4 అదనం డెయిరీలకు పాలు పోసే పాడి రైతులకు మంచి రోజులు రానున్నాయి. ఒక్కో లీటర్కి అదనంగా రూ.4 ఇవ్వనున్నట్టు జగన్ ప్రకటించారు. జిల్లాలో రైతులు 6 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలో 6 లక్షల 47 వేలు పాడి గేదెలు , 4 లక్షల 56 వేల పాడి ఆవులున్నాయి. వాటి ద్వారా రోజుకి 32 లక్షల 87 వేల 670 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 16 లక్షల 43 వేల 835 లీటర్ల మేర డెయిరీలకు పాలు పోస్తున్నారు. ఈ లెక్కన రోజుకి 66 లక్షల చొప్పున నెలకి రూ.20 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరనుంది. ‘వైఎస్సార్చేయూత’తోమహిళలకు ఊరట :కుల వృత్తిని చేపడితేనే పూట గడిచే పరిస్థితిబీసీ మహిళలది. ఈ పరిస్థితుల్లో మహిళలకు ప్రత్యేక ఆర్థిక తోడ్పాటు అందిస్తే తప్ప స్వావలంబన సాధించ లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ చేయూత ద్వారా ప్రతి మహిళకు రూ.75 వేలు చొప్పున, నాలుగు విడతలుగా అందిస్తామని వైఎస్ జగన్ ప్రకటించడంతో వారి కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. -
వైఎస్ జగన్ నిర్ణయం చరిత్రాత్మకం : బొత్స
సాక్షి, విశాఖపట్నం : సంచార కులాల పిల్లల కోసం రెసెడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం చరిత్రాత్మకమని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. బీసీల అభివృద్ధికి వైఎస్సార్సీపీ కంకణం కట్టుకుందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇన్నాళ్లు చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారన్నారు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా తమ అధినేత అన్నివర్గాల ప్రజల స్థితిగతులను తెలుసుకున్నారని, బీసీల జీవన ప్రమాణలు పెంచే దిశగా డిక్లరేషన్ ప్రకటించారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే వైఎస్సార్సీపీ బీసీ డిక్లరేషన్ ఉందన్నారు. బీసీలంటే బ్యాక్ వార్డ్ క్యాస్ట్ కాదు.. భారత్ కల్చరని జగన్ చెప్పారని, ఈ డిక్లరేషన్పై బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు ఇప్పుడు బీసీ సబ్ప్లాన్ పెట్టారని, ఎంత బడ్జెట్ కేటాయించారో కూడా చెప్పలేదన్నారు. పిల్లలను బడికి పంపితే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని జగన్ చెప్పారని, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించేలా చట్టబద్ధత తీసుకొస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా బొత్స గుర్తు చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అన్నిరకాలుగా బీసీలకు మేలు జరిగిందని తెలిపారు. చంద్రబాబు మోసాలు, అబద్ధాలను ఎవరు నమ్మొద్దని, వచ్చే ఎన్నికల్లో తగిన బద్ధి చెప్పాలని బొత్స పిలుపునిచ్చారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement