breaking news
youg man died
-
పండగకు వస్తూ.. పరలోకాలకు..
వట్టిమర్తి(చిట్యాల) రంజాన్ పర్వదినాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని బయలుదేరిన ఓ యువకుడు మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాలకు చెందిన అజీజ్(30) గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లోని కంట్రి క్లబ్లో పనిచేస్తున్నాడు. రంజాన్ పండగ సందర్భంగా అత్తగారింటికి వెళ్లేందుకు అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నాడు. అక్కడి నుంచి తనను తీసుకువెళ్లేందుకు వచ్చిన కుటుంబసభ్యులతో తానే కారు నడుపుతూ నార్కట్పల్లికి బయలుదేరాడు. వట్టిమర్తి శివారులోని ఒరిస్సా దాబా వద్దకు రాగానే కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అజీజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. కారులోని ఇతర కుటుంబసభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా మృతుడికి రెండు నెలల క్రితమే వివాహమయ్యింది. సంఘటన స్థలాన్ని ఎస్ఐ వెంకటేశ్వర్లు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
జయకు బెయిల్ రాలేదని యువకుడి ఆత్మహత్య
గుమ్మిడిపూండి: అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు బెయిల్ రాలేదని విరక్తి చెంది ఓ యువకుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తిరువళ్లూరు సమీపంలోని పొన్నేరి వద్ద చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిలా,్ల పొన్నేరి డివిజన్ పరిధిలోని కాటావూర్ గ్రామానికి చెందిన నాగయ్యన్ కుమారుడు సుభాష్ (23). ఇతను ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ అన్నాడీఎంకే పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత బెయిల్ పిటిషన్ విచారణ సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో స్వీకరించారు. అయితే విచారణనూ అత్యవసరంగా విచారించలేమని న్యాయమూర్తి శుక్రవారానికి వాయిదా వేశారు. టీవీలో చూసిన సుభాష్ విరక్తి చెంది విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు బాధితుడిని చెన్నై వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. సుభాష్కు స్థానిక అన్నాడీఎంకే నేతలు ఘనంగా నివాళులు అర్పించారు.