breaking news
yasodamma
-
కిలకిల మువ్వల కేళీ కృష్ణా!
బుంగమూతి వీడలేదు కన్నయ్య. కుండెడు వెన్నమీగడలు, గడ్డ పెరుగు... ఎన్ని ఆశ చూపినా కన్నయ్య గుండ్రటి మూతి వెడల్పు కావట్లేదు. ఏం జరిగిందో అర్థం కాలేదు యశోదమ్మకు. ఉదయాన్నే చద్ది మూట కట్టుకుని, అన్న బలరాముడితో కలిసి గోవులను అడవికి తీసుకువెళ్లిన శ్రీకృష్ణుడు సాయంత్రం గడిచి, చీకటిపడుతున్నా ఇంటికి రాలేదు. యశోద మనసు పరిపరివిధాల పోతోంది. రోజూ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయని కన్నయ్య ఈ రోజు ఇంకా ఎందుకు రాలేదా అని ఆందోళన చెందుతోంది. నందుడి చేతికి కాగడా ఇచ్చి నల్లనయ్యను వెతికి తీసుకురమ్మంది. నందుడు గుమ్మం దిగుతుండగా, దీన వదనంతో ఎదురు వచ్చాడు కిట్టయ్య. తన చిన్ని కృష్ణుడు రావడం చూసి యశోద నయనాలు ఆనంద బిందువులతో నిండిపోయాయి. పరుగుపరుగున ఎదురువచ్చి అక్కున చేర్చుకుంది. బుంగమూతి వీడలేదు కన్నయ్య. కుండెడు వెన్నమీగడలు, గడ్డపెరుగు ఎన్ని ఆశ చూపినా కన్నయ్య గుండ్రటి మూతి వెడల్పు కావట్లేదు. ఏం జరిగిందో అర్థం కాలేదు యశోదమ్మకు. ఆ మురారిని తన ఒడిలో కూర్చోపెట్టుకుని, బుజ్జగింపుగా అడిగింది. ఏడుపు ముఖంతో, ‘అమ్మా! నేను నల్లగా ఎందుకు ఉన్నాను. రాధ చూడు ఎంత తెల్లగా ఉంటుందో. నాకు చిన్నతనంగా ఉంది’ అన్నాడు. యశోద మనస్సు చివుక్కుమంది. బాధను బయటపడనీయకుండా, నవ్వుతూ, ‘అయ్యో! ఇంతేనా! నీకో విషయం తెలుసా. నీ పసితనంలో ఒక రాక్షసి నీకు విషం పాలు ఇచ్చింది. నీ రంగుమారిందే కాని, నీకేమీ కాలేదు. అప్పటి నుంచి నువ్వు నల్లనయ్యవు అయ్యావు. నీ రూపం నచ్చి, పోతన మహాకవి నిన్ను ‘నల్లనివాడు, పద్మ నయనమ్ముల వాడు, కృపారసంబు పైజల్లెడివాడు.. చెల్వల మనోధనంబు దోచెను’ అని ప్రస్తుతించాడు. అయినా ఎవరైనా, ఎప్పుడైనా నువ్వు నల్లగా ఉన్నావని అన్నారా. నువ్వంటే అందరికీ ప్రేమే కదా. నువ్వు ఎవరి ఇళ్లలో వెన్నముద్దలు దొంగిలించినా, పెరుగు తస్కరించినా, చివరకు గోపికల వస్త్రాలను అపహరించినా, నిన్ను అందరూ స్తుతించారే కాని, ఒక్కరూ నిందించలేదు కదా. ఈరోజు నీకు ఎందుకు నువ్వు నల్లగా ఉన్నావన్న భావనలో ఉన్నావు...’ అని సముదాయించడానికి పరిపరివిధాలప్రయత్నించింది. నల్లనయ్య ముఖంలోని ఆ విశాలమైన కలువ కళ్లు ముడుచుకునే ఉన్నాయి. విచ్చుకోవట్లేదు. యశోద చాలాసేపు ఆలోచించింది. పసుపు, కుంకుమలు, రకరకాల కాయగూరల నుంచి వచ్చే రంగులు, బిందెడు నీళ్లు తీసుకు వచ్చింది, వాటితోపాటు ఒక పిచికారీ కూడా తీసుకువచ్చింది. ఏం జరుగుతోందో అర్థం కాక చూస్తున్నాడు బుల్లి కన్నయ్య. ఏంటమ్మా ఇవన్నీ అని అడిగాడు. అందుకు యశోద ‘చిట్టి తండ్రీ! నీ రాధ నీకు ఏ రంగులో కనిపించాలనుకుంటున్నావో ఆ రంగు ఆమె ముఖానికి పులిమేసెయ్యి. ఇంకా కావాలంటే, ఆ రంగులతో రంగు నీళ్లు తయారుచేసి, ఈ పిచికారీతో రాధ ఒళ్లంతా తడిపేసెయ్. అప్పుడు రాధ, నువ్వు ఒకే రంగులో ఉంటారు, సరేనా!’ అంది. కృష్ణుడు తెగ సంబరపడిపోయాడు. రంగులు, రంగునీళ్లు తీసుకుని రాధ దగ్గరకు బయలుదేరాడు. నల్లనయ్యను చూసిన రాధకు ఏమీ అర్థం కాలేదు. వస్తూనే కన్నయ్య చేతిలోని రంగులను రాధ ముఖానికి పులిమేశాడు. వెంటనే పిచికారీతో ఒళ్లంతా తడిపేశాడు. రాధకు కన్నయ్య చేష్టలు అర్థమయ్యాయి. ఇంతకాలం తాను చాలా తెల్లగా ఉంటాననుకున్న రాధ, ఇప్పుడు కన్నయ్య రంగులోకి వచ్చేసింది. ఆ రోజు రాధకు కృష్ణ తత్త్వం అర్థమైంది. యశోదమ్మ దగ్గర చిన్నపిల్లవాడిగా ప్రవర్తించిన కన్నయ్య, రాధ దగ్గర వేదాంతాన్ని బోధించాడు. ఆ రోజు నుంచి రంగుల పండుగను గోకుల వాసులతో పాటు భారతీయులంతా జరుపుకుంటున్నారు. ఒకరి మీద ఒకరికి ఉన్న అనురాగాన్ని ప్రదర్శించుకోవడానికి ఈ పండుగను తన లీలలతో ప్రబోధించాడు గీతాకారుడు శ్రీకృష్ణుడు. –డా. వైజయంతి పురాణపండ -
నానమ్మకు మేమున్నాం..: జంపన్న అన్న కొడుకు నవీన్రెడ్డి
బూర్గంపాడు: ‘రారా నాయ నా దండం పెడతా..’ అంటూ మావోయిస్టు నేత జంపన్న తల్లి యశోదమ్మ చేసుకున్న వేడుకోలుకు ఆమె మనవడు స్పందించాడు. సోమవారం సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని చూసి సారపాకకు చెం దిన జినుగ నవీన్రెడ్డి (జంపన్న అన్న వెంకటరెడ్డి కుమారుడు) స్పందించారు. సోమవారం రాత్రి తన తల్లి కళావతితో కలసి ‘సాక్షి’తో మాట్లాడాడు. ‘వృద్ధాప్యంలో ఉన్న మా నానమ్మను చూసుకునేందుకు నేనున్నా. సారపాకలోని ఐటీసీలో క్యాజువల్ లేబర్గా పనిచేస్తున్నాను. మానాన్న కొంతకాలం క్రితం చనిపోయారు.ఏడాది క్రితం మా నానమ్మ నా పెళ్లికి వచ్చింది. ఇక్కడ ఉండమని ఎంత బతిమాలినా వినలేదు. ఆ తర్వాత కనిపించలేదు. ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనాన్ని చూశాక మా నానమ్మ ఆచూకీ తెలిసింది. మా నానమ్మ మంచి చెడులు చూసుకునేందుకు నేను, మా అమ్మ ఉన్నాం.’ అని అన్నాడు. -
పీలేరులో దారుణ హత్య : నగలు, నగదు చోరీ
-
పీలేరులో దారుణ హత్య : నగలు, నగదు చోరీ
చిత్తూరు: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం పీలేరు దుర్గానగర్లో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయురాలు యశోదమ్మను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. దుండగులు నగలు, నగదు తీసుకొని పారిపోయారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగిగారు. జాగిలాలతో దుండగుల కోసం గాలిస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాల కోసం పరిశీలిస్తున్నారు. అయితే దుండగులు ఆధారాలు దొరకకుండా జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. అయినా క్లూస్ టీమ్ తమ పంధాలో ఆధారాల కోసం ప్రయత్నిస్తోంది. యశోదమ్మ కూతురు,అల్లుడు ఉద్యోగం చేస్తున్నారు. వారు వచ్చిన తరువాత మాత్రమే ఎంత నగదు, నగలు పోయిందో తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. చుట్టుపక్కల ఎవరో తెలిసినవారే ఈ హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఆమెకు ఎవరైనా ప్రత్యర్థులు ఉన్నారా? అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. -
కేంద్ర మంత్రి జైపాల్రెడ్డికి మాతృవియోగం
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ఎస్.జైపాల్రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మాతృమూర్తి సూదిని యశోదమ్మ(90) శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10లోని జైపాల్రెడ్డి నివాసంలో కన్నుమూశారు. ఆమెకు జైపాల్రెడ్డి, పద్మారెడ్డి, మనోహర్రెడ్డి అనే ముగ్గురు కొడుకులు, కుమార్తె భారతి ఉన్నారు. ఆమె స్వగ్రామం మహబూబ్నగర్ జిల్లా మాడ్గుల. యశోదమ్మ మృతితో జైపాల్రెడ్డి కుటుంబం విషాదంలో మునిగింది. తల్లి మరణవార్త సమాచారం తెలియగానే జైపాల్రెడ్డి ఢిల్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్కు చేరుకున్నారు. తల్లి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. కాగా యశోదమ్మ తన కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. దీంతో వైద్యులు ఆమె కళ్లను సేకరించారు. యశోదమ్మ భౌతికకాయానికి శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈఎస్ఐలోని హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.