breaking news
Yasoda hospitals
-
మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై స్పందించిన కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కేసీఆర్ ఆరోగ్యం బాగుందని చెప్పారు. బ్లడ్ షుగర్, సోడియం లెవల్స్ సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా నిన్న సాయంత్రం ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారని తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండనున్నారని చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరాతీస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. Sri KCR garu was admitted in the hospital last evening for routine health checkups. Just to monitor his Blood sugar and low Sodium levels, his doctors have advised a few days of admissionNo serious health concerns at all. All his vitals are normalI thank all those who have…— KTR (@KTRBRS) July 4, 2025 -
కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ ఆరా
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సీజనల్ జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్ గురువారం హైదారబాద్లోని యశోదా ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ యశోదా ఆస్పత్రి వైద్యులతో కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. -
‘యశోద’లో అరుదైన గుండె శస్త్రచికిత్స
కరీంనగర్: హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో అత్యంత అరుదైన గుండె శస్త్రచికిత్స చేసి, ఓ మహిళకు కొత్త జీవితాన్ని అందించినట్లు కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ సత్యశ్రీధర్ తెలిపారు. బుధవారం కరీంనగర్లోని యశోద హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ పట్టణానికి చెందిన 54 ఏళ్ల చెన్నూరి లత గుండె దడ, నడిస్తే ఆయాసం, గట్టిగా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలో ఏడాది క్రితం సోమాజిగూడలోని తమ ఆస్పత్రికి వచ్చిందన్నారు. ఆమెకు ఈసీజీ, 2డీ ఎకో, యాంజియోగ్రామ్ నిర్వహించగా పదే పదే గుండెపోటు వచ్చి, గుండె వ్యాకోచం చెందిందని గుర్తించినట్లు పేర్కొన్నారు. కార్డియాక్ రీమోడలింగ్ చికిత్స ద్వారా గుండె పరిమాణాన్ని తగ్గించామన్నారు. 6 గంటలపాటు సాగిన ఈ శస్త్రచికిత్సలో ఆమెకు బైపాస్ సర్జరీ, కార్డియాక్ అనాటమీ పునరుద్ధరణ, మిట్రల్ వాల్వ్ రిపేర్ తదితర ప్రక్రియలు జరిపినట్లు తెలిపారు. ఆమె పూర్తిగా కోలుకొని, ఏడాదిగా ఆరోగ్యంగా జీవిస్తోందన్నారు. గుండె వైఫల్యం అనేది అతికొద్ది మందిలో మాత్రమే వస్తుందని, అప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు. అన్ని రకాల వైద్యులు, అధునాతన వైద్య సదుపాయాలు యశోద ఆస్పత్రిలో ఉండటం వల్లే ఇలాంటి ఆపరేషన్లు విజయవంతం అవుతున్నాయని తెలిపారు. అనంతరం లత మాట్లాడుతూ.. తాను బతుకుతానని అనుకోలేదని, యశోద ఆస్పత్రి వైద్యులు అందించిన వైద్యంతో ఇప్పుడు సాధారణ జీవితాన్ని గడపడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. -
హైదరాబాద్లో 2 స్వైన్ఫ్లూ కేసులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో స్వైన్ఫ్లూ కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఇద్దరికి స్వైన్ఫ్లూ నిర్ధారణ అయినట్టు వైద్యులు గుర్తిం చారు. వీరిలో ఒకరు అపోలో, మరొకరు ప్రీమియర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేర్, యశోద ఆస్పత్రుల్లోనూ కొందరికి హెచ్1ఎన్1 లక్షణాలున్నట్టు అనుమానం రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా, స్వైన్ఫ్లూ కాదని తేలింది. ఈ ఏడాది ఇప్పటివరకూ 45 కేసులు స్వైన్ఫ్లూ కేసులుగా నిర్ధారణ అయ్యాయి. 9 మంది మృతి చెందినట్టు వైద్యాధికారులు వెల్లడించారు.