-
రక్షిత గృహాల్లో మీకేం పని?
సాక్షి, హైదరాబాద్: ‘యాదాద్రి’ఘటనలో బాధిత బాలికలను సందర్శించేందుకు స్థానిక నేతలు, ప్రైవేటు వ్యక్తులకు జిల్లా సంక్షేమ కమిటీలు అనుమతులివ్వడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రక్షిత గృహాల్లో నేతలకు పనేముందని ప్రశ్నించింది. ఇకపై ఎవరినీ బాధిత బాలికల వద్దకు అనుమతించవద్దంటూ రక్షిత గృహ నిర్వాహకులను హెచ్చరించింది. కేసు దర్యాప్తులో ఉన్నందున చిన్నారుల సంర„ý కులమని చెప్పుకునే వారిని కూడా అనుమతించ వద్దని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా దౌర్జన్యంగా వ్యవహరిస్తే.. వారిపై అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపింది. బాధిత చిన్నారులను సందర్శించేందుకు ఇప్పటి వరకు ఎవరెవరొచ్చారు? ఎవరెవరికి, ఎందుకు, ఎవరు అనుమతినిచ్చారని ప్రశ్నించింది. ఈ వివరాలను సీల్డ్ కవర్లో తన ముందుంచాలని రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల బాలల సంక్షేమ కమిటీలను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 12కు వాయిదా వేసింది. యాదాద్రిలో చిన్నారులను వ్యభిచార వృత్తిలోకి దింపిన వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను హైకోర్టు సుమోటో పిల్గా పరిగణించిన విషయం తెలిసిందే. గురువారం విచారణ సందర్భంగా రక్షిత గృహం ‘ప్రజ్వల’తరఫు న్యాయవాది స్పందిస్తూ, తమ రక్షిత గృహంలో ఉన్న చిన్నారులను ఓదార్చేందుకు స్థానిక నేతలు వస్తున్నారని, వీరికి ఆయా జిల్లాల బాలల సంక్షేమ కమిటీలు అనుమతులు ఇచ్చారని కోర్టుకు నివేదించారు. దీనిపై అభ్యంతరం చెబితే, వచ్చిన నాయకులు తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వివరించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించి.. అధికారులను హెచ్చరించింది. -
యాదాద్రి విషవలయంపై కలెక్టర్ సమీక్ష
-
ఆటో కార్మికుల ఆందోళన ఉద్రిక్తం
యాదాద్రి కొండపైకి బస్సులు ఆపాలంటూ బైఠాయింపు యాదగిరిగుట్ట: యాదాద్రి కొండపైకి బస్సులు నడపడాన్ని నిరసిస్తూ ఆదివారం ఆటో కార్మిక సంఘం జేఏసీ నాయకులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికులు ఒంటిపై పెట్రోలు పోసుకోవడం.. పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆదివారం యాదాద్రికి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఆర్టీసీ కొండపైకి రోజువారీ లాగానే బస్సులు నడుపుతోంది. వెంటనే ఆర్టీసీ మినీ బస్సులను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఉదయం 11 గంటలకు కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డపై బైఠాయించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోలీసులు కార్మికులను అక్కడ నుంచి తొలగించే ప్రయత్నం చేయగా.. కార్మికులు వాగ్వాదానికి దిగారు. మరోవైపు భక్తులు ఆటో కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను పక్కకు నెట్టి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. పెట్రోల్ పోసుకుని నిరసన: ఆందోళన చేస్తున్న పలువురు కార్మికులను పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పలువురు కార్మికులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపారు. తమకు న్యాయం చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని, ఆర్టీసీ డీఎం, ఆలయ ఈఓ తమ వైఖరిని మార్చుకోవాలని కోరారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఆటోకార్మికులపై పలు ప్రాంతాలకు చెందిన భక్తులు దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement