World Red Cross Day
-
బడికి వెళ్లే వయసులోనే.. రక్త కన్నీటి గాథ..!
కొందరు చిన్నారులు తల్లిపాలు తాగే వయస్సులో రక్తాన్ని ఎక్కించుకుంటూ తల్లడిల్లుతున్నారు. బడికి వెళ్లాల్సిన సమయంలో రక్తనిధి కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చాక్లెట్లు చప్పరించాల్సిన నోటితో చేదు మందు బిల్లలు తింటున్నారు. తోటి చిన్నారులు ఆనందంగా ఆడుకుంటుంటే చూస్తూ ఉండటం తప్ప ఏమి చేయలేని నిస్సహాయస్థితి వారిది. అలసట, ఆయాసాల మధ్య ప్రాణాంతక వ్యాధి తలసేమియా బాధితుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఉమ్మడి జిల్లాలో 179 మంది చిన్నారుల సంతోషాన్ని ఇది దూరం చేస్తోంది. అయితే వారి ఆయుష్షు పెంచే బాధ్యతను జిల్లా జనరల్ ఆస్పత్రి, రెడ్క్రాస్ తీసుకుంది. రక్తం ఎక్కించాల్సిందే.. తలసేమియా జన్యు సంబంధిత వ్యాధి. వ్యాధి సోకిన వారికి వారం, పదిహేను రోజులకు ఒకసారి రక్తాన్ని ఎక్కించాల్సిందే. లేకపోతే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఉంది. ఈ వ్యాధిగ్రస్థుల్లో హిమోగ్లోబిన్ ఉత్పత్తి శరీరానికి అవసరమైనంత ఉండదు. ఒకవేళ ఉత్పత్తి అయినా ఎక్కువ కాలం ఉండదు. 2018లో తలసేమియాను ఆరోగ్యశ్రీ పథకంలో విలీనం చేయడం వల్ల బాధితులకు ప్రతి నెల మందులను జనరల్ ఆస్పత్రి నుంచి ఇస్తుంటే.. రక్తం మాత్రం రెడ్క్రాస్ నుంచి అందిస్తున్నారు. ఇదీ చదవండి: World Ovarian Cancer Day : సైలెంట్గా..స్త్రీలకు గండంగా!వ్యాధి లక్షణాలు.. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే అవకాశం ఉంది. చిన్నారులు ఎదుగుతున్న కొద్దీ వ్యాధి బయటపడుతుంది. వ్యాధి బారినపడిన పిల్లలకు రక్తహీనత మొదలై జీర్ణశక్తి మందగిస్తుంది. ముఖం పాలిపోవటం, ఎదుగుదల లేకపోవడం, హుషారు తగ్గడం, నీరసించి పోవడం వంటి లక్షణాలు కని్పస్తాయి. కీళ్ల నొప్పులు, కడుపు నొప్పి ప్రారంభమై, మూత్రం పసుపు వర్ణంతో వస్తోంది. ఇదీ చదవండి: వాడిన నూనెను ఇంత బాగా క్లీన్ చేయొచ్చా.. సూపర్ ఐడియా!పరీక్షలు చేయించు కోవాలి ఈ వ్యాధి బారిన పడినవారు పసువు రంగులో మూత్ర విసర్జన చేస్తుండటం వల్ల దీనిని తల్లిదండ్రులు పచ్చకామెర్లుగా భావిస్తుంటారు. అవగహన లేమి కారణంగా పచ్చ కామెర్లకు చికిత్స అందిస్తారు. పైలక్షణాలు పిల్లల్లో ఉంటే జనరల్ ఆస్పత్రిల్లో పూర్తిస్థాయి పరీక్షలు చేయించి చికిత్స చేయించుకోవాలి. -
జాన్ హెన్రీ కృషి మరువలేనిది
సుబేదారి, న్యూస్లైన్ : రెడ్క్రాస్ సంస్థలను ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయడంలో జాన్ హెన్రీ చేసిన కృషి మరువలేనిదని కలెక్టర్ కిషన్ అన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండ సుబేదారిలోని రెడ్క్రాస్ భవనం లో గురువారం ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ కిషన్ జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్త సేకరణలో రాష్ట్రంలో నే జిల్లా రెండో స్థానంలో ఉందని, ఈ దఫా మొదటి స్థానం సాధించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. రక్త సేకరణకు ఎన్జీఓ, స్వచ్ఛంద సంస్థలు శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం రక్తదానం చేసిన ఉద్యోగులు, వివిధ సంస్థలకు కలెక్టర్ సర్టిపికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర నాయకుడు డాక్టర్ విజ య్చందర్రెడ్డి, రెడ్క్రాస్ చైర్మన్ డాక్టర్ రవీందర్రావు, కోశాధికారి నాగయ్య, ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేష్కుమార్ గౌడ్, కోశాధికారి రత్నాకర్రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి జగన్మోహన్రావు పాల్గొన్నారు. కాగా, కలెక్టర్ కిషన్ స్వయంగా రక్తదానం చేసి ఉద్యోగులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈ శిబిరంలో 240 మంది ఉద్యోగులు, అధికారులు 240 యూని ట్ల రక్తాన్ని దానం చేశారు.