breaking news
World Mosquito Day
-
దోమా! ఇది నీకు తగునా!!
‘సాయంత్రానికి ఇంటిలోకి చేరతావు, ఏదో ఒక మూలనుంటావు. నేను ప్రేమించే వెలుతురుని ద్వేషిస్తావు, నేను ద్వేషించే చీకటిని ప్రేమిస్తావు. రాత్రంతా నాకోసం మేల్కొని ఉంటావు, టైము దొరికితే కాటేస్తావు. మనది మనది ఒకటే రక్తం అంటావు, నా రక్తాన్నే తాగుతావు. కొన్ని రోజులే బతుకుతావు, కానీ నన్ను రోజూ చంపుతావు. రోగక్రిమి లేకపోతే మిత్రుడు, ఉంటే శత్రువు.’సంవత్సరానికి పదిలక్షల పైచిలుకు మరణాలతో, మానవ మరణాలకు కారణమయ్యే జీవుల్లో దోమ మొదటిస్థానం ఆక్రమిస్తుంది. 1897 ఆగస్టు 20న సర్ రోనాల్డ్ రాస్ మలేరియా క్రిముల్ని దోమలో చూసి, మలే రియా వ్యాధి వ్యాప్తికి కారణం దోమ అని నిర్ధారించారు. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ‘ప్రపంచ దోమ రోజు’ జరుపుతున్నారు. ఈ సందర్భంగా దోమల గురించిన కొన్ని వాస్తవాలు:దోమలు 112 జాతులతో 3,541 తెగలతో భూగోళమంతా వ్యాపించి ఉన్నాయి. వాటిలో 50 జాతులు, 404 తెగలు భారతదేశంలో ఉన్నాయి. 4 జాతులకు చెందిన దోమలు మాత్రమే మన దేశంలో మనుషులకు వ్యాధులను కలిగిస్తాయి. అనాఫిలస్ జాతి మలేరియా వ్యాధిని; క్యూలెక్స్ జాతి ఫైలేరియా, మెదడువాపు వ్యాధులను; ఏడిస్ జాతి డెంగీ, చికున్ గన్యా, జికా వ్యాధులను; మాన్సోనియా జాతి బోదకాలు వ్యాధిని వ్యాప్తిచేస్తాయి.దోమ జీవితంలోని 4 దశల్లో, 3 దశలు (గుడ్డు, లార్వా, ప్యూపా) నీటిలోనూ, ఒక దశ (పెద్ద దోమ) భూమిమీద నివసిస్తాయి. సాధారణంగా మగదోమలు వారం రోజులు, ఆడదోమలు నెల రోజులు మాత్రమే జీవిస్తాయి. జీవించడానికి ఆడ, మగ దోమలు మొక్కల రసాలు తాగుతాయి, గుడ్లుపెట్టడానికి మాత్రమే ఆడదోమలు రక్తం తాగుతాయి. దోమకాటు దగ్గర ఏర్పడే ఎర్రని బొబ్బ దోమకాటు వల్ల కాకుండా, మనిషి వ్యాధినిరోధక వ్యవస్థ స్పందన వలన ఏర్పడుతుంది.దోమలు భూమికి 25 మీటర్లకంటే తక్కువ ఎత్తులో ఎగరడానికి ఇష్టపడతాయి. అవి మనుషులు, జంతువులు విడిచే వాయువులను 75 మీటర్ల దూరంనుండి కూడా గుర్తించ గలవు. గర్భిణీ స్త్రీలను, ‘ఓ’ రక్తగ్రూపు వాళ్లను, శరీరం వేడిగా ఉండేవాళ్ళను దోమలు సులభంగా గుర్తించగలవు. కదిలేవాటిని, తెలుపు, నలుపు రంగులను, ఉష్ణోగ్రతలను, గాలిలోని తేమను పసిగట్టగలవు.దోమ రెక్కల ద్వారా చేసే శబ్దాలు వాటి తెగకు చెందిన, ఇతర దోమలు గుర్తించడానికి చేసేవే. పెద్ద దోమలను తినేవాటిలో తూనీగలు, దోమ పిల్లలను తినేవాటిలో చేపలు ముందుంటాయి. దోమ కిలోమీటరు దూరం మాత్రమే వ్యాధిని వ్యాప్తిచేయగలదు. అయితే వ్యాధికారకం కలిగిన మనుషులు మాత్రం వేలకిలో మీటర్ల మేరకు వ్యాధిని వ్యాప్తిచేయగలరు. అందుకే దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోండి – దోమకాటు వ్యాధులనుండి రక్షణ పొందండి.– తలతోటి రత్న జోసఫ్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్, ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
Health: దోమ చిన్నదే..! కుట్టిందో ఖతమ్..!
మనుషులపై మలేరియా ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ వ్యాధికి దోమలే కారణం. దోమలు వృద్ధి చెందడం వల్ల మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ అనారోగ్య పరిస్థితులకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులు లేకపోవడం, తగినంత మంది పారిశుధ్య కారి్మకులు లేకపోవడంతో చెత్త, మురుగు ఎక్కడికక్కడే పెరిగిపోయి దోమలు ప్రభావం తీవ్రంగా ఉంది. ‘వరల్డ్ మస్కిటో డే’ సందర్భంగా ఈ కథనం..దోమలు కలిగించే వ్యాధులివీఅనాఫెలస్ దోమ: ఈ దోమ వల్ల మలేరియా వ్యాధి సోకుతుంది. ఇది శుభ్రమైన నీటిలో సంచరిస్తుంది. ఇది వంద మీటర్లు మేర మాత్రమే సంచరించగలవు. క్యూలెక్స్: ఈ దోమ వల్ల ఫైలేరియా, మెదడుకు సంబంధించిన వ్యాధి సోకుతుంది. ఇది మురుగు నీటిలో మసులుతుంది. ఇది 11 కిలోమీటర్లు మేర సంచరిస్తూ ఉంటుంది. ఏడిస్: ఈ దోమ వల్ల డెంగీ, చికెన్గున్యా వ్యాధులు సోకుతాయి. ఇది చెట్టు తొర్రలు, నివాస ప్రాంతాల్లోని వస్తువుల్లో నిల్వ ఉంచిన నీటిలోనూ, కొబ్బరి డిప్పలు, పశువల పాకలవు వద్ద అపరిశుభ్రత పరిస్థితులమధ్య సంచరిస్తుంది.ఇది వంద మీటర్లు మేర మాత్రమే సంచరించగలవు. మేన్సోనియా: ఈ దోమ వల్ల ఫైలేరియా, చికెన్గున్యా వ్యా«ధులు సోకుతాయి. దీని ప్రభావం ఇండియాలో తక్కువగా ఉంది. ఇది చెరువులు, కాల్వల్లో ఉండే గుర్రపుడెక్క, మొక్కలో ఉంటుంది. ఇది వంద మీటర్లు మేర మాత్రమే సంచరించగలవు.వ్యాధుల లక్షణాలు ఇలా..మలేరియా: వణుకుతో కూడిన చలి జ్వరం వస్తుంది. రెండు రోజులకోసారి జ్వరం కనిపిస్తుంది. ప్రాథమిక దశలోనే చికిత్సను ప్రారంభించాలి. తీవ్రత పెరిగతే మెదడు ప్రభావితమై రోగి చనిపోయే పరిస్థితులుంటాయి.ఫైలేరియా: సాధారణంగా కాలు వాస్తుంది. గజ్జలో బిల్లలు వేస్తాయి. సాయంత్రం వేళ తక్కువ స్థాయిలో జ్వరం కనిపిస్తుంది.డెంగీ జ్వరం: జ్వరం తీవ్ర స్థాయిలో ఉంటుంది. తలనొప్పి, రొంప, కీళ్ల నొప్పులు, గొంతునొప్పి, కళ్ళు ఎర్రబారడం జరుగుతుంది. ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోకుండా జాగ్రత్తపడాలి. శరీలంలో మచ్చలు వస్తే ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయినట్టుగా భావించవచ్చు. చికెన్గున్యా: ఈ వ్యాధి దీర్ఘకాలంపాటు ఉండొచ్చు. కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. రెండు నెలలు నుంచి ఏడాది పాటు ఈ నొప్పులు బాధించవచ్చు.వరల్డ్ మస్కిటో డే ప్రాధాన్యం ఇదీ..బ్రిటీషు దేశానికి చెందిన రొనాల్డ్ రాస్ అనే సైంటిస్ట్ ప్రజలను పట్టిపీడిస్తున్న జ్వరాలపై పరిశోధన చేశాడు. అనాఫెలస్ అనే ఆడ దోమ వల్ల మలేరియా అనే వ్యాధి సోకుతుందన్న విషయాన్ని 1897 ఆగస్టు 20న ప్రపంచానికి తన పరిశోధన ద్వారా తెలియపర్చాడు. ఆయన సేవలకు గుర్తింపుగా ఆగస్టు 20ను అంతర్జాతీయ దోమల నివారణ దినంగా ప్రకటించారు.- రొనాల్డ్ రాస్, సైంటిస్ట్ -
ఏ రకమైన దోమ కుడితే ఎలాంటి వ్యాధి వస్తుందో తెలుసా?
World Mosquito Day 2026 అసలే వర్షాకాలం సీజన్.. సరైన పారిశుధ్య చర్యలు చేపట్టక దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో అంటువ్యాధుల వ్యాప్తి పెరుగుతోంది. దోమల ద్వారా సంభవించే వ్యాధులపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాణానికే ప్రమాదంగా మారుతుంది. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో నిధుల లేమి, ఇతరత్రా కారణాల వల్ల పారిశుధ్య చర్యలు చేపట్టడం లేదు. దీనివల్ల దోమల వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతోంది. దోమలు కుట్టడం ద్వారా మలేరియా, డెంగీ, చికున్గున్యా, జికా వైరస్ వంటి ప్రమాదకర వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. దీంతో పాటు కొన్ని ఏరియాల్లో ఎల్లో ఫీవర్, ఎలిఫెంటియాసిస్, వెస్ట్ నైల్ వైరస్ వ్యాధులు కూడా అరుదుగా సంభవిస్తున్నాయి. ఈ వ్యాధుల నివారణకు తీసుకోవలసిన చర్యలను వివరిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఏటా ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాధి సంభవిస్తుందనే విషయాన్ని బ్రిటన్ వైద్యుడు సర్ రోనాల్డ్ రాస్ 1897 ఆగస్టు 20న కనుగొనడంతో అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రపంచ వ్యాప్తంగా దోమల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 56 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. దోమకాటుపై అలసత్వం వద్దు చిన్న దోమ కుట్టడం వల్ల పెద్ద వ్యాధి సోకే అవకాశముంది. దోమల ద్వారా వ్యాధి సోకిన వ్యక్తి సకాలంలో చికిత్స తీసుకోకుండా అలసత్వం వహిస్తే ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది. దోమల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రతి శుక్రవారం డ్రైడేను పాటిస్తున్నా దోమల ఉధృతి మాత్రం తగ్గడం లేదు. అయితే వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా దోమలను సులభంగా నియంత్రించే అవకాశ«ం ఉంది. సంపూర్ణ పారిశుధ్య చర్యలు పాటించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టి అంటువ్యాధులను నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2500 రకాల దోమలు ఉండగా అందులో ఏడు జాతులు ఎక్కువ వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. అయితే దేశంలో ప్రధానంగా అనాఫిలిస్, ఏడీఎస్, క్యూలెక్స్ దోమల వల్ల దేశంలో విస్తృతంగా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. మిగతా రకాలైన కులిసేట, మాన్సోనియా, సోరోఫోరా, టోక్సోరిన్కైట్స్ జాతి దోమలు స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల అంతగా ప్రభావం చూపలేవు.దోమల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇంటి పరిసరాల్లో అపరిశుభ్రత ఉండకూడదు ఇంటిచుట్టూ మురుగునీరు నిల్వ ఉండకూడదు సాయంకాలం తరువాత ఇంటి కిటీకీలు, తలుపులు మూసి ఉంచాలి నిద్రించే సమయంలో దోమలు తెరలు ఏర్పాటు చేసుకోవాలి. శరీరం పూర్తిగా కప్పి ఉంచేలా పొడవైన దుస్తులు ధరించాలి. తగినంత నీరు తాగాలి. ఆహార సమతుల్యతను పాటించాలి. కూలర్లు, కుండీల్లో వారినికోసారి నీటిని మార్చాలి.ఏ రకమైన దోమ కుడితే ఏం వస్తుందంటే.. ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం ద్వారా మలేరియా సోకుతుంది సూక్ష్మజీవి ద్వారా డెంగీ వ్యాప్తి చెందుతుంది. చికున్గున్యా ఏడీఎస్ దోమ కుట్టడం వల్ల చికున్గున్యా వస్తుంది. ఏడీఎస్ ఈజిప్టు దోమ కుడితే జికా వైరస్ సోకుతుంది. ఇది లైంగిక సంపర్కం ద్వారా మరొకరికి కూడా సోకుతుంది. క్యూలెక్స్ దోమ రాత్రి వేళల్లో కుడుతుంది. దీని వలన బోదకాలు వ్యాధి సంభవిస్తుంది.ఇదీ చదవండి: త్విషా శర్మ : నన్ను ప్రశాంతంగా చావనివ్వండి : ఆ 90నిమిషాల్లో ఏం జరిగింది? -
World Mosquito Day: ప్రాణి చిన్నది.. ప్రమాదం పెద్దది..!
సీతంపేట: మలేరియా, డెంగీ, చికున్ గున్యా పేర్లు వినని వారు ఉండరు. దోమవల్ల వ్యాపించే ప్రాణాంతకమైన జ్వరాలివి. చిన్నదోమ ఎంత పెద ప్రమాదాన్ని తీసుకువస్తుందో చెప్పడానికి ఈ జ్వరాలే ఉదాహరణ. మనుషుల రక్తాన్ని పీల్చి వ్యాధుల బారిన పడవేసే దోమల బెడద పట్టణాలతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. దోమల బారిన పడకుండా వాటిని తరిమి కొట్టే జాగ్రత్తలు తీసుకుంటేనే అనారోగ్యాల బారిన పడకుండా ఉండగలమని వైద్యులు సూచిస్తున్నారు. దోమల దినం ఎందుకంటే.. ప్రపంచానికి కామన్ శత్రువుగా మారిన దోమల ఆట కట్టించడానికి సర్ రోనాల్డ్ రాస్ శతాబ్దం క్రితమే రంగంలోకి దిగారు. 1897లో ఆయన దోమల ద్వారానే మలేరియా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని నిర్ధారించారు. ఈ పరిశోధనకు గానూ ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని లండన్ స్కూల్ ఆఫ్ హైజెనిక్ అండ్ ట్రాపికల్ మెడిసన్ ఆగస్టు 20వ తేదీని అంతర్జాతీయ దోమల నివారణ దినంగా ప్రకటించింది. అరికట్టేదెలా.. దోమ ఎగురుతున్నపుడు పట్టుకోవడం, చంపడం చాలా కష్టం. ఒక్క దోమను పట్టుకోవాలంటే ఎంతో శ్రమించాలి. కాని దోమలు నీటిలో లార్వా, ప్యూపా దశలో పెరుగుతున్నపుడు నాశనం చేయడం సులువు. అవి ఇంటిలో నీటిని నిల్వ చేసే కుండీల్లో చిన్నచిన్న పురుగుల్లా కనిపిస్తుంటాయి. దోమ పిల్లలు (లార్వా) నిల్వ నీటిలో ఉన్నట్లయితే ఆ నీటిని మట్టి లేదా ఇసుకలో పారబోయాలి. ఇలా చేయడం వల్ల లార్వా, ప్యూపా దశల్లో ఉన్న వాటిని వందల సంఖ్యలో నాశనం చేయవచ్చు. నిలువ ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెడతాయి. ఒక దోమ వంద నుంచి 200 వరకు గుడ్లను పెడుతుంది. ఇవన్నీ కేవలం 8 నుంచి 10 రోజుల్లో దోమలుగా మారిపోతాయి. గుడ్డు నుంచి లార్వా, ప్యూపా, అడల్ట్ మస్కిటోగా రూపాంతరం చెందుతాయి. దోమలదాడికి లక్షల్లో ఖర్చు.. దోమలు ప్రజారోగ్యాన్ని కాటేస్తున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా రక్తాన్ని పీల్చేస్తున్నాయి. దోమల దాడిని తట్టుకునేందుకు ప్రతి నెల నిత్యావసర సామగ్రి మాదిరిగానే లిక్విడ్స్, మస్కిటో రీఫిల్స్, కాయిల్స్, మస్కిటో ధూప్స్టిక్స్ వంటి వాటికి నెలకు రూ.100 నుంచి రూ.500 వరకు ఒక్కో కుటుంబం ఖర్చు చేస్తోంది. ఇవి కాకుండా దోమల బ్యాట్స్, దోమతెరలు, యాంటీ మస్కిటోమెస్ వంటి వాటికోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించక తప్పడం లేదు. ఆడదోమలే ప్రమాదకరం.. మగ దోమలు చెట్ల రసాలను పీల్చి బతుకుతాయి. ఆడ దోమలు మాత్రం సంతానాభివృద్ధిలో భాగంగా గుడ్లు పెట్టడానికి మనిషి రక్తాన్ని పీల్చుతుంటాయి. ఈ క్రమంలో వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని కుట్టిన దోమ ఆ వ్యక్తి రక్తాన్ని పీల్చినపుడు రక్తంతో పాటు వ్యాధి కారకమైన పారాసైట్ దోమ లాలాజల గ్రంధుల్లోకి చేరుతుంది. అక్కడ పారాసైట్లో కొన్ని మార్పులు జరుగుతాయి. మరో ఆరోగ్యవంతమైన వ్యక్తిని అదే దోమ కుట్టినపుడు దాని లాలాజలంతో పాటు పారసైట్ ఆ వ్యక్తి రక్తంలో చేరి వ్యాధులకు కారణమవుతుంది. అనార్థాలివే.. ► ఆడ ఎనాఫిలస్ దోమ కుట్టడం వల్ల మలేరియా,డెంగీ, చికెన్గున్యా జ్వరాలు, ఈడిస్, క్యూలెక్స్ దోమలవల్ల బోదకాలు వస్తాయి. ► జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే వర్షాల కారణంగా రోడ్లపైన కొబ్బరిబొండాలు, పాతటైర్లు, రుబ్బురోళ్లలో నిల్వ ఉన్న నీరు వీటి ఆవాస కేంద్రాలు. ► అవసరాల కోసం నీటిని కుండీలు, ఓవర్హెడ్ ట్యాంకుల్లో నీటిని నిల్వ చేయడం వల్ల దోమలు వృద్ధి చెంది వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. నివారణ ఇలా .. ► వేపనూనె దోమలను తరిమికొట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని వాసన దోమలు భరించలేవు. వేప,కొబ్బరినూనెలను సమాన భాగాలుగా చేసుకుని బయటకు కనిపించే శరీర భాగాలపై రాసుకుంటే దోమలు దరిచేరవు. ► ఇళ్లలోకి దోమలు ప్రవేశించే కిటికీల వంటి ద్వారాల వద్ద తులసి మొక్కలను పెంచాలి. ఇవి దోమలను దూరం చేస్తాయి. దోమల వృద్ధి లేకుండా చూస్తాయి. ► లెమన్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ మిశ్రమం దోమలను తరిమికొడుతుంది. దోమలను తరిమికొట్టడంలో కర్పూరం మెరుగ్గా పనిచేస్తుంది. ఖాళీ ప్రదేశాలను మూసిన తర్వాత కర్పూరాన్ని వెలిగిస్తే దానినుంచి వచ్చే పొగకు దోమలు మాయమవుతాయి. తగ్గిన హైరిస్క్ గ్రామాలు దోమల నివారణకు మూడేళ్లుగా ప్రభుత్వ చేపట్టిన చర్యల వల్ల మలేరియా,డెంగీ, చికున్గున్యాలు దశలవారీగా తగ్గుముఖం పడుతున్నాయి. జిల్లాలో ఒకప్పుడు మలేరియా పాజిటివ్గా 100కు పైగా ఉన్న హైరిస్క్ మలేరియా గ్రామాలు ఇప్పుడు 45కు తగ్గుముఖం పట్టాయి. ఈనెల 16నుంచి 31 వరకు మొదటి రౌండ్ సింథటిక్ ఫైరాత్రిన్ జిల్లా వ్యాప్తంగా పిచికారీ చేశారు. 2 లక్షలకు పైగా దోమతెరలు పంపిణీ చేశారు. అలాగే 4లక్షలు పైగా గంబూషియా చేపలను నీటి కుంటల్లో వేశారు. దోమల నివారణకు విస్తృత చర్యలు దోమల నివారణకు విస్తృతంగా చర్యలు చేపడుతున్నాం. దోమల నివారణ మందు పిచికారీ చేస్తున్నాం. గ్రామాల్లో దోమతెరల విని యోగంపై గిరిజనులకు చైత న్యం కలిగిస్తున్నాం. గ్రామాల్లో ఎక్కడైనా మలేరియా, డెంగీ జ్వరాలు ప్రబలితే వెంటనే మెడికల్ క్యాంపులు పెడుతున్నాం. ర్యాపిడ్ ఫీవర్, మలేరియా సర్వేలు చేస్తున్నాం. ఒకసారి ఏ గ్రామంలోనైనా జ్వరాలకు సంబంధించి పాజిటివ్ వస్తే మళ్లీ అక్కడ రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. -కె.పైడిరాజు, జిల్లా మలేరియానివారణాధికారి -
ఎవరు కుడితే మంచానికి అతుక్కుపోతారో..
ఓయ్.. బాగున్నారా.. నేనుండగా మీరెలా బాగుంటారు లెండి. నేను మాత్రం హాయిగానే ఉన్నాను. ఈ మధ్య మీరు కాసింత ఇబ్బంది పెడుతున్నా ఓర్చుకుంటూ జబ్బుల్ని అంటించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాను. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ.. ‘ఎవరు కుడితే మలేరియా, డెంగీలు వచ్చి.. మనిషి మంచానికి అతుక్కుపోతాడో.. వాడే దోమ గాడు. నేను’.. బిల్డప్ ఎక్కువైందని అనుకుంటున్నారా.. 123 ఏళ్లుగా మిమ్మల్ని ఓడిస్తూనే ఉన్నాను కదా. ఆ మాత్రం బిల్డప్ ఇవ్వకపోతే ఎలా..? ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ రోజు నా దినం. తద్దినం కాదు. ఎప్పుడో 1897 ఆగస్టు 20 రొనాల్డ్ రాస్ మా ద్వారానే మలేరియా వస్తుందని లోకానికి చెప్పాడు. అందుకే ఏటా ఈ రోజు న మా దినం చేస్తుంటారు. మేము కాటు వేయడం వల్ల మనిషి చనిపోతాడని ఇన్నేళ్లుగా మమ్మల్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఓడిపోతూనే ఉన్నారు. మా సక్సెస్ సీక్రెట్ చెప్పనా..? నిజానికి మీ బద్దకమే మా జాతికి శ్రీరామరక్ష. మీరు నమ్మండి.. నమ్మకపోండి.. మేము బతికేది మ హా అయితే 15 రోజులు మాత్రమే. ఈ లోగానే వీలైనంత మందికి రోగాలను కానుకగా ఇచ్చి మా జన్మను సార్థకం చేసుకుంటూ ఉంటాం. అందుకు మీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ రెండు వారాలైనా మేము బతకడానికి మీరే కూ డు, గూడు ఇస్తారు. గుడ్డ మాకు అవసరం లేదనుకోండి. మీ ఇళ్లు, మీ వాకిలి, మీ ఇంట్లో మూలలు, మంచం, బీరువా, సోఫా సెట్, అటకలు, పాత సామాన్లు దాచే ఇరుకు సందులు, మీ స్టోర్ రూమ్లు, రెస్ట్ రూమ్లు, ఆఫీసులు, వాహనాలు, మీ ఇంటి చుట్టూ ఉంటే పిచ్చి మొ క్కలు, మీరు తినేసి బయటకు విసిరేసే వ్యర్థాలు, పాత టైర్లు, నీటి కుళాయిలు, బోర్లు, బావుల చుట్టూ ఉన్న మురికి ప్రాంతాలు.. ఇలా అంతా మా రాజ్యమే. ఇంత చిన్న ప్రాణులమైన మమ్మల్ని ఓడించలేక వందేళ్లుగా మీరు ఆపసోపాలు పడుతున్నారు. ఈ విషయం తలచుకుంటే తెగ నవ్వొస్తుంది. ఇల్లు శుభ్రం చేయకుండా కేవలం నినాదాలు చేస్తే మేం చచ్చిపోతామా చెప్పండి. దోమలపై దండయాత్ర అని పెద్ద పెద్ద మాటలు అంటారు. ప్రభుత్వాల చేత కోట్లు కొద్దీ ఖర్చు చేస్తారు. పాపం సర్కార్లు మాత్రం ఏం చేస్తాయి... మీ ఇల్లు, వాకిలి మీరు శుభ్రంగా ఉంచుకుంటే చాలు కదా.. వర్షాకాలం వస్తే చాలు గ్రామాల్లో హడావుడి చేస్తారు. మేము కాటు వేయకూడదని దోమతెరలే పంపిణీ చేస్తున్నారు. అప్పుడైతే ఒక్క మలేరియా, పైలేరియా, చికున్ గున్యాతోనే సరిపెట్టేవారం. ఇప్పుడు డెంగీ అంటూ కొత్త జబ్బు అంటగడుతున్నాం. అంటే మా అంతం చూడాలనుకుంటున్న మీకు సవాల్గా మారుతున్నామన్న మాటే. ఇన్నేళ్లుగా మీ రక్తం తాగుతున్న విశ్వాసంతో.. మీకు కొన్ని సలహాలు ఇస్తాను.. పాటిస్తారా లేదా అన్నది మీ ఇష్టం. ♦మీ ఇళ్లకు గాలి, వెలుతురు బాగా తగిలేలా చూసుకోండి. మీ ఇంట్లో అన్ని మూలల్లోను నీటుగా ఉంచుకోండి. మంచాలు, బీరువాల కింద చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ♦పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాలు, మురికినీటి గుంటలు లేకుండా చూసుకోండి. ♦వారంలో ఒకరోజైనా ఇంటిలోపల అన్ని ప్రాంతాలు, మూలలు పరిశుభ్రం చేసుకోవాలి. మీ టీవీ, కంప్యూటర్, వాషింగ్ మెషీన్, ఫ్రిజ్ వంటివి కొనేటప్పుడు వచ్చే ప్యాకింగ్ డొక్కులు ఇంట్లో ఉంచకండి. ♦వారంలో ఒకటి రెండు రోజులు ఇంట్లో అన్ని గదుల్లోనూ వేపాకులతో పాటు గుగ్గిలం ధూపం వేయండి. ♦మీ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. పిచ్చి మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించండి. కుళా యిలు, బోర్లు, బావుల వద్ద నీటి నిల్వ లేకుండా చేయడంతో పాటు క్లోరినేషన్ చేయిస్తూ ఉండండి. ♦ఇలా చేస్తే మేం పూర్తిగా అంతరించం గానీ ప్రభావమైతే తగ్గుతుంది. సరే.. ఈ రోజు మా దినం కదా. కొద్దిగా రక్తం తాగేసి ఈ రోజుకు రెస్ట్ తీసుకుంటా.. బై. ప్రేమతో మీ దోమ.. – ఎల్ఎన్ పేట -
మాకు ఇండియా అంటేనే ఎక్కువ ఇష్టం!
హలో హాయ్. నా పేరు దోమ. నేను మనుషుల రక్తాన్ని పీల్చే పిశాచినని అందరూ అనుకుంటారు. నన్ను విలన్గా చూస్తూ అందరూ తిట్టుకుంటూ ఉంటారు. అందుకే రాజమౌళి కూడా తన సినిమాలో ఈగనే హీరో గా చూపించాడు. మీరు నన్ను తిట్టే తిట్లవల్లే ఆ దేవుడు నాకు తక్కువ ఆయుష్షును ప్రసాదించాడేమో. కానీ నేనూ జీవినే. నా వల్ల కలిగే ప్రయోజనాలను పక్కనపెట్టి.. కేవలం నా వల్ల కలిగే జబ్బుల గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇప్పటికీ నేను చెప్పేది మీరు నమ్మకపోవచ్చు. నా వల్ల లాభాలేంటి అని ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు తెలియాలంటే వీడియోని క్లిక్చేయండి.


