breaking news
Womens chess
-
‘మహిళలు ఓపెన్ టోర్నీల్లో పాల్గొనాలి’
చెన్నై: మహిళల చెస్లో భారత క్రీడాకారిణులు ముందంజ వేయాలంటే ఎక్కువ సంఖ్యలో ఓపెన్ టోర్నీల్లో పాల్గొనాలని సీనియర్ ప్లేయర్, ఉమెన్ గ్రాండ్మాస్టర్ (డబ్ల్యూజీఎం) తానియా సచ్దేవ్ అభిప్రాయపడింది. మహిళల టోర్నీలకు పూర్తిగా దూరం కావద్దని... అయితే పురుషులతో ఓపెన్ కేటగిరీలో పోటీ పడితే ఆట ఎంతో మెరుగవుతుందని ఆమె వ్యాఖ్యానించింది. గత ఏడాది చెస్ ఒలింపియాడ్ నెగ్గిన భారత జట్టులో సభ్యురాలైన తానియా... ప్రస్తుతం చెన్నై గ్రాండ్మాస్టర్స్ టోర్నీలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ‘చెస్ కెరీర్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అమ్మాయిలు సాధ్యమైనన్ని ఎక్కువ ఓపెన్ టోర్నమెంట్లలో ఆడాలి. కేవలం మహిళల టోర్నీలకే పరిమితం కాకుండా పురుషులతో కలిసి శిక్షణ పొందడంతో పాటు వారితో పోటీ పడాలి. అప్పుడే వారి ఆట మరింత పదునెక్కుతుంది’ అని తానియా పేర్కొంది. అయితే పెద్ద స్థాయికి చేరే ముందు మహిళా టోర్నీల్లో విజయాలు సాధించడం కూడా ముఖ్యమని, అవి కెరీర్లో ముందుకు వెళ్లేందుకు కావాల్సిన ప్రేరణను అందిస్తాయని తానియా చెప్పింది. ‘మహిళల విభాగంలో సాధించే విజయాలను కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇవి కొత్త తరం అమ్మాయిలు చెస్ను ఎంచుకునేందుకు కావాల్సిన స్ఫూర్తిని ఇస్తాయి. ఓపెన్ టోర్నీల్లో పాల్గొనడం, మహిళల టోర్నీల్లో టైటిల్స్ గెలవడం రెండూ కూడా ముఖ్యమే. ఏదీ తక్కువ కాదు. సరిగ్గా చెప్పాలంటే కెరీర్లో ఎదిగే సమయంలో ఇది మధ్యేమార్గంలాంటిది. అయితే కేవలం మహిళల టోర్నీల్లోనే పాల్గొంటే వారు తమ స్థాయిని తగ్గించుకున్నట్లే. పూర్తి స్థాయిలో తమ సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని వారు కోల్పోతారు’ అని 38 ఏళ్ల తానియా విశ్లేషించింది. అంతర్జాతీయ స్థాయిలో మన మహిళా చెస్ క్రీడాకారిణుల తాజా ప్రదర్శన పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ‘ఫిడే’ వరల్డ్ కప్ ఫైనల్లో తలపడిన కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్లపై ఆమె ప్రశంసలు కురిపించింది. ‘మన దేశానికి సంబంధించి ఇప్పుడు చెస్లో స్వర్ణ యుగం నడుస్తున్నట్లుగా ఉంది. ఇలాంటి సమయంలో మేమేం తక్కువ కాదన్నట్లుగా మహిళలు నిరూపించుకుంటున్నారు. ఒక మెగా టోర్నీ ఫైనల్లో రెండు వేర్వేరు తరాలకు చెందిన భారత ప్లేయర్లు పోటీ పడటం మామూలు విషయం కాదు. చెస్ను చూసి ఈ ఆటను ఎంచుకోవాలనుకునే అమ్మాయిలకు ఇది కావాల్సినంత స్ఫూర్తిని అందిస్తుంది’ అని తానియా అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కెరీర్ చివరి దశలో ఉన్నా తనలో ఇంకా సత్తా ఉందన్న తానియా... ఏడాదికి ఒకటి లేదా రెండు చొప్పున టోర్నీలు ఆడుతూ చెస్ వ్యాఖ్యానంపైనే ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించింది. -
హారికపై గెలుపుతో సెమీస్లో దివ్య
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత్కు చెందిన అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం), జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారికతో సోమవారం జరిగిన టైబ్రేక్లో మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల దివ్య 2–0తో విజయం సాధించింది. ఈ ఇద్దరి మధ్య ఆదివారం నిరీ్ణత రెండు గేమ్లు ముగిశాక స్కోరు 1–1తో సమంగా ఉండటంతో... విజేతను నిర్ణయించేందుకు సోమవారం టైబ్రేక్ నిర్వహించారు. తొలి గేమ్లో తెల్ల పావులతో ఆడిన దివ్య 57 ఎత్తుల్లో గెలిచింది. సెమీస్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచి్చతంగా గెలవాల్సిన రెండో గేమ్లో తెల్ల పావులతో ఆడిన హారిక 76 ఎత్తుల్లో ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. నేడు జరిగే సెమీఫైనల్స్ తొలి గేమ్లలో టింగ్జీ లె (చైనా)తో భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి; టాన్ జోంగి (చైనా)తో దివ్య తలపడతారు. భారత్ నుంచి ఇద్దరు ప్లేయర్లు సెమీఫైనల్ చేరుకోవడంతో ఒక పతకం ఖాయమైంది. అంతేకాకుండా వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి కూడా భారత్కు ఒక బెర్త్ ఖరారైంది. ప్రపంచకప్ టోర్నీలో టాప్–3లో నిలిచిన ప్లేయర్లు ప్రపంచ చాంపియన్ ప్రత్యరి్థని నిర్ణయించే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత పొందుతారు. -
వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా తెలుగు తేజం
భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా నిలిచింది. ఈ మెగా టోర్నీలో హంపి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి విజేతగా అవతరించింది. న్యూయార్క్లోని వాల్ స్ట్రీట్లో ఇవాళ (డిసెంబర్ 29) జరిగిన 11వ రౌండ్లో హంపి ఐరీన్ సుకందర్ను ఓడించింది. ఈ టోర్నీలో మరో భారత గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.👏 Congratulations to 🇮🇳 Humpy Koneru, the 2024 FIDE Women’s World Rapid Champion! 🏆#RapidBlitz #WomenInChess pic.twitter.com/CCg3nrtZAV— International Chess Federation (@FIDE_chess) December 28, 2024హంపి మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా నిలవడం ఇది రెండో సారి. 2019లో హంపి తొలిసారి వరల్డ్ ర్యాపిడ్ చెస్ టైటిల్ను నెగ్గింది. హంపికి ముందు చైనాకు చెందిన జు వెంజున్ మాత్రమే వరల్డ్ ర్యాపిడ్ చెస్ టైటిళ్లను ఒకటి కంటే ఎక్కువ సార్లు నెగ్గింది.పురుషుల విభాగం విజేతగా..వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ పురుషుల విభాగం విజేతగా రష్యాకు చెందిన 18 ఏళ్ల గ్రాండ్మాస్టర్ వోలోదర్ ముర్జిన్ నిలిచాడు. ముర్జిన్ 13 రౌండ్లలో 10 పాయింట్లు సాధించి ఛాంపియన్గా అవతరించాడు. ఈ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొమ్మిది రౌండ్లు పూర్తయ్యే వరకు అగ్రస్థానంలో నిలిచిన అర్జున్.. చివరి రౌండ్లలో వెనుకపడిపోయాడు. -
వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్న దివ్య
గుజరాత్లోని గాంధీ నగర్లో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ జూనియర్ (అండర్-20 అమ్మాయిల విభాగం) చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత నంబర్ 3 క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్ విజేతగా నిలిచింది. 18 ఏళ్ల దివ్య.. ఫైనల్ రౌండ్లో బల్గేరియాకు చెందిన బెలొస్లావా క్రస్టేవాపై విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్షిప్ను సొంతం చేసుకుంది. మొత్తం 11 పాయింట్లకు గానూ 10 పాయింట్లు సాధించిన దివ్వ టాప్ ప్లేస్లో నిలిచింది.ఈ పోటీలో దివ్య తెల్ల పావులతో బరిలోకి దిగింది. గత నెలలో షార్జా ఛాలెంజర్స్ టైటిల్ గెలిచిన తర్వాత దివ్యకు ఇది వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం. వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో దివ్య తర్వాతి స్థానంలో 20 ఏళ్ల ఆర్మేనియా క్రీడాకారిణి మరియమ్ నిలిచింది. మరియమ్ 11 పాయింట్లకు గాను 9.5 పాయింట్లు సాధించింది. మూడో స్థానంలో అజర్ బైజాన్కు చెందిన అయాన్ అల్లావెర్దియేవా నిలిచింది. ఈమె ఖాతాలో 8.5 పాయింట్లు ఉన్నాయి. భారత్కు చెందిన షుబి గుప్తా, రక్షిత రవి 8, 7.5 పాయింట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన దివ్య రెండు డ్రాలు, తొమ్మిది విజయాలు సాధించి, తన ఎనిమిదో జూనియర్ టైటిల్ను కైవసం చేసుకుంది. -
‘సడన్డెత్’లో హారిక విజయం
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక... ఓపెన్ విభాగంలో నిహాల్ సరీన్, విదిత్ సంతోష్ గుజరాతి నాలుగో రౌండ్లోకి ప్రవేశించారు. సోమవారం జరిగిన మూడో రౌండ్ టైబ్రేక్ పోటీల్లో హారిక 5.5–4.5తో లెలా జవఖి‹Ùవిలి (జార్జియా)పై... నిహాల్ 2.5–1.5తో డేనియల్ బొగ్డాన్ (రొమేనియా)పై... విదిత్ 5–4తో మథియాస్ బ్లూ»ౌమ్ (జర్మనీ)పై విజయం సాధించారు. ఆదివారం రెండు క్లాసికల్ గేమ్లు ‘డ్రా’ కావడంతో హారిక–లెలా మధ్య విజేతను నిర్ణయించేందుకు సోమవారం టైబ్రేక్ గేమ్లు నిర్వహించారు. వీరిద్దరు ముందుగా 25 నిమిషాల నిడివి గల రెండు ర్యాపిడ్ గేమ్లు ఆడారు. రెండూ ‘డ్రా’గా ముగియడంతో 2–2తో సమంగా నిలిచారు. దాంతో 10 నిమిషాలు నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్లు నిర్వహించారు. ఇందులో చెరో గేమ్లో గెలవడంతో స్కోరు 3–3తో సమమైంది. అనంతరం 5 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్లు ఆడించగా...రెండూ ‘డ్రా’ కావడంతో స్కోరు 4–4తో నిలిచింది. దాంతో విజేతను నిర్ణయించేందుకు ఆఖరుగా 3 నిమిషాల నిడివిగల ‘సడన్డెత్’ గేమ్లు మొదలయ్యాయి. ‘సడన్డెత్’లో ‘డ్రా’ అయితే విజేత తేలేవరకు గేమ్లు నిర్వహిస్తారు, గెలిస్తే మాత్రం వెంటనే ముగిస్తారు. ఇందులో హారిక, లెలా తొలి గేమ్ ‘డ్రా’కాగా... రెండో గేమ్లో హారిక 59 ఎత్తుల్లో నెగ్గి నాలుగో రౌండ్ బెర్త్ను ఖరారు చేసుకుంది. -
విశ్వవిజేత కోనేరు హంపి
మాస్కో: భారత నంబర్వన్ మహిళా చెస్ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ (జీఎం) కోనేరు హంపి తన కెరీర్లోనే అతి గొప్ప విజయం సాధించింది. శనివారం ముగిసిన ప్రతిష్టాత్మక ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ లో హంపి మహిళల విభాగంలో విశ్వవిజేతగా అవతరించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టించింది. నిరీ్ణత 12 రౌండ్ల తర్వాత కోనేరు హంపి, లీ టింగ్జి (చైనా), అతాలిక్ ఎకతెరీనా (టర్కీ) 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్ను వర్గీకరించగా హంపి, లీ టింగ్జి తొలి రెండు స్థానాల్లో... అతాలిక్ మూడో స్థానంలో నిలిచారు. దాంతో అతాలిక్కు కాంస్యం ఖాయమైంది. హంపి, లీ టింగ్జి మధ్య ప్రపంచ చాంపియన్ ఎవరో నిర్ణయించేందుకు ముందుగా రెండు బ్లిట్జ్ గేమ్లు నిర్వహించారు. తొలి బ్లిట్జ్ గేమ్లో తెల్లపావులతో ఆడిన హంపి 29 ఎత్తుల్లో ఓడిపోగా... రెండో బ్లిట్జ్ గేమ్లో నల్లపావులతో ఆడిన హంపి 45 ఎత్తుల్లో గెలిచింది. దాంతో టైబ్రేక్లోనూ ఇద్దరు 1–1తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు చివరగా ‘అర్మగెడాన్ గేమ్’ను నిర్వహించారు. ‘అర్మగెడాన్’ నిబంధన ప్రకారం గేమ్లో తెల్లపావులతో ఆడిన వారు తప్పనిసరిగా గెలవాలి. ఒకవేళ ‘డ్రా’ అయితే మాత్రం నల్లపావులతో ఆడిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ అర్మగెడాన్ గేమ్లో హంపి 66 ఎత్తుల్లో గేమ్ను ‘డ్రా’ చేసుకోవడంతో ఆమె ప్రపంచ చాంపియన్గా ఆవిర్భవించింది. లీ టింగ్జి రన్నరప్గా నిలిచి రజత పతకంతో సరిపెట్టుకుంది. అంతకుముందు నిరీ్ణత 12 రౌండ్లలో హంపి ఏడు గేముల్లో గెలిచింది. హంపి... మార్గరిటా పొటపోవా, నినో ఖోమెరికో, కొవలెవ్స్కాయ, ఓల్గా గిరియా, నానా జాగ్నిద్జే, దరియా వోయిట్, తాన్ జోంగిలపై గెలిచింది. దరియా చరోచిక్నా, అనా ముజిచుక్, అతాలిక్ ఎకతెరీనా, కాటరీనా లాగ్నోలతో గేమ్లను ‘డ్రా’ చేసుకుంది. ఇరీనా బుల్మగా చేతిలో ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక 8 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచింది. మరోవైపు ఓపెన్ విభాగంలో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) విశ్వవిజేతగా నిలిచాడు. ►2 ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ చరిత్రలో హంపి గెలిచిన పతకాల సంఖ్య. 2012లో హంపి కాంస్య పతకం సాధించింది. ►2 భారత్ తరఫున ర్యాపిడ్ విభాగంలో ప్రపంచ చాంపియన్గా నిలిచిన రెండో ప్లేయర్ హంపి. 2017లో విశ్వనాథన్ ఆనంద్ ఓపెన్ విభాగంలో విశ్వవిజేతగా నిలిచాడు. -
హారిక ఖాతాలో మూడో ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ అంతర్జాతీయ మహిళల చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక వరుసగా మూడో ‘డ్రా’ నమోదు చేసింది. రష్యా గ్రాండ్మాస్టర్ వాలెంటినా గునీనాతో జరిగిన మూడో గేమ్ను హారిక 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. అంతకు ముందు మేరీ సెబాగ్ (ఫ్రాన్స్)తో జరిగిన తొలి గేమ్ను హారిక 45 ఎత్తుల్లో... నానా జాగ్నిద్జే (జార్జియా)తో జరిగిన రెండో గేమ్ను 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. పది మంది మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో మూడో రౌండ్ తర్వాత హారిక 1.5 పాయింట్లతో ఐదో ర్యాంక్లో ఉంది. పది మందిలో ఆరుగురు గ్రాండ్మాస్టర్లు (జీఎం) కాగా, మరో నలుగురు అంతర్జాతీయ మాస్టర్లు (ఐఎం)లు ఉన్నారు. లక్షా 50 వేల డాలర్ల ప్రైజ్మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పది మందికీ ప్రైజ్మనీ లభించనుంది. విజేతకు 40 వేల డాలర్లు (రూ. 28 లక్షల 47 వేలు), రన్నరప్కు 30 వేల డాలర్లు (రూ. 21 లక్షల 35 వేలు), మూడో స్థానంలో నిలిచిన వారికి 20 వేల డాలర్లు (రూ.14 లక్షల 23 వేలు) అందజేస్తారు. -
హారిక, పద్మిని గేమ్లు ‘డ్రా’
టెహరాన్ (ఇరాన్): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్షిప్లో భారత క్రీడాకారిణులు ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్ ప్రిక్వార్టర్ ఫైనల్ తొలి గేమ్లను ‘డ్రా’ చేసుకున్నారు. సొపికో గురామిష్విలి (జార్జియా)తో జరిగిన గేమ్లో నల్లపావులతో ఆడిన హారిక 49 ఎత్తుల్లో... తాన్ జోంగి (చైనా)తో జరిగిన గేమ్లో నల్లపావులతో ఆడిన పద్మిని 60 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. శనివారం జరిగే రెండో రౌండ్లో గెలిచిన వారు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తారు.