breaking news
women oriented films
-
ఒకప్పటిలా కాదు.. హీరోయిన్స్ అంటే వాటికే పరిమితం కాదు
మనది పురుషాధిక్య సమాజం. అన్నింటిలోనూ వాళ్లే ముందుంటారు, వాళ్లదే పైచేయి. రాజకీయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కార్యనిర్వాహణ కావచ్చు, చివరికి ఎంటర్టైన్మెంట్ రంగం కావచ్చు, మహిళ అందులో పావుగానే ఉండేది. కానీ కాలం మారుతుంది. గ్లోబలైజేషన్ ప్రభావం, చదువుతో వచ్చిన చైతన్యం కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, మార్పుకి దోహదపడుతున్నాయి. అన్ని రంగాల్లో ఇప్పుడు మహిళలు దూసుకుపోతున్నారు. అన్ని రంగాల్లో తాము కూడా ఏదైనా చేయగలమని నిరూపిస్తున్నారు. సినిమా రంగంలోనూ కూడా హీరోయిన్ అంటే గ్లామర్ పాత్రలు, హీరో లవర్ పాత్రలకే పరిమితం అనే భావన క్రియేట్ అయ్యింది. కానీ నెమ్మదిగా దానిలోనుంచి బయటపడుతున్నారు. మహిళ పాత్రకు ప్రాధాన్యత పెంచుతున్నారు. అంతేకాదు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆదరణ పెరగడంతో ఆ దిశగా మేకర్స్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మహిళా సాధికారత నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చి ఆదరణ పొందాయి. ఎంతో కొంత సమాజంపై ఆ ఇంపాక్ట్ ని చూపించాయి. ఇటీవల కాలంలో ఉమెన్ ఎంపావర్మెంట్ ప్రధానంగా వచ్చిన సినిమాలు, వాటి ప్రత్యేకతలేంటో ఓ లుక్కేద్దాం. తెలుగులో.. `అరుంధతి` నుంచి `యశోద` వరకు.. టాలీవుడ్లో అనుష్క, సమంత వంటి కథానాయికలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ మెప్పిస్తున్నారు. అంతకు ముందే విజయశాంతి(కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ), జయసుధ(శివరంజని), సౌందర్య(అమ్మోరు)మహిళా ప్రాధాన్యతతో కూడిన సినిమాలు చేశారు మెప్పించారు. మహిళా శక్తిని చాటారు. హీరోయిజంలో పడి ఇండస్ట్రీ కొట్టుకుపోతున్న క్రమంలో ఈ హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ బ్యాక్ డ్రాప్లో మహిళా సాధికారతని చెప్పే చిత్రాలు చేసి మెప్పించారు. ఇటీవల కాలంలో అనుష్క శెట్టి ఇందులో ముందు వరుసలో ఉంది. ఆమె ఇప్పటికే `అరుంధతి`, `రుద్రమదేవి`, `భాగమతి`, `సైలెంట్` వంటి చిత్రాలు చేసింది. `అరుంధతి`తో అనుష్క సంచలనం.. దుష్ట శక్తిని ఎదుర్కొని ప్రజలను, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఓ మహిళ(జేజమ్మ) చేసిన పోరాటం నేపథ్యంలో `అరుంధతి` సాగుతుంది. ఇందులో అనుష్క పాత్రనే నిర్ణయాత్మక పాత్రగా ఉంటుంది. తనే స్వతహాగా పోరాడుతుంది. ఆ పోరాటంలో తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ విజయం సాధిస్తుంది. అయితే ఈ సినిమాలో చాలా వరకు మూఢ విశ్వాసం ఉన్నప్పటికీ ఓ మహిళా తిరుగుబాటు, పోరాట పటిమ అనే అంశం ఎంతో మంది ఆడవాళ్లని ఇన్స్పైర్ చేస్తుందని చెప్పొచ్చు. కోడి రామకృష్ణ రూపొందించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత అనుష్క నుంచి `రుద్రమదేవి`, `భాగమతి`, `సైలెంట్` చిత్రాలొచ్చాయి. చరిత్ర నేపథ్యంలో దర్శకుడు గుణశేఖర్ `రుద్రమదేవి`సినిమాని రూపొందించారు. ఓ అమ్మాయి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే అబ్బాయిగా పెరిగిన ఓ అమ్మాయి.. చివరికి కష్ట కాలంలో రాజ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు ఓ వీరుడిలా, ఓ యోధుడిలా పోరాడే ఇతివృత్తం ఇందులో ప్రధాన అంశం. మహిళల్లోని వీరత్వాన్ని చాటి చెప్పిందీ సినిమా. కమర్షియల్ ఇది పెద్దగా మెప్పించలేకపోయింది. అలాగే రాజకీయ క్రీడలో బలిపశువుగా మారిన భాగమతి దాన్నుంచి ఎలా బయటపడింది, రాజకీయ నాయకుల కుట్రలను ఎంత తెలివిగా దెబ్బకొట్టిందనే కాన్సెప్ట్ తో వచ్చిన `భాగమతి` సైతం ఆకట్టుకుంది. చాలా మందిని ఇన్స్పైర్ చేసింది. కానీ అనుష్క నటించిన మరో సినిమా `సైలెంట్` మాత్రం మెప్పించలేకపోయింది. ఈ సినిమాల్లోనూ అంతర్లీనంగా ఉమెన్ ఎంపావర్మెంట్ అంశాన్ని మనం చూడొచ్చు. `యశోద`తో సమంత జోరు కమర్షియల్ హీరోయిన్గా కెరీర్ని స్టార్ట్ చేసిన సమంత ఇటీవల `యశోద` సినిమాతో మెప్పించింది. మెడికల్ మాఫియా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మహిళా సాధికారత అనే అంశానికి సరైన అర్థాన్ని చెప్పింది. అద్దెగర్భం(సరోగసి) అనే అంశాన్ని తీసుకుని దర్శకుడు హరి-హరీష్ రూపొందించిన చిత్రమిది. ఇందులో అద్దెగర్భాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని కార్పొరేట్ మెడికల్ సంస్థలు నిర్వహిస్తున్న మాఫియాని, చీకటి కోణాలను వెలికితీసింది. సినిమా పరంగా ఇది ఫిక్షనల్గానే తీసినప్పటికీ, ప్రస్తుత సమాజంలోనూ ఇలాంటి అగడాలు జరుగుతున్నాయనేది ఈ సినిమా ద్వారా చెప్పారు. ఇందులో ఓ సాధారణ అమ్మాయిగా సమంత అద్దెగర్భం పొంది అందులో చీకటి కోణాలను బయటకు తీసిన తీరు, ఈ క్రమంలో వారితో పోరాడిన తీరు ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆ పాత్ర పొటెన్షియాలిటీని బయటపెడుతుంది. అంతిమంగా మహిళ శక్తిని చాటి చెబుతుంది. ఇది సమాజాన్ని ప్రభావితం చేసింది. దీంతోపాటు `ఓబేబీ` చిత్రంతోనూ సమంత పర్ఫెక్ట్ ఉమెన్ ఎంపావర్మెంట్ని ఆవిష్కరించింది. ఓ వృద్ధ మహిళ యంగ్ ఏజ్లో సాధించలేనివి.. యంగ్గా మారినప్పుడు వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ మహిళా సాధికారతకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఇందులో సమంతతోపాటు లక్ష్మి నటన వాహ్ అనిపిస్తుంది. `మహానటి`, `మిస్ ఇండియా`తో కీర్తిసురేష్ సత్తా.. కీర్తిసురేష్ పాన్ ఇండియా ఇమేజ్ని, జాతీయ అవార్డుని తీసుకొచ్చిన చిత్రం `మహానటి`. అలనాటి మేటి నటి సావిత్రి జీవితం ఆధారణంగా రూపొందిన బయోపిక్. ఇందులో ఆమె జర్నీ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సావిత్రి స్టార్ హీరోలను మించిన స్థాయికి ఎదగడం, ఆ తర్వాత ప్రేమ పేరులో మోసానికి గురికావడం, తర్వాత తన జీవితాన్నే నాశనం చేసుకోవడం ఇందులో కన్క్లూజన్. కానీ విశేష అభిమానుల ఆరాధ్య నటిగా కీర్తించబడింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సక్సెస్ కంటే ఫెయిల్యూర్ని, ఆమె చేసిన తప్పులను ఆవిష్కరించిన చిత్రంగా నిలుస్తుందని చెప్పొచ్చు. మరోవైపు `మిస్` ఇండియా`తో మహిళాసాధికారతకు అసలైన అర్థం చెప్పింది కీర్తిసురేష్. విదేశాల్లో మన ఇండియన్ టీని పరిచయం చేసి, అనేక స్ట్రగుల్స్ ఫేస్ చేసి సక్సెస్గా నిలవడమనేది ఉమెన్ ఎంపావర్మెంట్కి నిదర్శనం. కానీ నరేంద్ర నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సక్సెస్ కాలేకపోయింది. మిస్టరీ థ్రిల్లర్ `పెంగ్విన్` సైతం మహిళలను ఇన్స్పైర్ చేస్తుంది. అలాగే `గుడ్ లక్ సఖి`చిత్రంలోనూ ఓ పేద గిరిజన అమ్మాయి షూటర్గా రాణించేందుకు పడే కష్టం నేపథ్యం ఉమెన్ ఎంపావర్మెంట్కి నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ సినిమాలు ఆడకపోవడంతో అంతగా ఇంపాక్ట్ ని చూపించలేకపోయాయి. కోలీవుడ్లో.. నయనతార ఉమెన్ ఎంపావర్మెంట్ కి ప్రతిబింబం.. స్టార్ హీరోయిన్ నయనతార మహిళ సాధికారతకు ప్రతిరూపంగా నిలుస్తుంది. ఆమె గ్లామర్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్గా నిలుస్తుంది. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ ఇమేజ్తో రాణిస్తుంది. ఆమె మాత్రమే కాదు, ఆమె సినిమాలు సైతం ఇటీవల అలానే ఉంటున్నాయి. నయనతార `డోరా`, `కో కో కోకిల`, `వసంతకాలం`, `అమ్మోరు తల్లి`, `ఓ2`, `మయూరి` వంటి సినిమాలతో విజయాలు అందుకుంది. ఇందులో `డోరా`లో ఓ ఆత్మతో పోరాటం చేస్తుంది నయన్. అలాగే `కోలమావు కోకిల` చిత్రం.. నిజమైన ఉమెన్ఎంపావర్మెంట్ని చాటి చెబుతుంది. ఇందులో కుటుంబ బాధ్యతని తను మోయాల్సి రావడంతో జాబ్ చేయాల్సి వస్తుంది నయనతారకి. ఆమె కొకైన్ స్మగ్లింగ్ చేసే సంస్థలో పనిచేయాల్సి వస్తుంది. అయితే అందుకో చాలా సవాళ్లు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆ సవాళ్లని, అడ్డంకులను ఎదుర్కొని దాన్నుంచి బయటపడేందుకు నయనతార చేసిన పోరాటమే ఈ చిత్రం. ఆద్యంతం ఇన్ స్పైరింగ్గా ఉంటుంది. నేటి సమాజంలోని సవాళ్లని ప్రతిబింబిస్తుంది. నయనతార రెండేళ్ల క్రితం నటించిన `నెట్రికన్` సైతం ఉమెన్ ఎంపావర్మెంట్ అంశంగానే రూపొందింది. ఓ కళ్లులేని లేడీ పోలీస్ ఆఫీసర్ ఓ సీరియల్ కిల్లర్ని పట్టుకునేందుకు చేసే పోరాటమే ఈ చిత్ర కథ. ఇందులో కళ్లు లేకుండా కూడా హంతకులను నయనతార పట్టుకోవడం అనే అంశం మహిళ ఎంత పవర్ఫుల్ అనేది చాటి చెబుతుంది. మగవారిని మించి మహిళ చేయగలదని నిరూపించింది. అలాగే తన కూతురిని కాపాడుకోవడం కోసం తల్లి పడే స్ట్రగుల్స్ నేపథ్యంలో రూపొందిన `కనెక్ట్`, కొడుక్కి ఆక్సిజన్ అందేలా చేయడంకోసం తల్లి పడే ఆరాటం నేపథ్యంలో వచ్చిన `ఓ2`, అలాగే హర్రర్ మూవీ `ఐరా`, తోపాటు `మాయా` చిత్రాలతోనూ నయనతార ఆకట్టుకుంది. ఆయా చిత్రాల్లో మహిళా శక్తి సామర్థ్యాలను చాటి చెప్పింది. నయనతార నటించిన చాలా సినిమాలు విశేష ఆదరణ పొందడంతోపాటు మంచి కలెక్షన్లని రాబట్టడం విశేషం. ఇందులో చాలా వరకు సమాజాన్ని ప్రభావితం చేసే సినిమాలుండటం విశేషం. `గార్గి`తో సాయిపల్లవి.. సాయిపల్లవి నటించే సినిమాల్లో కచ్చితంగా మహిళా సాధికారత అనే అంశం ఉండి తీరాల్సిందే. లేదంటే ఆమె నటించదు. హీరో సరసన చేసినా ఆమె పాత్ర బలంగా ఉండాల్సిందే. ఇక తనే మెయిన్ లీడ్గా చేసి మెప్పించిన చిత్రం `గార్గి` ఉమెన్ ఎంపావర్మెంట్కి, మహిళా శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. కేసులో ఇరుక్కున్న తండ్రిని కాపాడుకోవడం కోసం ఓ టీచర్ ఒంటరిగా చేసే పోరాటం నేపథ్యంలో సాగే ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. మరోవైపు తెలుగులో వచ్చిన `విరాటపర్వం`లోనూ ప్రేమ కోసం ఆమె చేసే పోరాటం సైతం మహిళా శక్తిని చాటుతుందని చెప్పొచ్చు. కోలీవుడ్లో ఐశ్వర్య రాజేష్ సైతం మహిళా శక్తిని చాటే చిత్రాలు చేస్తూ రాణిస్తుంది. ఆమె స్పోర్ట్స్ డ్రామా `కౌసల్య కృష్ణమూర్తి`(కనా) ఉమెన్ ఎంపావర్మెంట్ని చాటింది. దీంతోపాటు ఇటీవల `డ్రైవర్ జమున`, `ది గ్రేట్ ఇండియన్ కిచెన్`, `రన్ బేబీ రన్`, `సొప్పన సుందరి` వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ఆకట్టుకుంది. ఐశ్వర్య రాజేష్ సినిమాల్లోనే మహిళ పాత్ర బలంగా ఉండేలా చూసుకుంటుంది. ఆయా సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేసేలా ఉండటం విశేషం. అలాగే అమలాపాల్ నటించిన `ఆడై`(ఆమె) చిత్రం సైతం మహిళా శక్తిని చాటింది. మలయాళంలో.. `జయ జయ జయ జయ హే`.. మలయాళంలో ఇటీవల కాలంలో మహిళా శక్తిని చాటిన చిత్రంగా `జయ జయ జయ జయ హే`నిలుస్తుంది. విపిన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దర్శణ రాజేంద్రన్, బసిల్ జోసెఫ్ నటించారు. ఇది అత్తారింట్లో అవమానాలు, గృహహింసకు గురైన మహిళ తిరుగుబాటు నేపథ్యంలో రూపొందిన చిత్రం. జయ అనే అమ్మాయికి బాగా చదువుకుని గొప్పగా ఎదగాలని ఉంటుంది, కానీ పేరెంట్స్ చదువు మధ్యలోనే ఆపేసి పెళ్లి చేస్తారు. చదివిస్తానన్న మాటతో పెళ్లి చేసుకున్న భర్త ఆ తర్వాత దాని ఊసేత్తడు.పైగా రోజూ ఇంట్లో వేదింపులు. ఇక లాభం లేదని భావించిన జయ తిరగబడుతుంది. ఫోన్లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఇంట్లో ఎవరికి తెలియకుండా భర్తని కొడుతుంది. భర్త మొదట ఈ విషయాన్ని దాచినా తర్వాత బయటపడుతుంది. పెద్దల సమక్షంలో ఇద్దరు క్షమాపణలు చెప్పుకుని మారిపోతారు. అంతలోనే జయ గర్భం దాల్చేలా చేస్తాడు భర్త. అలా అయితే ఇంట్లో పడి ఉంటుందని వారి ప్లాన్. కానీ ఈ కుట్ర గురించి తెలిసిన జయకి రక్తపోటు పెరిగి అబార్షన్ అవుతుంది. ఆమెపై నిందలేయడంతో ఇంటికి దూరంగా సోదరుడితో కలిసి ఉంటుంది. విడాకుల కోసం కోర్ట్ కి వెళ్లగా జడ్జ్ క్లాస్ పీకడంతో భర్త లో మార్పు వస్తుంది, ఆ తర్వాత జయని ప్రేమగా చూసుకుంటాడు. తన వ్యాపారంలో భాగస్వామిని చేస్తాడు. దీంతో అతని వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా మారుతుంది. కుటుంబం, విలువులు అంటూ అన్నీ భరించిన భార్య.. అత్తింటి ఆగడాలు తట్టుకోలేక ఎదురుతిరిగి తనేంటో నిరూపించింది. తన శక్తిని చాటి చెప్పింది. మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ సినిమా ఇటీవల కాలంలో మలయాళంలో ఎంతో ప్రభావితం చేసిన చిత్రంగా నిలవడం విశేషం. వీటితోపాటు మాలీవుడ్లో మరికొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు వచ్చి మెప్పించాయి. అందులో ఒకటి `ఉయరే`. అనేక స్ట్రగుల్స్ ని ఫేస్ చేసి ఓ సాధారణ అమ్మాయి పైలట్ కావడమనే కథతో ఈ చిత్రం రూపొంది ఆదరణ పొందింది. ఇందులో పార్వతి ప్రధాన పాత్రలో నటించింది. దీంతోపాటు కిడ్నాప్కి గురైన ఓ అమ్మాయి పడే వేదన, దాన్నుంచి ఆమె బయటపడేందుకు చేసే పోరాటం నేపథ్యంలో వచ్చిన థ్రిల్లర్ `హెలెన్` మంచి ఆదరణ పొందింది. అలాగే ఇద్దరు అమ్మాయిల జర్నీ నేపథ్యంలో వచ్చిన `రాణి పద్మిని`, అమల అక్కినేని, మంజు వారియర్ నటించిన `కేరాఫ్ సైరా బాను` చిత్రాలు మహిళా శక్తిని చాటే కథాంశాలతో రూపొంది మెప్పించాయి. సమాజంపై ఎంతో కొంత ఇంపాక్ట్ ని చూపించాయి. బాలీవుడ్లో.. `డర్టీ పిక్చర్` టూ `మేరీకోమ్` టూ `గంగూబాయ్`.. బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల జోరు చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా వచ్చిన `డర్టీ పిక్చర్స్` నుంచి మొన్న అలియాభట్ నటించిన `గంగూభాయ్` వరకు చాలా సినిమాలు వచ్చి విశేష ఆదరణ పొందాయి. కమర్షియల్ గానూ సత్తా చాటాయి. బాలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినిమాపై ఎంతో ఇంపాక్ట్ ని చూపించాయి. బాలీవుడ్లో అంతకు ముందు కూడా అనేక మహిళశక్తిని చాటే సినిమాలు వచ్చినా, `డర్టీ పిక్చర్స్` మాత్రం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. అసలైన ఉమెన్ ఎంపావర్మెంట్ని చాటి చెప్పింది. ఇందులో విద్యాబాలన్ తన నటనతో ఇరగదీసి జాతీయ అవార్డుని అందుకుంది. మరోవైపు రియల్ లైఫ్ బాక్సర్ మేరీకోమ్ జీవితం ఆధారంగా వచ్చిన `మేరీకోమ్`తో ప్రియాంక చోప్రా.. మహిళా శక్తిని నిరూపించింది. నిజమైన ఉమెన్ ఎంపావర్మెంట్ ని చాటి చెప్పింది. ఇండియన్ సినిమాపైనే బలమైన ప్రభావాన్ని చూపించడంతోపాటు ఎంతో మందిని ప్రభావితం చేసిన సినిమాగా నిలిచింది. మరోవైపు మిడిల్ ఏజ్ మహిళ విదేశాల్లో ఇంగ్లీష్ నేర్చుకుని తను కూడా స్వతంత్రంగా నిలబడటమనే కాన్సెప్ట్ తో వచ్చిన శ్రీదేవి `ఇంగ్లీష్ వింగ్లీష్` మహిళా శక్తికి, ఉమెన్ ఎంపావర్మెంట్కి నిదర్శనం. ఈ సినిమా చాలా మందిని ప్రభావితం చేసింది. తొలి ఇండియన్ ఎయిర్ పైలట్గా.. తప్పిపోయిన భర్తని వెతికే క్రమంలో ఓ గర్భిణి పడే బాధల నేపథ్యంలో వచ్చిన విద్యా బాలన్ `కహాని`, ఓ లేడీ పోలీస్ అధికారి క్రైమ్ని అంతం చేసే ఇతివృత్తంతో వచ్చిన రాణి ముఖర్జీ `మార్దాని`, కార్గిల్ వార్(ఇండియా పాక్ వార్) సమయంలో ఆ వార్ ప్రాంతంలో ప్రయాణించిన తొలి ఇండియన్ ఎయిర్ ఫైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా జాన్వీ కపూర్ నటించిన `గుంజన్ సక్సేనా` లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్. మహిళా శక్తిని చాటే చిత్రాలుగా నిలిచాయి. వీటితోపాటు తాప్సీ నటించిన `పింక్` చిత్రం ఇటీవల కాలంలో ఎంతో ప్రభావితం చేసిన సినిమాగా నిలిచింది. అత్యంత చర్చనీయాంశంగానూ మారింది. అలాగే శ్రీదేవి `మామ్`, ఐశ్వర్య రాయ్ `సర్బ్జిత్`, తాప్సీ `తాప్పడ్` వంటి సినిమాలు కూడా మహిళా శక్తి సామర్థ్యాలను ఆవిష్కరించిన చిత్రాలే. దీపికా పదుకొనె ప్రధాన పాత్రతో సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన హిస్టారికల్ మూవీ `పద్మావత్`, అలియాభట్ నటించిన `గంగూభాయ్` ఉమెన్ ఎంపావర్మెంట్కి ప్రతిరూపాలు. కథియవాడి ఏరియాలో వేశ్య వృత్తి చేసుకునే గంగూభాయ్.. లేడీ డాన్గా, రాజకీయాలను శాషించే స్థాయికి ఎదగడమనే కథాంశంతో వచ్చిన `గంగూభాయ్` సినిమా విశేషం ఆదరణ పొందింది. ఇలా ఇప్పటికే బాలీవుడ్లో మంచి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు వస్తూ ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ఇన్స్పైర్ చేస్తున్నాయి. మరిన్ని రూపుదిద్దుకుంటున్నాయి. -
నిరంతర యుద్ధం
‘‘మహిళలకు పెద్ద పీట వేస్తూ.. విమెన్ ఓరియెంటెడ్ సినిమాలు తీసేవారికి పెద్దగా ప్రోత్సాహమేమీ లభించడం లేదు’’. ఈ ఆవేదన జాన్ అబ్రహమ్ది. ‘‘నా దగ్గర స్త్రీ ప్రాధాన్యంగా సాగే రెండు కథలున్నాయి. కాని షూటింగ్ కోసం స్టూడియోలే దొరకట్లేదు. అలాంటి సినిమాలు ఆడవనే నమ్మకంతో స్టూడియోలను అద్దెకివ్వట్లేదు. అద్దె ఖర్చులూ రావనే భయమూ వారికి ఉన్నట్లుంది. ‘కాదు వాటిని అమ్మే పూచీ నాది’ అని స్టూడియో సిబ్బందిని కన్విన్స్చేసి సినిమా తీయడం గగనంగా ఉంది. మార్పు గురించి మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. కాని ప్రాక్టికల్గా ఇదో నిరంతరం యుద్ధం’’ అంటున్నాడు జాన్ అబ్రహం. సమాజంలో మిగతా మార్పుల కోసం మన ప్రయత్నాలు ఎలా ఉన్నా.. స్త్రీల విషయంలో మాత్రం పోరాటమే పెద్ద మార్పు. జాన్.. మీ ప్రయత్నం మీరు చెయ్యండి. మీరు కోరుకున్న మార్పూ వచ్చి తీరుతుంది చూడండి. -
అదరం.. బెదరం
అందంగా కనిపించాలి. ప్రేమలో పడాలి. పాటల్లో గ్లామరస్గా కనిపించాలి. టైమ్ వచ్చినప్పుడు డైలాగ్స్ చెప్పి సీన్ నుంచి మాయం అవ్వాలి... హీరోయిన్లంటే ఇంతేనా? ఊహూ.. ఆ కాలం పోయింది. ఇప్పుడు కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కథా బలం ఉన్న స్క్రిప్ట్ దొరికి, మంచి క్యారెక్టర్ పడితే మేం ఎందులో తక్కవ? అనేలా నటిస్తున్నారు హీరోయిన్లు. అన్నమాటకు కట్టుబడేలా కష్టపడతున్నారు. యాక్షన్ సన్నివేశాలకు బెదరడం లేదు. పైగా డూప్ లేకండా యాక్షన్ సన్నివేశాలను అదరగొడుతున్నారు. ఈ క్రమంలో దెబ్బలు తగిలితే భయపడటం లేదు. సరి కదా లొకేషన్లో షాట్ కంప్లీట్ చేసిన తర్వాతనే హాస్పిటల్కి పోదాం అంటున్నారు. ఇటీవల అలా గాయాలపాలైన కొందరు కథానాయికల గురించి తెలుసుకుందాం. బాలీవుడ్లో కంగనా రనౌత్ ఎంతటి ప్రతిభాశాలో అంతే ధైర్యశాలి. ఇందుకు సినిమాల్లో ఆమె ఎంచుకుంటున్న పాత్రలు, ఏదైనా విషయం గురించి బాహాటంగా నిర్భయంగా మాట్లాడే తీరు నిదర్శనం. ప్రస్తుతం వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘మణికర్ణిక’ సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్నారు కంగనారనౌత్. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్లో రెండు సార్లు గాయపడ్డారామె. ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణలో భాగంగా ఆమె కాలు విరగ్గొట్టుకున్నారు. ఒకసారి గాయపడ్డ తర్వాత కూడా యాక్షన్ సన్నివేశాలు చేయడానికి కంగనా బెదరలేదు. మళ్లీ కత్తి పట్టి, షూట్లోకి దూకారు. కాంప్రమైజ్ కాలేదు. మళ్లీ గాయపడ్డారు. ఈసారి కత్తి నుదుట మీద తగిలింది. 16 కుట్లు పడ్డాయి. అయినా కంగనా తగ్గడం లేదు. సేమ్ కమిట్మెంట్తో ఫైట్సీన్స్లో పాల్గొంటున్నారు. మరి.. కంగనానా? మజాకానా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఓ సెట్లో జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది. ఇక, ఈ ఏడాది మార్చిలో 25వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆలియా భట్కు బర్త్డే ముగిసిన రెండు రోజుల్లోనే చేదు అనుభవం ఎదురైంది. బల్గేరియాలో ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ లొకేషన్లో గాయపడ్డారామె. ఓ యాక్షన్ సీన్ చేసే టైమ్లో అదుపు తప్పి చేయి విరగ్గొట్టుకున్నారు కానీ ముఖంపై చిరునవ్వును మాత్రం వదిలిపెట్టలేదు. ఆ రోజంతా షూటింగ్లో పాల్గొని, సాయంత్రమే లొకేషన్ని వదిలిపెట్టి వెళ్లారు. కమిట్మెంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదని చెప్పారు. రణ్బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, ఆలియా భట్ ముఖ్య తారలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. మరో బ్యూటీ శ్రద్ధా కపూర్ విషయానికి వద్దాం. ప్రస్తుతం వెండితెరపై సైనా నెహ్వాల్గా చేస్తున్న శ్రద్ధాకపూర్ ఏం చేస్తున్నారో తెలుసా? బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆమె ఇప్పుడిప్పుడే జ్వరం నుంచి కోలుకుంటున్నారు. ఇంతకీ శ్రద్ధాకు జ్వరం రావడానికి కారణం ఏంటంటే.. ‘సైనా’ చిత్రం కోసం శ్రద్ధా బ్యాడ్మింటన్ గేమ్కు స్ట్రాంగ్గా ప్రిపేర్ కావడమేనట. బాగా అలసిపోయి, జ్వరం తెచ్చుకున్నారు. హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా హిందీలో రూపొందుతున్న ‘సైనా’కు అమోల్ గుప్టే దర్శకత్వం వహిస్తున్నారు. వీళ్లకన్నా ముందే గాయాల క్లబ్లో చేరారు జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ‘రేస్ 3’ సినిమా షూటింగ్ టైమ్లో ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అనే సామెతను హిందీలో గుర్తు చేసుకుని ఉండి ఉంటారు కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఎందుకంటే... ఆ సినిమా సెట్లో జాక్వెలిన్ కన్నుకి పెద్ద దెబ్బ తగిలింది. కంటికి ఏదైనా దెబ్బ తగిలితే ఇంకేమైనా ఉందా? కెరీర్ క్లోజ్ అయిపోదూ. కానీ ఇంత కష్టపడ్డ జాక్వెలిన్కు ఈ చిత్రం చేదు అనుభావాన్నే మిగిల్చింది. సల్మాన్ఖాన్ హీరోగా నటించిన ‘రేస్3’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. అలాగే ప్రస్తుతం సల్మాన్ఖాన్ హీరోగా నటిస్తున్న ‘భారత్’ సినిమాలో దిశా పాట్నీ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో జిమ్నాస్టిక్స్ చేసే క్యారెక్టర్లో నటిస్తున్నారామె. ఈ జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ టైమ్లో దిశా గాయపడ్డారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తరాది భామలేనా? మన దక్షిణాది భామలకు కూడా బోలెడంత ధైర్యం ఉంది. ఇప్పుడు ఒకసారి సౌత్కు వస్తే... యాక్షన్ సీన్స్లో నవ్వులపాలు కాకూడదని డిసైడ్ అయ్యారు అమలాపాల్. అందుకు ఎందాకైనా తెగించాలని డిసైడ్ అయ్యారు. తమిళ సినిమా ‘అదో అంద పరవై పోల’ కోసం అడవిలో నైట్ షూట్కి సై అన్నారు. నాలుగైదు రోజులు షూటింగ్ సజావుగానే సాగిందట. కానీ ఓ బ్యాడ్ డే ఓ ఫైట్ సీన్ కోసం ఆమె చేతిని విరగ్గొట్టుకున్నారు. లొకేషన్లో చాలా రక్తం పోయింది. కానీ వెంటనే అమలాపాల్ ఆసుపత్రికి పోలా. ఆ సీన్ షూట్ను కంప్లీట్ చేసి, డాక్టర్ రూమ్ డోర్ నాక్ చేశారు. ఈ గాయం గురించి అమలాపాల్ ఏమన్నారో తెలుసా. ‘‘శరీరంపై ఒక్క గాయం కూడా లేకపోతే హీరో అనిపించుకోలేం’’ అన్నారు. ఇలా అమలాపాల్ రియల్ హీరో అనిపించుకున్నారు. ఈ సినిమాలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ క్యారెక్టర్లో కనిపిస్తారామె. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక అదా శర్మ అయితే పొరపాటున తన చేతివేలిని తానే చితక్కొట్టుకున్నారు. యాక్షన్ సీన్లో భాగంగా కారు డోర్ని విసురుగా వేసేటప్పుడు మరో చేతిని డోర్ మీద నుంచి తీయడం మరచిపోయారు. ఇది ‘కమాండో 3’ సెట్లో జరిగింది. పాపం.. అదాశర్మ నొప్పితో అల్లాడిపోయారు. అయినా టైమ్ వేస్ట్ కానివ్వకుండా షూటింగ్లో పాల్గొన్నారు. అదా ధైర్యం ఉన్న యువతి అని చిత్రబృందం మెచ్చుకుంది. ఇప్పుడు మాత్రం హ్యాపీగా షూట్లో పాల్గొంటున్నారు. విద్యుత్ జమాల్ హీరోగా నటిస్తున్నారీ సినిమాలో .ఈ సినిమాకు విపుల్ షా డైరెక్టర్. అలాగే రాజమండ్రి షెడ్యూల్లో ‘రంగస్థలం’ సినిమా కోసం కంటిన్యూస్గా వర్క్ చేయడంతో ఓ రోజు చేతి నొప్పితో విలవిల్లాడిపోయారు ఆ సినిమా కథానాయిక రామలక్ష్మీ.. అదేనండీ మన సమంత. అంతేనా.. ఈ సినిమా షూట్ వేసవి టైమ్లో జరిగినప్పుడు వడదెబ్బ తగలడంతో స్పృహ తప్పి పడిపోయారట. మొన్నా మధ్య గౌతమ్ హీరోగా నటించిన చిత్రం ‘మను’. ఈ సినిమా సెట్ను హైదరాబాద్కు దూరంగా వేశారు. ఆ సెట్లో దోమలు ఎక్కువగా ఉండటంతో దాదాపు నెల రోజులు వైరల్ ఫీవర్తో షూట్కు దూరమైయ్యారు చాందినీ చౌదరి. అలాగే ‘నేల టిక్కెటు’్ట సినిమాతో తెలుగు తెరపై మెరిసిన మాళవికా శర్మ కూడా సెట్లో గాయపడ్డారు. కానీ ఇది చిన్న గాయమే కావడంతో వెంటనే కోలుకున్నారు. ఇలా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంతటి రిస్క్కి అయినా∙రెడీ అంటున్నారు ఈ తరం హీరోయిన్లు. పాటలకే కాదు.. ఫైట్స్కి కూడా పనికొస్తామని నిరూపించుకుంటున్నారు. గాయాలను లెక్క చేయకుండా షూటింగ్ చేస్తున్నారు. మళ్లీ గాయం అయినా ఫర్వాలేదనుకుంటున్నారు. ‘డోంట్ కేర్’.. ఇది మన హీరోయిన్ల కొత్త నినాదం. అదా శర్మ, అమలా పాల్, కంగనా, జాక్వెలిన్, ఆలియా భట్ -
‘నేను మహిళల చిత్రాలకు అనుకూలం’
న్యూఢిల్లీ: తాను మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకే ఎక్కువ అనుకూలంగా ఉంటానని బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ అన్నారు. ఆయన తాజా చిత్రం మామ్లో శ్రీదేవీతో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీదేవి ఓ శక్తిమంతమైన పాత్రను పోషించారు. ‘నేను మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు సానుకూలంగా ఉంటాను. ఎందుకంటే ఈరోజుల్లో ప్రతి రంగంలో మహిళలే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అది విద్య కావొచ్చు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కావొచ్చు, క్రీడలు కావొచ్చు. ఈ మార్పును ప్రతి ఒక్కరూ ఆహ్వానించాల్సిందే’ అని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు మహిళలను సినిమాల్లో ఒక వస్తువులుగా చూపించారు.. కానీ, ఇప్పుడు మాత్రం సినిమాలు వారి పైనే వస్తున్నాయి. మనం తప్పక స్వాగతించాలి’ అని ఆయన అన్నారు. గతంలో నవాజుద్దీన్ విద్యాబాలన్ నటించిన కహానీ చిత్రంలో పవర్ఫుల్ దర్యాప్తు అధికారిగా కనిపించిన విషయం తెలిసిందే.