breaking news
Women Chess Championship
-
ప్రపంచకప్ చాంపియన్గా దివ్య దేశ్ముఖ్
ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ (FIDE World Cup) ఫైనల్లో యువ తరంగం దివ్య దేశ్ముఖ్ (Divya Deshmukh) సత్తా చాటింది. తెలుగు తేజం కోనేరు హంపి (Koneru Humpy)ని 2.5-1.5తో ఓడించి.. మహిళల చెస్ ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.జార్జియాలోని బతూమీ వేదికగా సోమవారం జరిగిన టై బ్రేకర్లో హంపీ తొలుత నల్ల పావులతో ఆడగా.. దివ్యతో కలిసి డ్రా చేసుకుంది. పదిహేను నిమిషాల పాటు సాగిన గేమ్లో 81 ఎత్తుల తర్వాత ఇద్దరూ డ్రాకు అంగీకరించారు. అనంతరం పదిహేను నిమిషాల రెండో ర్యాపిడ్ మ్యాచ్లో 38 ఏళ్ల హంపి తెల్ల పావులతో ఆడగా.. దివ్య నల్ల పావులతో ఎత్తులు వేసింది. అయితే, ఈ టై బ్రేక్లో 38 ఏళ్ల హంపి చేసిన తప్పిదాల ఫలితంగా 19 ఏళ్ల దివ్య చాంపియన్గా అవతరించింది.ఈ గెలుపుతో దివ్య గ్రాండ్ మాస్టర్గా ప్రమోషన్ పొందడంతో పాటు.. క్యాండిడేట్స్ టోర్నమెంట్కు అర్హత సాధించింది. ఇక హంపిపై గెలిచిన అనంతరం దివ్య తీవ్ర భావోద్వేగానికి లోనైంది.దివ్య భావోద్వేగం‘‘ఇలా నేను గ్రాండ్ మాస్టర్ అవుతానని ఊహించలేదు. నా విధిరాతలో ఇది ఉంది. ఈ టోర్నమెంట్ ఆరంభానికి ముందు నాకు ఈ హోదా లేదు. ఈ విజయం నాకెంతో విలువైనది. ఇంకా నేను సాధించాల్సినవి చాలానే ఉన్నాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే’’ అంటూ దివ్య దేశ్ముఖ్ ఎమోషనల్ అయింది. ఈ సందర్భంగా దివ్య తల్లి ఆమెను అక్కున చేర్చుకుని.. విజయ గర్వంతో ఉప్పొంగిపోయారు. దివ్య కంటే ముందు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఆర్.వైశాలి గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు.ట్రై బ్రేకర్ ఇలా..టైబ్రేక్లలో 10 నిమిషాల చొప్పున రెండు రాపిడ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ప్రతి కదలిక తర్వాత 10 సెకన్ల ఇంక్రిమెంట్ ఉంటుంది. స్కోరు సమంగా ఉంటే, ప్రతి కదలిక తర్వాత మూడు సెకన్ల ఇంక్రిమెంట్లతో రెండు, ఐదు నిమిషాల మ్యాచ్లు ఆడతారు. టై కొనసాగితే, ప్రతి కదలిక తర్వాత రెండు సెకన్ల ఇంక్రిమెంట్లతో మూడు నిమిషాల చొప్పున రెండు బ్లిట్జ్ మ్యాచ్లు ఆడాలి. Divya Deshmukh 🇮🇳 winner of the World Chess Cup and also now a Grandmaster!pic.twitter.com/UNmgiq33qq— Chessdom (@chessdom) July 28, 2025 -
అగ్రస్థానంలో కోనేరు హంపి
పెంగ్షుయ్ (చైనా): ప్రపంచ మాస్టర్స్ మహిళల చెస్ చాంపియన్షిప్ బ్లిట్జ్ ఈవెంట్లో తొలి రోజు గేమ్లు ముగిశాక ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి టాప్ ర్యాంక్లో కొనసాగుతోంది. మొత్తం 22 రౌండ్లకుగాను తొలి రోజు శుక్రవారం 12 రౌండ్లు ముగిశాయి. 16 మంది మేటి క్రీడాకారిణులు పాల్గొంటున్న ఈ టోర్నీలో 12 రౌండ్లు పూర్తయ్యాక హంపి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్ను ‘డ్రా’ చేసుకుంది. మిగతా మూడు గేముల్లో ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక 6.5 పాయింట్లతో ఏడో ర్యాంక్లో ఉంది. హారిక మూడు గేముల్లో గెలిచి, ఏడు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, రెండు గేముల్లో ఓడిపోయింది. శనివారం మిగతా పది రౌండ్ గేమ్లు జరుగుతాయి. ఇదే టోర్నీ ర్యాపిడ్ విభాగంలో హారిక 14వ ర్యాంక్లో, హంపి 15వ ర్యాంక్లో నిలిచారు. . -
హారిక గేమ్ ‘డ్రా’
ప్రపంచ మహిళల చెస్ చాంపియన్షిప్ రెండో రౌండ్ మ్యాచ్ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక ‘డ్రా’తో ప్రారంభించింది. ఇరాన్లోని టెహరాన్లో ఈ టోర్నీ జరుగుతోంది. దినారా సదుకసొవా (కజకిస్తాన్)తో జరుగుతున్న రెండో రౌండ్ తొలి గేమ్ 15 ఎత్తుల తర్వాత డ్రాగా ముగిసింది. తెల్ల పావులతో ఈ గేమ్ ఆడిన హారిక పూర్తి స్థాయిలో ప్రయోజనం పొందలేకపోయింది. బుధవారం ఇద్దరి మధ్య రెండో గేమ్ జరుగుతుంది.