-
ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న మహిళా క్యాడెట్
న్యూఢిల్లీ: ఇరాన్ అధీనంలో ఉన్న సరుకు రవాణా నౌక ఎంఎస్సీ ఏరీస్లోని 17 మంది భారతీయ సిబ్బందిలోని ఏకైక మహిళా క్యాడెట్ సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. కేరళలోని త్రిసూర్కు చెందిన ఆన్ టెస్సా జోసెఫ్ను ఇరాన్ ప్రభుత్వం విడుదల చేయడంతో గురువారం మధ్యాహ్నం విమానంలో కొచ్చిన్కు చేరుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మిగతా 16 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా విడుదల చేయించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది. వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, భారత్లోని కుటుంబసభ్యులతో ఫోన్లో సంభాషిస్తున్నట్లు కూడా వివరించింది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ నాలుగు రోజుల క్రితం ఇరాన్ విదేశాంగ మంత్రి అమిర్ అబొల్లాహియన్తో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసింది. ఇజ్రాయెల్తో సంబంధాలున్నాయనే అనుమానంతో ఇరాన్ ప్రత్యేక బలగాలు ఈ నెల 13న హొర్ముజ్ జలసంధిలో ఉన్న ఎంఎస్సీ ఏరీస్ నౌకను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. -
డిఫెన్స్ అకాడెమీలోకి మహిళలు..
న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్షలకు మహిళలను అనుమతించనున్నట్లు కేంద్ర రక్షణ శాఖ సుప్రీంకోర్టుకు మంగ ళవారం తెలిపింది. ఈ పరీక్ష నిర్వహణను సజావుగా జరిపేందుకు అవసరమైన చర్యలను చేపడుతు న్నట్లు చెప్పింది. మూడు రకాల రక్షణ బలగాల్లో మహిళలను ప్రవేశపెట్టనున్న ట్లు పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రక్షణ శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. పురుష అభ్యర్థులకు ఉన్నట్లే మహిళా అభ్యర్థులకు కూడా ఎత్తు, బరువు వంటి భౌతిక పరామితులను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. ప్రస్తుతం ఆ పరామితులను నిర్ణయిస్తున్నట్లు తెలిపింది. ఎన్డీఏ ప్రవేశ పరీక్ష సంవత్సరానికి రెండు సార్లు జరుగుతుంది. -
జీవన విలువలు అక్కడే నేర్చుకున్నా: నరేంద్ర మోదీ
ఎన్సీసీలో చేరటం మధుర జ్ఞాపకం న్యూఢిల్లీ: విద్యార్థిగా ఉండగా ఎన్సీసీలో చేరటం తనకు జీవన విలువలు, దేశభక్తి అలవడ్డాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో ఎన్సీసీ వార్షిక రిపబ్లిక్ డే క్యాంప్ వేడుకల్లో ప్రధాని పాల్గొని మాట్లాడారు. తాను జీవిత పాఠాలు నేర్చుకున్న వాతావరణంలోకి తిరిగి అడుగుపెట్టడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. కష్టపడి ఈ అవకాశం దక్కించుకున్న ఎన్సీసీ క్యాడెట్లను ప్రధాని అభినందించారు. ఎన్సీసీలో చేరినా ఢిల్లీలో జరిగే వార్షిక క్యాంప్ వేడుకలకు మాత్రం తాను ఎంపిక కాలేదని మోదీ వెల్లడించారు. తమ పాఠశాల నుంచి ఈ అవకాశం దక్కించుకున్న ఓ విద్యార్థి హఠాత్తుగా రాత్రికి రాత్రే ప్రముఖుడిగా మారిపోయాడని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. యువకుడిగా ఉండగా ఎన్సీసీ దుస్తుల్లో ఉన్న ఫొటోలను ఈ సందర్భంగా మోదీ ట్వీటర్లో విడుదల చేశా రు. ఎన్సీసీ పరేడ్లో మహిళా క్యాడెట్లు ఎక్కువగా పాల్గొనటంపై మోదీసంతృప్తి వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వమే మన బలం భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ బలమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో విభిన్న ప్రాంతాలను సందర్శించి ప్రజలతో మమేకం కావాలన్నారు. జాతిని అర్థం చేసుకోవటానికి స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ దేశవ్యాప్తంగా పర్యటించారన్నారు. కేంద్రమంత్రులు మనోహర్ పారికర్, రావు ఇందర్జిత్ సింగ్, సుష్మా స్వరాజ్, ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్బేడీ, ఎంపీ జయాబచ్చన్ తదితరులంతా ఎన్సీసీలో చేరినవారేనని చెప్పారు. యోగాలో ప్రపంచ రికార్డు సాధించాలి జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఒకే సమయంలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాలని ఎన్సీసీ క్యాడెట్లను ప్రధాని కోరారు. ఇప్పటినుంచే దీనికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐరాస ప్రకటించటం యోగా సాధకులకు గర్వకారణమన్నారు. యోగాకు వయసు, భాష లాంటి సరిహద్దులు లేవన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement