women cadets
-
ఎన్నాళ్లో వేచిన ఉదయం!
ఈ నెల 30న జరగనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)పాసింగ్ ఔట్ పరేడ్ చారిత్రక సందర్భం కానుంది. ‘ఎన్డీఏ’లో తొలిసారిగా 17 మంది మహిళా క్యాడెట్స్ ఉన్నారు. ఫస్ట్బ్యాచ్కు చెందిన పదిహేడు మంది మహిళలు ‘ఎన్డీఏ’తో తమకు ఉన్న మూడు సంవత్సరాల అనుభవాన్ని, అనుబంధాన్ని పంచుకున్నారు...యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఎన్డీఏ, నావల్ అకాడమీ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హులైన మహిళలను అనుమతించాలని దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. 2021 ఆగస్ట్లో సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో ఎన్డీఏలోకి మహిళా క్యాడెట్ల వ్రవేశానికి మార్గం సుగమం అయింది.‘ఆర్మీ కుటుంబం నుంచి వచ్చాను. నా కుటుంబ సైనిక నేపథ్యమే నేను సైన్యంలోకి రావడానికి స్ఫూర్తిని ఇచ్చింది. మా నాన్న సైన్యంలో హవల్దార్గా పనిచేశారు. మా తాత కూడా సైన్యంలో పనిచేశారు. అకాడమీ గురించి ఒక మాట చెబుతుంటారు... అకాడమీ ఫస్ట్ బ్రేక్స్ యూ అండ్ దెన్ మేక్స్ యూ. ట్రైనింగ్లో ఇది అక్షర సత్యం అని తెలుసుకున్నాను’ అంటుంది పదిహేడుమంది క్యాడెట్స్లో ఒకరైన హర్ సిమ్రాన్ కౌర్.‘సైన్యం అనే భావన నా రక్తంలోనే ఉంది. నా తండ్రి మాజీ ఎన్డీఏ ఆఫీసర్. నా సోదరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసింది’ అంటుంది శుృతి ‘ఫస్ట్ బ్యాచ్కు చెందిన మహిళలుగా మేము ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాల్సిన అవసరం ఉంది’ అంటుంది హర్సిమ్రాన్ కౌర్.‘లింగ వివక్షత ఎక్కడా కనిపించలేదు. అందరినీ సమానంగా చూశారు. మేము ఇక్కడ ఒక కుటుంబంలా ఉన్నాం. కష్టసుఖాలను పంచుకున్నాం. పరుగు నుంచి కొండలు ఎక్కడం వరకు అన్నిటిలోనూపోటీ పడ్డాం. ఎన్డీఏలో మహిళలు అడుగుపెట్టడం అనేది మహిళాసాధికారతకు, సాయుధ బలగాలలోపాలుపంచుకోవాలన్న యువ మహిళల ఆకాంక్షకు అద్దం పడుతుంది’ అంటుంది కేడెట్ ఇషితా శర్మ.‘ఎన్డీఏలో ఇచ్చే శిక్షణ కఠినంగా ఉంటుందని తెలిసినా ఎప్పుడూ బెదరలేదు. ఎన్డీఏలోకి రావడానికి ముందు పరిస్థితి ఎలా ఉన్నా, ఇప్పుడు మాత్రం ఎలాంటి విపత్కరమైన పరిస్థితి అయినా తట్టుకొనే సామర్థ్యం, ధైర్యసాహసాలు వచ్చాయి. ఇక్కడ ఇచ్చిన శిక్షణ మమ్మల్ని తీర్చిదిద్దింది. మానసికంగా దృఢత్వాన్ని తీసుకువచ్చింది’ అంటుంది బెటాలియన్ కెప్టెన్ క్యాడెట్ రీతుల్.గతంలోకి వెళితే...ఎన్డీఏలో మహిళల ప్రవేశానికి గ్రీన్సిగ్నల్ ఇవ్వడంపై కొందరికి సందేహాలు వచ్చాయి. ‘ఇంతకీ నిరూపించుకుంటారా?’ ‘బ్రహ్మాండంగా’ అని చెప్పడానికి ఎన్డీఏలో ఫిమేల్ క్యాడెడ్స్ ప్రతిభ కొలమానం. తిరుగులేని సమాధానం. మహిళా క్యాడెట్లు ఎన్నో హద్దులను అధిగమించారు. అకాడమిక్ పెర్ఫార్మెన్స్లోనే కాదు పీటి, డ్రిల్లోనూ మెరిట్ కార్డ్ సాధించారు.సవాళ్లను అధిగమించి సత్తా చాటారుశిక్షణ పూర్తి చేసుకున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లోని ఉమెన్ క్యాడెడ్స్ కళ్లలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ‘మా కోర్సులను విజయవంతంగా పూర్తి చేశాం. ఎంతో సవాలుతో కూడిన క్యాంప్ రోవర్స్, క్యాంప్ టోర్న, క్యాంప్ గ్రీన్లను అవలీలగా పూర్తి చేశాం’ అంటుంది ఎయిర్ ఫోర్స్ క్యాడెట్ రీతుల్. ‘పదిహేడుమందిలో ఎవరి స్థాయిలో వారు సత్తా చాటారు’ అంటుంది ఇషితా శర్మ. -
ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న మహిళా క్యాడెట్
న్యూఢిల్లీ: ఇరాన్ అధీనంలో ఉన్న సరుకు రవాణా నౌక ఎంఎస్సీ ఏరీస్లోని 17 మంది భారతీయ సిబ్బందిలోని ఏకైక మహిళా క్యాడెట్ సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. కేరళలోని త్రిసూర్కు చెందిన ఆన్ టెస్సా జోసెఫ్ను ఇరాన్ ప్రభుత్వం విడుదల చేయడంతో గురువారం మధ్యాహ్నం విమానంలో కొచ్చిన్కు చేరుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మిగతా 16 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా విడుదల చేయించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది. వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, భారత్లోని కుటుంబసభ్యులతో ఫోన్లో సంభాషిస్తున్నట్లు కూడా వివరించింది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ నాలుగు రోజుల క్రితం ఇరాన్ విదేశాంగ మంత్రి అమిర్ అబొల్లాహియన్తో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసింది. ఇజ్రాయెల్తో సంబంధాలున్నాయనే అనుమానంతో ఇరాన్ ప్రత్యేక బలగాలు ఈ నెల 13న హొర్ముజ్ జలసంధిలో ఉన్న ఎంఎస్సీ ఏరీస్ నౌకను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. -
డిఫెన్స్ అకాడెమీలోకి మహిళలు..
న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్షలకు మహిళలను అనుమతించనున్నట్లు కేంద్ర రక్షణ శాఖ సుప్రీంకోర్టుకు మంగ ళవారం తెలిపింది. ఈ పరీక్ష నిర్వహణను సజావుగా జరిపేందుకు అవసరమైన చర్యలను చేపడుతు న్నట్లు చెప్పింది. మూడు రకాల రక్షణ బలగాల్లో మహిళలను ప్రవేశపెట్టనున్న ట్లు పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రక్షణ శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. పురుష అభ్యర్థులకు ఉన్నట్లే మహిళా అభ్యర్థులకు కూడా ఎత్తు, బరువు వంటి భౌతిక పరామితులను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. ప్రస్తుతం ఆ పరామితులను నిర్ణయిస్తున్నట్లు తెలిపింది. ఎన్డీఏ ప్రవేశ పరీక్ష సంవత్సరానికి రెండు సార్లు జరుగుతుంది. -
జీవన విలువలు అక్కడే నేర్చుకున్నా: నరేంద్ర మోదీ
ఎన్సీసీలో చేరటం మధుర జ్ఞాపకం న్యూఢిల్లీ: విద్యార్థిగా ఉండగా ఎన్సీసీలో చేరటం తనకు జీవన విలువలు, దేశభక్తి అలవడ్డాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో ఎన్సీసీ వార్షిక రిపబ్లిక్ డే క్యాంప్ వేడుకల్లో ప్రధాని పాల్గొని మాట్లాడారు. తాను జీవిత పాఠాలు నేర్చుకున్న వాతావరణంలోకి తిరిగి అడుగుపెట్టడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. కష్టపడి ఈ అవకాశం దక్కించుకున్న ఎన్సీసీ క్యాడెట్లను ప్రధాని అభినందించారు. ఎన్సీసీలో చేరినా ఢిల్లీలో జరిగే వార్షిక క్యాంప్ వేడుకలకు మాత్రం తాను ఎంపిక కాలేదని మోదీ వెల్లడించారు. తమ పాఠశాల నుంచి ఈ అవకాశం దక్కించుకున్న ఓ విద్యార్థి హఠాత్తుగా రాత్రికి రాత్రే ప్రముఖుడిగా మారిపోయాడని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. యువకుడిగా ఉండగా ఎన్సీసీ దుస్తుల్లో ఉన్న ఫొటోలను ఈ సందర్భంగా మోదీ ట్వీటర్లో విడుదల చేశా రు. ఎన్సీసీ పరేడ్లో మహిళా క్యాడెట్లు ఎక్కువగా పాల్గొనటంపై మోదీసంతృప్తి వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వమే మన బలం భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ బలమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో విభిన్న ప్రాంతాలను సందర్శించి ప్రజలతో మమేకం కావాలన్నారు. జాతిని అర్థం చేసుకోవటానికి స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ దేశవ్యాప్తంగా పర్యటించారన్నారు. కేంద్రమంత్రులు మనోహర్ పారికర్, రావు ఇందర్జిత్ సింగ్, సుష్మా స్వరాజ్, ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్బేడీ, ఎంపీ జయాబచ్చన్ తదితరులంతా ఎన్సీసీలో చేరినవారేనని చెప్పారు. యోగాలో ప్రపంచ రికార్డు సాధించాలి జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఒకే సమయంలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాలని ఎన్సీసీ క్యాడెట్లను ప్రధాని కోరారు. ఇప్పటినుంచే దీనికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐరాస ప్రకటించటం యోగా సాధకులకు గర్వకారణమన్నారు. యోగాకు వయసు, భాష లాంటి సరిహద్దులు లేవన్నారు.