-
ఆ మైనర్ యువకుడే కావాలంటూ రచ్చ.. మహిళ అరెస్ట్!
ముంబై : మైనర్ యువకుడ్ని పెళ్లి చేసుకున్న మహిళ.. అతనితో ఉండనివ్వకపోతే చచ్చిపోతానంటూ రచ్చ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఇరవై రెండేళ్ల మహిళ 17ఏళ్ల మైనర్ను పెళ్లి చేసుకుంది. తనతో కలసి ఉండనివ్వాలని ఆ మైనర్ ఇంట్లో నానా హంగామా చేసింది. తనతో ఉండనివ్వకపోతే తాను ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించింది. అయితే ఈ విషయంపై ఆ మైనర్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తమ కుమారుడు ఇంట్లోంచి ఎక్కడికో వెళ్లిపోయాడని, ఆ మహిళకు ఐదు నెలల ఆడబిడ్డ కూడా ఉందని, అంతేకాకుండా ఇప్పటికే తనకు రెండుసార్లు విడాకులయ్యాయని తమ బిడ్డను ఆ మహిళ హింసిస్తోందని. మాయమాటలు చెప్పి వివాహం చేసుకుందని.. తమ బిడ్డకు, ఆ మహిళకు గత రెండేళ్ల నుంచి పరిచయం ఉందని పేర్కొంది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. పోక్సో , బాల్య వివాహాల చట్టం కింద ఆ మహిళను అరెస్ట్ చేశారు. -
ఒంటరి మహిళలే టార్గెట్
వరంగల్ క్రైం : ఒంటరిగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలను టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న మహిళను ఇంతేజార్గంజ్ పోలీసులు అరెస్టు చేసినట్లు వరంగల్ సీపీ రవీందర్ తెలిపారు. శుక్రవారం కమిషనరేట్లో ఆయన మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోవిందారావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన కట్రోజు విజయ కొన్ని సంవత్సరాల క్రితం జీవనోపాధికి తన భర్తతో వరంగల్కు వచ్చింది. అయితే పిల్లలు పుట్టిన తర్వాత భర్త వదిలివేయడంతో ఆమె బీడీలు చేస్తూ కుటుంబాన్ని సాకుతూ వచ్చింది. కుటుంబం సాకడం భారంగా మారడంతో దొంగతనాలకు చేయడం మొదలెట్టిందన్నారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని బస్ స్టేషన్లో ప్రమాణికులు బస్సులు ఎక్కే క్రమంలో చోరీలకు పాల్పడిందన్నారు. ఇప్పటి వరకు నిందితురాలు రూ.5.65లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు దొంగతనం చేసిందని సీపీ వివరించారు. కాగా శుక్రవారం ఉదయ ఉదయం చోరీ చేసిన బంగారు ఆభరణాలను అమ్మెందుకు వరంగల్ చౌరస్తా బులియన్ మార్కెట్కు వచ్చినట్లు ఇన్స్పెక్టర్ రవికుమార్కు వచ్చిన సమాచారంతో ఎస్సై వెంకటకృష్ణ తన సిబ్బందితో వెళ్లి నిందితురాలిని అరెస్టు చేసి విచారించగా నేరం ఒప్పుకుందని సీపీ తెలిపారు. -
చోరీకేసులో మహిళ అరెస్టు
రెండులక్షల విలువైన బంగారం,సెల్ఫోన్లు స్వాధీనం రాజమహేంద్రవరం రూరల్ : ఆటోలో వెళ్తున్న తోటి ప్రయాణికురాలు వద్ద హ్యాండ్బ్యాగ్ దొంగిలించిన మహిళను శనివారం బొమ్మూరు ఇ¯ŒSస్పెక్టర్ కనకారావు అరెస్టు చేసి, ఆమె వద్ద నుంచి రూ.రెండు లక్షలు విలువైన బంగారపు సొత్తును, సెల్ఫో¯ŒSను స్వాధీనం చేసుకున్నట్టు తూర్పుమండల డీఎస్పీ రమేష్బాబు తెలిపారు. శనివారం బొమ్మూరు పోలీస్స్టేçÙ¯ŒSలో కేసు వివరాలను వెల్లడించారు. గత నెల 16న రాజమహేంద్రవరం సీతంపేటకు చెందిన మధిర శ్రీదేవి మాణిక్యాంబ దివా¯ŒSచెరువు స్టేట్బ్యాంకుకు వెళ్లేందుకు కంబాలచెరువుసెంటర్లో ఆటో ఎక్కారు. దారిలో లాలాచెరువుసెంటర్లో సుమారు 45 ఏళ్ల మహిళ ఆటోఎక్కింది. దివా¯ŒSచెరువు స్టేట్బ్యాంకు వద్ద మాణిక్యాంబ ఆటో దిగి పది నిమిషాల అనంతరం సుమారు 11 కాసులు బరువు కల్గిన ఏడు బంగారుగాజులు, ఒక సామ్సంగ్ సెల్ఫో¯ŒSతో ఉన్న తన హ్యాండ్బ్యాగ్ ఆటోలో మరిచిపోయినట్లు గుర్తించింది. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ కనకారావు దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు లాలాచెరువుసెంటర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న రంగంపేట మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన బల్లి లక్షి్మని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో బల్లి లక్ష్మి గత నెల 16న శ్రీదేవిమాణిక్యాంబతో పాటు ఆటోలో ప్రయాణించి హ్యాండ్బ్యాగును చోరీ చేసినట్టు ఒప్పుకుందని తెలిపారు. ఆమె నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఇ¯ŒSస్పెక్టర్ కనకారావు,ఎస్సైలు కిషోర్కుమార్, నాగరాజు, ఏఎస్సై శివాజీ పాల్గొన్నారు. మహిళా కానిస్టేబుల్ లేకుండానే... మహిళా ముద్దాయిని అరెస్టు చేసే సమయంలోను, ఆమెను తనిఖీచేసే సమయంలోను, విలేకరులకు అరెస్టు చూపే సమయంలోను, కోర్టులో హాజరుపరిచే సమయంలోను మహిళా కానిస్టేబుల్ తప్పనిసరిగా ఉండాలి. అరెస్టు చూపే సమయంలో తప్పనిసరిగా మహిళా కానిస్టేబుల్ పక్కన ఉండాలి. కాని అటువంటి నిబంధనలు ఏమి పాటించకుండానే పోలీసు అధికారులు నిందితురాలిని చూపించడం వారి పనితీరుకు అద్దంపట్టింది. డీఎస్పీ స్థాయి అధికారి ఉన్నప్పటికీ ఈవిషయాన్ని పరిగణనలోనికి తీసుకోకపోవడం విశేషం. -
ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం.. తల్లీకూతుళ్ల అరెస్ట్
పశ్చిమ బెంగాల్ లో ఇద్దరు విదేశీ మహిళలు బుల్లెట్లతో సంచరిస్తూ కలకలం సృష్టించారు. కోల్ కతా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానితులుగా గుర్తించి ఇద్దరు మహిళలను ఎయిర్ పోర్టు అధికారులు అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళల లగేజీని పూర్తిగా పరిశీలించగా వారి వద్ద కొన్ని బుల్లెట్లు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. మొదటగా వారి హ్యాండ్ బ్యాగ్స్ స్కాన్ చేయగా ఎదో ఉన్నట్లు అనుమానం వచ్చి, లగేజీని పూర్తిగా చెక్ చేయడంతో వారి వద్ద బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించామని వారిద్దరూ తల్లీకూతుళ్లు అని అధికారులు వెల్లడించారు. నేతాజీ ఎయిర్ పోర్టు నుంచి ఎమిరేట్స్ విమానంలో వారు దుబాయ్ కి వెళ్లి, అక్కడి నుంచి ఇటలీకి వెళ్లనున్నట్లు ఆ మహిళలు చెప్పారని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఆ తల్లీకూతుళ్లు ఫ్రాన్స్ కు చెందిన వారిని, ప్రస్తుతం వారిని విచారణ చేస్తున్నట్లు వివరించారు. వారి వద్ద నుంచి 5 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రియుడితో కలిసి భర్త హత్య
వీడిన కేసు మిస్టరీ.. వేధిస్తున్నాడని చంపేసింది కేసు వివరాలు వెల్లడించిన సీఐ వెంకట్రామయ్య తాండూరు : వ్యక్తి హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. తనను వేధిస్తున్నాడని మహిళ ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్య శనివారం తన కార్యాలయంలో ఎస్ఐ చతుర్వేదితో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని పాత తాండూరు(మున్సిపల్ క్వార్టర్స్)కు చెందిన జెంతపాగ నాగరాజు(37), నాగలక్ష్మి దంపతులు. నాగరాజు కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడు తరచూ మద్యం తాగుతూ భార్యను కొట్టేవాడు. నాగలక్ష్మికి మున్సిపల్ క్వార్టర్స్లో ఉంటున్న మున్సిపల్ కార్మికుడు బ్యాగరి వెంకటప్పతో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త వేధింపులను ఆమె వెంకటప్పతో మొరపెట్టుకునేది. ఈక్రమంలో ప్రియుడితో కలిసి భర్తను అంతం చేయాలని నాగలక్ష్మి పథకం వేసింది. ఈనెల 6న నాగలక్ష్మి వెంకటప్పకు రూ.3 వేలు ఇచ్చింది. నాగరాజును వెంకటప్ప ఇంట్లోంచి తీసుకొని ఫూటుగా మద్యం తాగించి అర్ధరాత్రి సమయంలో తీసుకొచ్చి ఆరుబయట పడుకోబెట్టి వెళ్లాడు. అనంతరం నాగలక్ష్మి ప్రియుడితో కలిసి భర్తపై గొడ్డలితో దాడి చేసి చంపేసింది. ఇద్దరూ కలిసి నాగరాజు పురుషాంగాన్ని కత్తితో కోశారు. మరుసటి రోజు నాగరాజు హత్య విషయం వెలుగు చూసిన విషయం తెలిసిందే. మొదటగా నాగరాజును గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి ఉండొచ్చని పోలీసులు భావించారు. నాగలక్ష్మి, వెంకటప్పలపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి సోదరి బాలమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈకోణంలో పోలీసులు శనివారం వారిద్దరిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా హత్య నేరం అంగీకరించి పైవిషయాలు తెలిపారు. నిందితులను రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement