breaking news
woman devotee
-
పిఠాపురం: కర్పూరం వెలిగించి.. హుండీలో వేసి..
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురంలో భక్తురాలు అత్యుత్సాహం ప్రదర్శించింది. కర్పూర హారతి వెలిగించి హుండీలో వేసింది. దీంతోహుండీలో నోట్లకు నిప్పు అంటుకుంది. శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంలో ఘటన జరిగింది. హుండీ నుండి పొగలు రావడాన్ని గమనించిన ఆలయ సిబ్బంది.. నీళ్లు పోసి మంటల్ని ఆర్పివేశారు. కాలిన నోట్లను వేరు చేసిన సిబ్బంది.. నోట్లను హెయిర్ డ్రైయర్తో ఆరబెట్టారు.శృంగార వల్లభస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులుతొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి అనేక మంది భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకోవడానికి ఆలయానికి తరలివచ్చారు. సుమారు 20 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు.ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.2,45,750, అన్నదాన విరాళాలకు రూ.78,315, కేశ ఖండన ద్వారా రూ.5,920, తులాభారం ద్వారా రూ.450, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ.29,895లతో రూ.3,60,330 ఆదాయం వచ్చిందని చెప్పారు. 4,200 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు. ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజలు నిర్వహించారు. దేవస్తాన సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు. -
బహిర్భూమికి వెళ్లిన మహిళల పట్ల అసభ్యప్రవర్తన.. ఫొటోలు తీసి
సాక్షి, మహానంది(కర్నూలు): మహిళా భక్తుల పట్ల ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆదివారం రాత్రి స్థానికులు సదరు యువకున్ని చితకబాదారు. వివరాలు.. తాడిపత్రికి చెందిన కొందరు భక్తులు మహానందీశ్వరుడి దర్శనార్థం మహానందికి వచ్చారు. అందులో మహిళలు బహిర్భూమికి ఆలయం వెనుక పరిసరాలకు వెళ్లగా మరుగుదొడ్ల నిర్వాహకుల వద్ద పనిచేసే ఓ యువకుడు యజమానులు చెప్పారని ఫొటోలు తీయడంతో వివాదాస్పదమైంది. దీంతో భక్తులు యువకుడిని చితకబాదారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని స్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం భక్తులు స్టేషన్కు చేరుకుని నిర్వాహకులను పిలిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు వచ్చి క్షమాపణలు చెప్పడంతో పాటు ఫొటోలు డిలీట్ చేయడంతో వివాదం సద్దుమణిగింది. చదవండి: కారులో వెళ్తున్న వివాహితను వెంబండించి.. ఆతర్వాత -
పాము ప్రత్యక్షం, భయంతో పరుగులు...
సాక్షి, కాకినాడ : నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసేందుకు వెళ్లిన భక్తులకు ఊహించని షాక్ తగిలింది. ఒక్కసారిగా పాము ప్రత్యక్షం కావడంతో భక్తులు అక్కడ నుంచి పరుగులు తీసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో సోమవారం చోటుచేసుకుంది. సోమవారం నాగులచవితి పర్వదినం సందర్భంగా మహిళలు... పుట్టలో పాలు పోసేందుకు వచ్చారు. పూజల చేసిన అనంతరం పుట్టలో పాలు పోయడంతో ఒక్కసారిగా పాము బయటకు వచ్చింది. దీంతో బిత్తరపోయిన మహిళలు భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కానిస్టేబుల్ను చెప్పుతో కొట్టిన మహిళ
తిరుపతి: కలియుగ వైకుంఠం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అలిపిరి చెక్ పోస్టు వద్ద భద్రతా సిబ్బంది దురుసు ప్రవర్తనతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో భద్రత్రా సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగుతుండడం నిత్యకృత్యంగా మారింది. అలిపిరి చెక్ పోస్టు వద్ద తనిఖీల సందర్భంగా ఓ కానిస్టేబుల్కి, భక్తురాలికి మధ్య ఆదివారం వివాదం చోటుచేసుకుంది. మాటా మాటా పెరగడంతో సహనం కోల్పోయిన భక్తురాలు కానిస్టేబుల్ను చెప్పుతో కొట్టింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అలిపిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.


