breaking news
Without the permission of the schools
-
అనుమతి లేని స్కూళ్లపై చర్యలు
నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో అనుమతి లేని పాఠశాలలపై విద్యాశాఖ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాల నుంచి తీవ్రమైన ఆరోపణలు రావడం, నిరసనలు తలెత్తడంతో జిల్లా అధికారులు వీటిపై చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో విద్యాశాఖ నడుంబిగించింది. అనుమతి లేని 17 పాఠశాలలపై నోటీసులు జారీచేసి సీజ్ చేయాలని ఇదివరకే జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీని వాసాచారి ఆదేశించారు. అంతేగాక ఎంఈఓ లు ఇచ్చిన నివేదికలపై డీఈఓ స్వ యంగా తనిఖీలు చేస్తున్నారు. శుక్రవారం ఆర్మూర్ మండలం ఆలూరు, ఇతర నాలుగు గ్రామాల్లో డీఈఓ పాఠశాలలను తనిఖీ చేశా రు. ఆర్మూర్ పట్టణంలో డీఈఓ తనిఖీలు చేయగా, మూడు పాఠశాలలకు గుర్తింపు లేద ని తేలింది. కానీ ఇదివరకే ఆర్మూర్ మండలంలో అనుమతిలేని పాఠశాలలు లేవని ఎంఈఓ వి ద్యాశాఖ అధికారికి నివేదిక ఇచ్చారు. కానీ డీఈఓ పరిశీలనలో అనుమతిలేని పాఠశాలలు వెలుగులోకి వచ్చాయి. దీంతో స్థానిక విద్యాధికారి బాగోతం బ యటపడింది. తప్పుడు నివేదిక సమర్పించినందుకు ఎంఈఓపై డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసా రి ఇలాంటి పొరపాట్లు జరగకూడదని హెచ్చరించా రు. ఆర్మూర్ మండలంలో పూర్తిస్థాయి పరిశీలన జరి పి, అనుమతి లేని పాఠశాలల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఆరాతీసిన ఇంటెలిజెన్స్.. జిల్లాలో 53 పాఠశాలలకు ఎలాంటి గుర్తింపు లేదని ఇంటెలిజెన్స్ శాఖ అధికారులు డీఈఓకు నివేదిక ఇచ్చారు. జిల్లాలో కొన్నేళ్లుగా పలు పాఠశాలలలు అనుమతి లే కుండా కొనసాగుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా 53 పాఠశాలలను పూర్తిస్థాయి పరిశీలన జరిపి, అనుమతి ఉందా లేదా అనేది తేల్చి నివేదిక ఇవ్వాలని సంబంధిత ఎంఈఓలను డీఈఓ ఆదేశించారు. ఈ నివేదిక అందగానే అనుమతి లేని పాఠశాలలను మూసివేయనున్నట్లు డీఈఓ తెలిపారు. అనుమతి లేకుండా కొనసాగే పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు. సంబంధిత పాఠశాలల విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్పిస్తామన్నారు. జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న పాఠశాలలు అనుమతి లేని పాఠశాలలను మూసివేయాలని రెం డు రోజుల క్రితం జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ జిల్లాకేంద్రంలో ఏడు పాఠశాలలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఎం ఈఓకు ఆదేశాలు జారీ చేసినా, ఇటువైపు వెళ్లకపోవ డం గమనార్హం. గుర్తింపులేకున్నా పాఠశాలల్లో వి ద్యాబోధన చేపడుతున్నారు. ఇంతేగాక మరో 12 పాఠశాలలు ఎలాంటి గుర్తింపు లేకుండా కొనసాగుతున్నప్పటికీ వీటిని ఆ జాబితాలో మాత్రం చేర్చలేదు. -
అనుమతి లేని స్కూళ్లపై కొరడా
నిజామాబాద్ అర్బన్ : ఎట్టకేలకు అనుమతిలేని పాఠశాలలపై విద్యాశాఖ స్పందించింది. జిల్లాలోని 2014-15 విద్యాసంవత్సరానికి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలను సీజ్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసాచారి బుధవారం ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజులుగా ప్రభుత్వ అనుమతి లేకుండా, ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. కలెక్టరేట్, విద్యాశాఖ కార్యాలయాల ఎదుట ధర్నాలూ నిర్వహించాయి. నిరసనలు హోరెత్తుతున్న సమయంలో స్పందించిన అధికారులు గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 17 అనుమతి లేని పాఠశాలలను సీజ్ చేయాలని డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. అనుమతిలేనివి ఇంకా మరెన్నో.. 17 పాఠశాలలే కాకుండా జిల్లాలో చాలా వరకు పాఠశాలలు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. కంఠేశ్వర్లోని బైపాస్రోడ్డు, చంద్రశేఖర్కాలనీలో మూడు పాఠశాలలు, వినాయక్నగర్లో ఐదు పాఠశాలలు, ఖలీల్వాడిలో రెండు పాఠశాలలు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. 8 పాఠశాలలు ఎలాంటి అనుమతి లేకుండానే ఇతర ప్రాంతాలకు మార్పు చేశాయి. ఇలా జిల్లాలోని 86 వరకు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. వీటిపై కూడా అధికారులు దృష్టిసారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. రక్షించేందుకు స్థానిక విద్యాశాఖ అధికారుల ప్రయత్నం! ఇదిలా ఉండగా అనుమతి లేని పాఠశాలలకు స్థానిక విద్యాశాఖ అధికారులే రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్మూర్లో పదకొండు పాఠశాలలు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. వీటిపై అధికారులు దృష్టిసారించలేదు. కొందరు అధికారులు పాఠశాల యాజమాన్యాలతో కుమ్ముక్కై వీటిని తప్పించినట్లు తెలుస్తోంది. జిల్లా శాఖ అధికారులు వీటిపై దృష్టిసారిస్తే మరిన్ని గుర్తింపులేని పాఠశాలలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.