breaking news
Wires
-
పేదల ఇళ్లల్లో.. ‘ఉచిత’ వెలుగులు
ఈ చిత్రంలో కనిపిస్తున్న వివాహిత పేరు.. జర్రిపోతుల పార్వతి. పెళ్లయిన పన్నెండేళ్ల నుంచి గున్నవానిపాలెం అగ్రహారంలో చిన్న ఇంటిలో ఉంటూ అవస్థలు పడుతోంది. సొంత ఇంటి కోసం గతంలో ఎంతో మంది నేతలకు, అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం. ఎట్టకేలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం అందడంతో సొంతింటి కలను నెరవేర్చుకుంది. విద్యుత్ శాఖ.. స్తంభాలు వేసి, వైర్లు లాగి ఆ ఇంటికి కనెక్షన్, మీటర్, బల్బులు ఉచితంగా అందించింది. ఎక్కడా ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వనవసరం లేకుండా పార్వతి సొంతింటిలో విద్యుత్ వెలుగులు ప్రసరించాయి. అమ్మఒడి సాయంతో పాటు తన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యను ఈ ప్రభుత్వం అందిస్తోందని పార్వతి సంతోషంతో చెబుతోంది. అనకాపల్లి జిల్లా లంకెలపాలెం విద్యుత్ సెక్షన్లోని మారేడుపూడి కాలనీ (బోణం గణేష్, అనకాపల్లి జిల్లా మారేడుపూడి కాలనీ నుంచి సాక్షి ప్రతినిధి) .. ఇలా ఒక్క పార్వతే కాదు.. ఎంతోమంది మహిళలు తమ కుటుంబంతో కలిసి జగనన్న ఇళ్లల్లో విద్యుత్ వెలుగుల మధ్య సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా అనకాపల్లి జిల్లా మారేడుపూడి కాలనీలో పర్యటించిన ‘సాక్షి’తో లబ్ధిదారులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల్లో ఇళ్లకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యుత్ సౌకర్యాలను కల్పిస్తూ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని, అందుకు తామే నిదర్శనమని చెబుతున్నారు. పచ్చని ప్రకృతి నడుమ, ఎతైన కొండల మధ్య ఉన్న మారేడుపూడి కాలనీలో 67 విద్యుత్ సర్విసులను అక్కడ కొత్తగా నిర్మించిన ఇళ్లకు అందించారు. ఇందుకోసం కాలనీ మొత్తం విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. స్తంభం నుంచి ఇంటి వరకు సర్విసు వైరును సమకూర్చారు. మీటర్తో సహా అన్ని పరికరాలు, సర్విసును ఉచితంగా ఇచ్చారు. ఆ విద్యుత్ సదుపాయంతో అక్కడి ప్రజలు తమ కొత్త ఇంటిలో రంగురంగుల ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసుకుని మురిసిపోతున్నారు. తమకు ఈ భాగ్యం కల్పించిన సీఎం వైఎస్ జగన్కు చెమర్చిన కళ్లతో కృతజ్ఞతలు చెబుతున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద తొలి దశలో పేదలకు ప్రభుత్వం నిరి్మస్తున్న లేఔట్లలో ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కంలు)ల ద్వారా ముందుగా 14,49,133 సర్విసులకు విద్యుత్ సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తోంది. ముఖ్యంగా లేఔట్లలో విద్యుత్ లైన్లు వేసి, పేదల ఇళ్లకు, బోర్లకు ఉచితంగా విద్యుత్ సర్విసులను అందిస్తోంది. ఈ పనులకు రూ.7,080 కోట్లు ఖర్చవుతోంది. ఇందులో మొదటి దశలో 10,741 లేఔట్లకు రూ.5,541.94 కోట్లతో విద్యుత్ సంస్థలు పనులు చేపట్టాయి. కోట్లాది రూపాయల ఖర్చుతో విద్యుత్ సౌకర్యం.. తూర్పు డిస్కంలో వాటర్ వర్క్స్కు సంబంధించి ఇప్పటివరకు 2,492 దరఖాస్తులు నమోదు కాగా రూ.50.36 కోట్లతో 2,386 బోర్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందించారు. లైన్ షిఫ్టింగ్ కోసం 76 ప్రాంతాలను గుర్తించారు. ఈ పనులకు రూ.1.85 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి పని మొదలుపెట్టారు. ఇక దక్షిణ డిస్కంలో రూ.49.17 కోట్లతో 2,555 బోర్లను విద్యుదీకరించారు. 435 ప్రాంతాల్లో లైన్లు మార్చడానికి రూ.9.73 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. జగనన్న కాలనీల్లో రెండు విధాలుగా విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. 550 ప్లాట్ల కంటే తక్కువ ఉన్న లేఔట్లకు ఓవర్ హెడ్, 550 ప్లాట్ల కంటే ఎక్కువగా ఉన్న లేఔట్లకు భూగర్భ విద్యుత్ను వేస్తున్నారు. ఇలా మొత్తం 389 లేఔట్లకు భూగర్భ, 9,678 లేఔట్లకు ఓవర్ హెడ్ విద్యుత్ అందిస్తున్నారు. ఓవర్ హెడ్ విద్యుదీకరణకు ఒక్కో ఇంటికి సగటున రూ.98,521 ఖర్చవుతుండగా, భూగర్భ విద్యుదీకరణకు ఒక్కో ఇంటికి సగటున రూ.1,32,284 ఖర్చవుతోంది. అందరం సంతోషంగా ఉన్నాం.. జగనన్న మాకు స్థలం ఇచ్చి.. ఇల్లు కట్టుకోవడానికి ఆరి్థక సాయం కూడా చేశారు. ఇంటికి విద్యుత్ సర్విసును కూడా ఉచితంగా అందించారు. మేం గతంలో పాతూరులో ఉమ్మడి కుటుంబంలో చాలా ఇబ్బందులు పడుతుండేవాళ్లం. ఇక్కడికి వచ్చాక నా భర్త, ఇద్దరు పిల్లలతో అందరం సంతోషంగా ఉన్నాం. –మౌనిక, మారేడుపూడి కాలనీ మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. పదేళ్లుగా సాలోపల్లిపాలెంలో అద్దెకు ఉన్నాం. నా భర్త, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంటిలో అవస్థలు పడ్డాం. సీఎం జగనన్న చలువ వల్ల మాకు సొంతిల్లు వచి్చంది. వీధి లైట్లు వేశారు. మా ఇంటికి ఉచితంగా కరెంటు మీటర్, బల్బు ఇచ్చారు. మా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. –కనుమూరి దేవి, మారేడుపూడి కాలనీ ఉచితంగానే విద్యుత్ సర్విసులు.. పేదలందరికీ ఉచితంగా విద్యుత్ సర్విసులు అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దానికి తగ్గట్టుగానే జగనన్న కాలనీల్లో ఉచితంగా మీటర్లు అమర్చుతున్నాం. ఇందుకు అవసరమైన సబ్ స్టేషన్లు నిర్మించి విద్యుత్ స్తంభాలు, లైన్లు వేస్తున్నాం. –ఎల్.మహేంద్రనాథ్,ఎస్ఈ విశాఖ సర్కిల్, ఏపీఈపీడీసీఎల్ తాగునీటి అవసరాలకూ త్వరితగతిన విద్యుత్.. జగనన్న కాలనీల్లో నిరంతరం విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన విద్యుత్ పంపిణీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. అలాగే తాగునీటి అవసరాలకు బోర్లకు కూడా త్వరితగతిన విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నాం. కె.విజయానంద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధనశాఖ -
ఘోర ప్రమాదం.. వైర్లు తెగి ఊడిపడిన లిఫ్ట్.. ముగ్గురి మృతి
సాక్షి, ఎన్టీఆర్: జిల్లాలోని ఇబ్రహీంపట్నం వీటీపీఎస్లో ఘోర ప్రమాదం జరిగింది. వైర్లు తెగడంతో లిఫ్ట్ అమాంతం కిందపడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో లిఫ్టులో మొత్తం 8 మంది ఉన్నారు. వీరంతా పైకి వెళ్తుండగా లిఫ్టు వైర్లు ఒక్కసారిగా తెగిపోయాయి. దీంతో అంతా లిఫ్టుతో పాటు కిందపడిపోయారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చదవండి: పెళ్లింట విషాదం.. అప్పుడు వరుడి తండ్రి.. ఇప్పుడు వధువు తండ్రి.. -
చినుకు పడితే..చీకట్లే!
నగరంలో అస్తవ్యస్థంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఈదురుగాలులకు నేలకూలుతున్న విద్యుత్ స్తంభాలు.. తెగిపడుతున్న వైర్లు {sిప్పవుతున్న ఫీడర్లు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం సిటీబ్యూరో: చిన్నపాటి వర్షం..ఈదురు గాలులకే మహానగరంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యవస్థమవుతోంది. విద్యుత్ స్తంభాలు నేలకూలడం, వైర్లు తెగడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, ఫీడర్లు ట్రిప్పవడం వంటి ఘటనలతో నగరవాసులు గంటలకొద్దీ చీకటిలో మగ్గాల్సి వస్తోంది. ఇందుకు ఆదివారం నాటి ఘటనలే నిదర్శనం. సాయంత్రం వీచిన ఈదురు గాలికి నగరంలో తొంభై రెండు 11 కేవీ, పదిహేడు 33 కేవీ ఫీడర్లు ట్రిప్పయ్యాయి. సగం సిటీలో అంధకారం నెలకొంది. కొన్ని చోట్ల అర్థరాత్రికి విద్యుత్ను పునరుద్ధరిస్తే..చాలా చోట్ల సోమవారం తెల్లవారే వరకు చీకట్లోనే గడపాల్సి వచ్చింది. గ్రేటర్లోని హెదరాబాద్, రంగారెడ్డి జోన్స్ పరిధిలో ఆరు సర్కిళ్లు ఉన్నాయి. 13 వేల కిలోమీటర్ల 11 కేవీ, 2500 కిలోమీటర్ల 33 కేవీ లైన్లు, 3600 కిలోమీటర్ల ఎల్టీ లైన్లు ఉన్నాయి. 5200 పైగా 11కేవీ, 600పైగా 33 కేవీ ఫీడర్లు ఉన్నాయి. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల నరికివేత, ఆయిల్ లీక్ అవుతున్న ట్రాన్స్ఫార్మర్ల మార్పు, శిథిలావస్థకు చేరిన కండెన్సర్ల స్థానంలో కొత్తవి అమర్చడం, లూజ్ కాంటాక్ట్లను సరి చేయడం వంటి పనులను సెంట్రల్ బ్రేక్ డౌన్ విభాగం చూస్తుంది. ఇందు కోసం 2013-14లో రూ.110 కోట్లు కేటాయించగా, 2015-16లో రూ.120 కోట్లు కేటాయించింది. ఇందులో కేవలం ట్రీ కటింగ్ పనులకే రూ.40 కోట్లకుపైగా ఖర్చు చేస్తుంది. ఒకసారి చెట్లకొమ్మలు నరికిన తర్వాత మళ్లీ పెరిగే అవకాశం చాలా తక్కువ. కానీ అవే కొమ్మలను మళ్లీ మళ్లీ తొలగించినట్లు చెప్పి బిల్లులు డ్రా చేస్తున్నా.. నిజానికి చాలా చోట్ల అసలు పునరుద్ధరణ పనులు చేయడం లేదు. నిజానికి ఏటా వర్షాకాలానికి ముందే ప్రీమాన్సూన్ పనులు చే పడుతారు. కానీ ఈసారి వేసవిలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలనే ఆలోచనతో ఫిబ్రవరి మాసంలోనే ఈ పనులు చేశారు. ఫీడర్ల వారిగా ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేసి పని చేసినా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మాత్రం మెరుగుపడలేదు. బ్రేక్డౌన్కు కారణాలను గుర్తించే పరిజ్ఞానం డిస్కం వద్ద ఇప్పటి వరకు లేదు. ఈదురుగాలి, వర్షానికి ఎక్కడైనా లైన్లు తెగిపడినా..చెట్ల కొమ్మలు విరిగిపడినా..కండెన్సర్లు దెబ్బతిన్నా స్థానిక సిబ్బంది లైన్ టూ లైన్ తిరిగి సమస్యను గుర్తించాల్సి వస్తోంది. ఆర్-ఏపీడీఆర్పీ పథకం కింద ‘జియోగ్రాఫికల్ ఇన్పర్మేషన్ సిస్టమ్(జీఐఎస్)’ను ఏర్పాటు చేయాలని భావించి, ఆ మేరకు నాలుగేళ్ల క్రితం గ్రీన్ లాండ్ డివిజన్ను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సర్వే కూడా చేసింది. కానీ ఇప్పటి వరకు ఈ పరిజ్ఞానం అందుబాటులోకి రాలేదు. సగం సిటీ అంధాకారంలోనే ఆదివారం సాయంత్రం ఈదురుగాలితో కూడిన వర్షానికి హబ్సిగూడ డివిజన్ ఇంద్రానగర్లో ఓ విద్యుత్ స్తంభం నేలకూలింది. స మీప బస్తీలన్నీ ఆ రాత్రంతా అంధకారంలోనే మగ్గాల్సి వచ్చింది. చెట్ల కొమ్మలు విరగడంతో పాటు ఫ్లెక్సీలు, హోర్డింగ్లు గాలికి ఎగి రి లైన్లపై పడ్డాయి. దీంతో ఉప్పల్, రామంతాపూర్, హబ్సిగూడ, తదితర ప్రాంతాల్లోని బస్తీలు రాత్రంతా అంధకారంలోనే ఉన్నాయి. చంపాపేట్ డివిజన్ రాజీవ్శెట్టి న గర్లో విద్యుత్ వైరు తెగిపడింది. అదృష్టవశాత్తూ అక్కడ ఎవరూ లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక ఖైరతాబాద్ ఆదర్శ్నగర్, వెంకటరమణ కాలనీలో అర్థరాత్రి వరకు సరఫరా నిలిచింది. ఫెక్సీలు విద్యుత్ వైర్లపై పడటంతో బోడుప్పల్, నాగోల్, మలక్పేట్, చైతన్యపురి, సరూర్నగర్, చంపాపేట్, ఆస్మాన్ఘడ్ తదితర పాంత్రాల్లో అర్థరాత్రి వరకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. అత్యవసర సమయంలో అధికారులకు ఫోన్ చేస్తే ఎవరూ స్పందించడం లేదు. 1912 కాల్ సెంటర్కు రోజుకు సగటున 2000 ఫిర్యాదులు వస్తుండగా, ఆదివారం ఒక్క రోజే ఐదు వేలకుపైగా కాల్స్ వచ్చినట్లు సమాచారం.