-
'వాల్టా' నిబంధనల మార్పు!
సాక్షి, అమరావతి: రైతుల ప్రయోజనాలకు ప్రతిబంధకంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, చెట్టు చట్టం (వాల్టా) నిబంధనల్లో స్వల్ప మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. ఇందుకు గల సాధ్యాసాధ్యాలపై శాస్త్రీయ అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. రాష్ట్రంలో ప్రస్తుతం భూగర్భ జలమట్టం ఎలా ఉంది, వాల్టా చట్టంలోని ఏయే నిబంధనలు రైతులకు సమస్యాత్మకంగా మారాయి, వీటిని రైతులకు ప్రయోజనం కలిగించేలా ఎలా మార్చాలి, ఇందుకు ఎలాంటి విధి విధానాలు పాటించాలి అనే అంశాలపై కమిటీ ప్రతినిధులైన నిపుణులు లోతుగా అధ్యయనం చేశారు. రాష్ట్రంలో మొత్తం ఎన్ని వ్యవసాయ బోర్లు ఉన్నాయి, ఏయే ప్రాంతాల్లో ఈ బోర్లలో ఎంత లోతులో నీరు ఉంది, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు పరిస్థితిలో ఎలాంటి మార్పు వచ్చిందనే సమాచారాన్ని కూడా తెప్పించుకుని శాస్త్రీయంగా విశ్లేషించారు. ఇంకా కొంత అదనపు సమాచారం పంపాలని రాష్ట్ర భూగర్భ జల శాఖను కోరారు. ఈ శాఖ అధికారులు ఈ డేటా సమీకరించి పంపించే పనిలో ఉన్నారు. 27, 28 తేదీల్లో సెమినార్ ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీలో పంచాయతీరాజ్ కమిషనర్ చైర్మన్గా, భూగర్భ జల శాఖ సంచాలకులు కన్వీనర్గా, ఆయా రంగాల/సంస్థల ప్రతినిధులైన నిపుణులు సభ్యులుగా ఉన్నారు. జాతీయ భూగర్భ జల శాఖ ఉప సంచాలకులు, జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) వాటర్ షెడ్ విభాగం డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ (ఎన్ఐహెచ్), నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) ప్రతినిధులు, రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ), ఆంధ్ర విశ్వవిద్యాలయం జియో ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ తదితరులు ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల భూగర్భ జల శాఖ ఉప సంచాలకులు, డ్వామా పీడీలు, జల వనరుల శాఖ ఎస్ఈలు, ఇతర జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా సెమినార్ నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. కమిటీ ప్రతినిధులంతా ఈ సెమినార్కు హాజరై చర్చలు జరుపుతారు. అనంతరం చట్టంలోని నిబంధనల మార్పునకు సంబంధించి ఈ కమిటీ త్వరలో మధ్యంతర నివేదిక సమర్పించే దిశగా కసరత్తు చేస్తోంది. అనంతరం ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోనుంది. అసలు చిక్కు ఇదీ! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీవో–227 జారీ చేసింది. భూగర్భం నుంచి నీటిని ఎక్కువగా తోడేసిన (ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్) ప్రాంతాల్లో కొత్తగా బోర్లు వేయరాదనేది ఇందులో ఒక నిబంధన. రాష్ట్రంలో ప్రస్తుతం 1,094 గ్రామాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ గ్రామాల్లో ‘వైఎస్సార్ జలకళ’ పథకం కింద కూడా బోర్లు వేయడానికి లేదు. అలాగే హార్డ్ రాక్ ప్రాంతంలో 120 మీటర్ల లోతుకు మించి బోరు వేయరాదనేది మరో నిబంధన. ఒక బోరు ఇంత దూరంలో ఉంటే ఆ పరిధిలో మరో బోరు వేయరాదనేది ఇంకో నిబంధన జీవోలో ఉన్నాయి. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో రాతి నేలలే ఉన్నాయి. ఇక్కడ 120 మీటర్ల లోతున మాత్రమే బోరు వేయాలన్న నిబంధన ఉంది. ఇంత లోతు మాత్రమే బోరు వేస్తే నీరు రాదు. అందువల్ల బోరు వేసినా ప్రయోజనం శూన్యం. అలాగే 200–300 మీటర్ల పరిధిలో బోరు ఉంటే మరో బోరు వేయకూడదనే నిబంధన వల్ల పక్క రైతు పొలంలో బోరు ఉంటే మరో రైతు వేసుకోవడానికి వీలుకాదు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా బోర్లు వేసి మోటర్లు అమర్చాలనే సమున్నత ఆశయంతో ప్రవేశపెట్టిన వైఎస్సార్ జలకళకూ ఇవే నిబంధనలు వర్తిస్తున్నాయి. దీనివల్ల తమకు ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం లేకుండా పోయిందని, ఈ నిబంధనలను సవరించాలని రైతుల, రైతు సంఘాల నుంచి ప్రభుత్వానికి పెద్దఎత్తున వినతులు అందాయి. దీంతో రైతుల ప్రయోజనార్థం ఈ నిబంధనలు మార్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు సమర్పించే బాధ్యతను ఉన్నత స్థాయి కమిటీకి ప్రభుత్వం అప్పగించింది. -
రైతు మెడపై వాల్టా కత్తి
- హంద్రీనదిలో వేసిన బోర్లపై సర్వే - ప్రభుత్వ కక్షపూరిత చర్య? - ఇసుక అక్రమాలపై కోర్టు ఆశ్రయించడమే రైతులు చేసిన తప్పు - ఏడు మండలాల్లో బోర్లకు పొంచి ఉన్న ముప్పు కోడుమూరు: టీడీపీ నాయకుల ఇసుక అక్రమాలపై కొందరు రైతులు కోర్టును ఆశ్రయించడం తప్పయింది. తమ పార్టీ వారిని ఇరుకున పెట్టారనో..ప్రభుత్వానికి అపవాదు మూటగట్టారనో..హంద్రీ నదిలో బోర్లను సర్వే చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యే అని కొందరు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఇవీ.. తెలుగుదేశం నాయకులు, వారి అనుచరులు.. హంద్రీనదిలో 20 నుంచి 30 అడుగుల లోతు గోతులు తీసి ఇసుకను తరలించుకుపోయారు. ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో కృష్ణగిరి మండలంలోని మన్నెకుంట, ఎర్రగుడి, కోడుమూరు మండలంలోని గోరంట్ల గ్రామాల రైతులు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జిల్లా కలెక్టర్, ఎస్పీని బాధ్యులుగా చేసి హైకోర్టు తీవ్రంగా మందలించింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తుందన్న అపవాదు మూటగట్టుకుంది. దీంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసి రైతులపై కక్ష కట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోనెగండ్ల, కృష్ణగిరి, దేవనకొండ, కోడుమూరు, వెల్దుర్తి, కల్లూరు, కర్నూలు మండలాల పరిధిలోని 29 గ్రామాల సరిహద్దుల్లో గాజులదిన్నె ప్రాజెక్టు హంద్రీనది ప్రవహిస్తోంది. ఏడు మండలాల పరిధిలో ప్రవహిస్తున్న హంద్రీనదిలో రైతులు దాదాపు 2500 మంది రైతులు బోర్లు వేసుకుని దాదాపు 13 వేల ఎకరాల్లో రైతులు పంటను సాగుచేస్తున్నారు. 90 శాతం మంది రైతులు హంద్రీనదిలో బోర్లు వేసుకున్నారు. దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు పైప్లైన్లు వేసి హంద్రీనది బోర్ల ద్వారాపంటలు పండించుకుంటున్నారు. అయితే హంద్రీనది మొత్తం ప్రభుత్వ భూమిగా చూపించి వేసిన బోర్లన్నింటిని తొలగించాలని కుట్ర జరుగుతున్నట్లు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిగా ఉన్న హంద్రీనదిలో ఎంతమంది రైతులు అనుమతి తీసుకుని బోర్లు వేశారు..అనధికారికంగా ఎంతమంది విద్యుత్ కనెక్షన్లు వేసుకున్నారు అనే సమాచారాన్ని వీఆర్వోలు హంద్రీనదిలో తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తున్నారు. వాల్టా చట్టాన్ని అమలు చేసి హంద్రీనది అయిన ప్రభుత్వ భూముల్లో వేసిన బోర్లను తొలగించేందుకు సర్వే చేస్తున్నారని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఇసుక అక్రమ రవాణాపై కోర్టుకు వెళ్లినందుకే రైతులపై కక్ష తీర్చుకునేందుకు అడ్డదారుల్లో అణచివేసేందుకు కుట్ర పన్నుతున్నారని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి కృష్ణ ఆరోపించారు. హంద్రీ నీళ్లే ఆధారం : శ్రీరాములు, రైతు నాకున్న 5 ఎకరాల పొలాన్ని సాగుచేసుకునేందుకు హంద్రీనదిలో బోరు వేసుకున్నా. 8 ఏళ్ల నుంచి ఈ హంద్రీ నీళ్లతోనే పంటలు పండించుకుంటున్నా. వర్షాకాలం వరిపంట, ఎండాకాలం కూరగాయలు సాగుచేసుకుంటున్నాం. హంద్రీనది నీళ్లు లేకుంటే మా పొలాలు వర్షాధారంపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సర్వే చేశాం : నిత్యానందరాజు, తహసీల్దార్ హంద్రీనదిలోని ప్రభుత్వ భూమిలో ఎంతమంది రైతులు బోర్లు వేసుకున్నారన్న విషయాలపై వీఆర్వోలు సర్వే చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ సర్వే జరుగుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement