vizag accident
-
రుషికొండ బీచ్లో విషాదం
కొమ్మాది (విశాఖ): మహాశివరాత్రి పర్వదినాన్ని ఆనందంగా గడపాలని సంద్రానికి వెళ్లిన స్నేహితులకు విషాదం మిగిలింది. అలల తాకిడికి కొట్టుకుపోయి బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. కొమ్మాది గాయత్రీ విద్యాపరిషత్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఆదివారం రుషికొండ బీచ్కు చేరుకున్నారు. అక్కడ స్నానాలు ముగించుకుని రాడిసన్ బ్లూ వెనుక వైపు ఉన్న తీరానికి వెళ్లారు.అరవింద్ నాయుడు (21) మళ్లీ సముద్రంలోకి దిగగా, అలల ఉధృతికి ఒక్కసారిగా కొట్టుకుపోయాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో స్నేహితుడు గోకులకృష్ణ ప్రమాదంలో చిక్కుకున్నాడు. గమనించిన లైఫ్ గార్డ్స్ బోటులో వెళ్లి గోకుల కృష్ణను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అపస్మారక స్థితిలో ఉన్న అరవింద్కు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అరవింద్ మృతి చెందాడు. అరవింద్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి గ్రామం. అతని తండ్రి సూర్యప్రకాష్ ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీసులు కేసునమోదు చేశారు. -
ఎసెన్షియా ప్రమాద బాధితులకు చంద్రబాబు పరామర్శ
-
18 మంది చనిపోతే పట్టించుకోని ప్రభుత్వం
-
ఒక తండ్రిలా ఆదుకున్నాడు వైఎస్ జగన్
-
విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం ఘటనలో వెలుగులోకి కొత్త అంశాలు
-
ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంపై వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్
-
10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
బాధితులకు అండగా ఉండాలని సీఎం ఆదేశించారు: మంత్రి సీదిరి
-
విశాఖలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి
విశాఖపట్టణం : విశాఖపట్టణం ఎన్ఏడి జంక్షన్లో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మట్టి లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి ఆగి ఉన్న ఆటోపై పడింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టు మార్టం కోసం తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.


