breaking news
Vinod Khosla
-
మరో ఐదేళ్లలో ఆ ఉద్యోగాలన్నీ మాయం!
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్ రంగంలోని ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. కొన్ని స్టార్టప్స్.. టెక్ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని కొత్త ఏఐ టూల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఇవి మానవ ప్రమేయం లేకుండా పనులను వేగంగా చేసేస్తున్నాయి. కాబట్టి చాలా సంస్థలు ఏఐలో పెట్టుబడులు పెడుతూ.. తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఈ సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త & వెంచర్ క్యాపిటలిస్ట్ 'వినోద్ ఖోస్లా' ఏఐ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.ఖోస్లా అభిప్రాయం ప్రకారం.. AI అభివృద్ధి వేగంగా జరుగుతున్నందున వైట్ కాలర్ ఉద్యోగాలలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ సర్వీస్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (BPO) రంగాలు వచ్చే ఐదు సంవత్సరాలలో దాదాపు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని అన్నారు.ప్రస్తుతం ఏఐ సాధనాలు సాధారణ డిజిటల్ సహాయకుల స్థాయి నుంచి స్వయం నియంత్రిత కలిగిన AI వర్కర్స్ స్థాయికి ఎదుగుతున్నాయి. ఇవి అనేక పనుల్లో మానవులను సైతం మించిపోయే అవకాశం ఉందని ఖోస్లా వెల్లడించారు. అకౌంట్స్, లా, మెడిసిన్స్, చిప్ డిజైన్ వంటి రంగాల్లో.. ఏఐ పురోగతి చాలా వేగంగా ఉంటుందని హెచ్చరించారు.ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్స్ మార్కెట్లో అడుగుపెట్టి వ్యాపార విధానాలను మార్చివేశాయి. మానవ మేధస్సుపై ప్రత్యక్ష ప్రభావం చూపించలేకపోయాయి. కానీ ఏఐ మనిషి ఆలోచనా శక్తిని అనుకరిస్తూ.. చాలా పనులను వేగంగా చేస్తోంది. కాబట్టి ఇది సాధారణ సాంకేతిక పరివర్తన కాదు, ఒక తరం మొత్తాన్ని ప్రభావితం చేసే విప్లవాత్మక మార్పు అని ఆయన అభివర్ణించారు.ఏఐ కంపెనీ వీడిన సేఫ్టీ హెడ్ఆంథ్రోపిక్ కంపెనీలో సేఫ్గార్డ్ రీసెర్చ్ టీమ్కు నాయకత్వం వహించిన మృణాంక్ శర్మ రాజీనామా చేశారు. ఆయన ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడిస్తూ.. ప్రపంచం ప్రమాదంలో ఉందని చెబుతూ.. దీనికి కారణం కేవలం ఏఐ లేదా బయో వెపన్స్ మాత్రమే కాదు. ఒకదానితో ఒకటి ముడిపడిన అనేక సంక్షోభాల వల్ల ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. అయితే ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి మన జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పుడే మనం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోగలం అని పేర్కొన్నారు. లేకుంటే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. -
అమెరికాలో అపర కుబేరులు మనవాళ్లే..
విదేశాల్లో పుట్టి అమెరికాలో అపర కుబేరులుగా ఎదిగినవాళ్లలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ 2025 ర్యాంకింగ్స్లో 12 మంది భారత సంతతి బిలియనీర్లు చోటు దక్కించుకోవడంతో అత్యధిక మంది విదేశీ అమెరికన్ కుబేరులకు జన్మస్థానంగా భారత్ నిలిచింది. 2022లో కేవలం ఏడుగురు భారత సంతతి బిలియనీర్లు ఉండగా ఇప్పుడు గణనీయంగా పెరిగారు.అమెరికాలో విదేశీ సంతతి సంపన్నుల తాజా జాబితాలో భారత్.. ఇజ్రాయెల్, తైవాన్లను అధిగమించింది. ఈ రెండు దేశాలకు చెందినవారు చెరో 11 మంది ఈ జాబితాలో ఉన్నారు. స్వయం కృషితో ఎదిగిన ఈ భారత సంతతి కుబేరులు.. విదేశాలలో జన్మించిన యూఎస్ బిలియనీర్ల మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్ల సంపదలో గణనీయ వాటాను అందిస్తున్నారు.ఆల్ఫాబెట్ అధినేత సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల వంటి కొత్తవారు ఇటీవల ఈ జాబితాలో చేరినప్పటికీ అంతగా గుర్తింపు లేని దిగ్గజాలతో పోలిస్తే వారు ఆశ్చర్యకరంగా తక్కువ ర్యాంకులో ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ దిగ్గజం జెడ్ స్కేలర్ వ్యవస్థాపకుడు జే చౌదరి 17.9 బిలియన్ డాలర్ల సంపదతో భారత సంతతి అమెరికన్ బిలియనీర్లలో అగ్రస్థానంలో ఉన్నారు. విద్యుత్తు, నీరు లేని మారుమూల హిమాలయ గ్రామం పనోహ్ లో జన్మించిన చౌదరి గ్రాడ్యుయేట్ చదువుల కోసం 1980లో తొలిసారి అమెరికా వెళ్లారు.భారత సంతతి అపర కుబేరులు వీళ్లే..జే చౌదరి (17.9 బిలియన్ డాలర్లు) - సైబర్ సెక్యూరిటీ (జెడ్ స్కేలర్)వినోద్ ఖోస్లా (9.2 బిలియన్ డాలర్లు) - సన్ మైక్రో సిస్టమ్స్, వెంచర్ క్యాపిటల్రాకేష్ గంగ్వాల్ (6.6 బిలియన్ డాలర్లు) - ఎయిర్లైన్స్ (ఇండిగో సహ వ్యవస్థాపకుడు)రోమేష్ టి.వాధ్వానీ (5.0 బిలియన్ డాలర్లు) - సాఫ్ట్వేర్ - సింఫనీ టెక్నాలజీ గ్రూప్రాజీవ్ జైన్ (4.8 బిలియన్ డాలర్లు) - ఫైనాన్స్ (జీక్యూజీ పార్టనర్స్ చైర్మన్)కవితార్క్ రామ్ శ్రీరామ్ (3.0 బిలియన్ డాలర్లు) - గూగుల్, వెంచర్ క్యాపిటల్రాజ్ సర్దానా (2.0 బిలియన్ డాలర్లు) - టెక్నాలజీ సేవలు (ఐటీ సంస్థ టీసీజీఐ)డేవిడ్ పాల్ (1.5 బిలియన్ డాలర్లు) - వైద్య పరికరాలు (వెల్క్వెస్ట్ / న్యూరోసిగ్మా)నికేష్ అరోరా (1.4 బిలియన్ డాలర్లు) - సైబర్ సెక్యూరిటీ (పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ)ఫోర్బ్స్ తాజా డేటా ఆధారంగా అమెరికాలోని అత్యంత ధనవంతులైన భారత సంతతి బిలియనీర్లు వీరే. టెక్ దిగ్గజాలు సుందర్ పిచాయ్ (1.1 బిలియన్ డాలర్లు), సత్య నాదెళ్ల (1.1 బిలియన్ డాలర్లు) 10, 11వ స్థానాల్లో నిలిచారు. -
ఫోర్బ్స్ ‘గ్రేటెస్ట్ బిజినెస్ మైండ్స్’లో మనోళ్లు ముగ్గురు
శత వార్షికోత్సవ జాబితాలో చోటు న్యూయార్క్: తన వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని ప్రస్తుత జీవించివున్న వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, మేధావుల సమ్మేళనంతో ఫోర్బ్స్ మ్యాగజీన్ తాజాగా ‘వరల్డ్ 100 గ్రేటెస్ట్ లివింగ్ బిజినెస్ మైండ్స్’ జాబితాను విడుదల చేసింది. ఇందులో ముగ్గురు భారతీయులు స్థానం దక్కించుకున్నారు. అర్సిలర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్.. టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా.. సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకులు వినోద్ ఖోస్లా ఇందులో ఉన్నారు. శతవార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసిన తాజా ప్రత్యేకమైన జాబితాలో డొనాల్డ్ ట్రంప్ కూడా స్థానం పొందారు. ఈయనతోపాటు అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్, వర్జిన్ గ్రూప్ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్, బార్క్షైర్ హత్వే సీఈవో వారన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్, న్యూస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రూపెర్ట్ ముర్డోచ్ వంటి ప్రముఖులు ఉన్నారు. అలాగే సీఎన్ఎన్ ఫౌండర్ టెడ్ టర్నర్, టాల్క్ షో మాస్టర్ ఓఫ్రా విన్ఫ్రే, డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు మైకేల్ డెల్, పేపాల్/ టెస్లా/ స్పేస్ఎక్స్ కో–ఫౌండర్ ఎలెన్ మాస్క్, ఫేస్బుక్ సీవోవో షెరిల్ శాండ్బర్గ్, స్టార్బక్స్ సీఈవో హోవర్డ్ షుల్జ్, ఫేస్బుక్ సహ వ్యవస్థాపకులు మార్క్ జుకర్బర్గ్ వంటి పలువురు స్థానం పొందారు. కొత్త ఆవిష్కరణలతో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న, ప్రపంచంపై తన వంతు ప్రభావాన్ని చూపిన 100 ఎంట్రప్రెన్యూర్లతో ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. కాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ను బీసీ ఫోర్బ్స్.. వాల్టర్ డ్రేయ్తో కలిసి 1917 సెప్టెంబర్ 17న ఏర్పాటు చేశారు. -
ఫోర్బ్స్ తాజా జాబితాలో.. ముగ్గురు మనవాళ్లే..!
సాక్షి, న్యూఢిల్లీ : దిగ్గజ భారతీయ వ్యాపార వేత్తలకు ఫోర్బ్స్ మేగజైన్ మరో కితాబునిచ్చింది. ఫోర్బ్స్ మేగజైన్ తాజాగా హండ్రెడ్ గ్రేటెస్ట్ లివింగ్ బిజినెస్ మైండ్స్ పేరుతో ఒక జాబితాను రూపొందించింది. అందులో భారత్ నుంచి టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా, ఆర్సెలర్ అధినేత ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్, సన్ మైక్రో సిస్టమ్స్ సహ వ్యవస్థాపకులు వినోద్ ఖోస్లాలకు అందులో చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ మేగజైన్ ఆరంభించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఒక ప్రత్యేక సంచికను విడుదల చేసింది. అందులో వ్యాపార చరిత్రలో సంచలనాలు.. కొత్త పెట్టుబడులు ఎలా పెట్టాలి? వ్యాపారస్తుడి విజన్ ఎలా ఉండాలి? వంటి అంశాలతో ప్రపంచవ్యాప్తంగా 100 వంది వ్యాపారస్తుల ఆలోచనలను.. వారి వ్యక్తగత, వ్యాపార విశేషాలను అందులో పొందుపరచడం జరిగింది. ఈ సంచితకపై ఫోర్బ్స్ సిబ్బంది మాట్లాడుతూ..ప్రముఖ వ్యాపారస్తులపై ప్రత్యేక మేగజైన్ తీసుకురావడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. -
అమెరికా కుబేరుల్లో మనోళ్లు ఐదుగురు
న్యూయార్క్: అమెరికాలోని అత్యంత ధనవంతుల (టాప్ 400) జాబితాలో ఐదుగురు భారత-అమెరికన్లకు చోటు లభించింది. ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ రూపొందించిన ఈ ఏడాది జాబితాలో 8,100 కోట్ల డాలర్ల(దాదాపు రూ.4.86 ల కోట్లు) సంపదతో మైక్రోసాఫ్ట్ బిల్గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు. అత్యంత ధనవంతుడైన అమెరికన్గా బిల్గేట్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం ఇది వరుసగా 21వ ఏడాది. అమెరికా కుబేరుల విషయమై ఫోర్బ్స్ రూపొందిం చిన ఈ జాబితా విశేషాలు.... రెండో స్థానంలో వారెన్ బఫెట్ ఉన్నారు. బెర్క్షైర్ హాత్వే చీఫ్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తున్న బఫెట్ సంపద 6,700 కోట్ల డాలర్లుగా ఉంది. 2001 నుంచి ఆయన ఈ రెండో స్థానంలో కొనసాగుతూనే ఉన్నారు. 5,000 కోట్ల డాలర్ల సంపదతో ఒరాకిల్ లారీ ఎలిసన్ మూడో స్థానంలో నిలిచారు. ఫేస్బుక్ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీఈఓ కూడా అయిన మార్క్ జుకర్బెర్గ్ 11 వస్థానంలో నిలిచారు. ఈ ఏడాది అందరికంటే ఎక్కువగా లాభపడ్డది ఈయనే. గతేడాది 1,500 కోట్ల డాలర్లుగా ఉన్న ఈయన సంపద ఈ ఏడాది 3,400 కోట్ల డాలర్లకు పెరిగింది. ఫేస్బుక్ షేర్ల ధర బాగా పెరగడమే దీనికి కారణం. ఈ జాబితాలోని టాప్ 400 సంపన్నుల మొత్తం సంపద 2.29 లక్షల కోట్ల డాలర్లు. గత ఏడాదితో పోల్చితే ఇది 27,000 కోట్ల డాలర్లు అధికం. జోరుగా ఉన్న స్టాక్ మార్కెట్ల కారణంగా వీరి సంపద బాగా పెరిగింది. -
అమెరికా శ్రీమంతుల్లో ముగ్గురు ఎన్నారైలు
అమెరికా శ్రీమంతుల జాబితాలో ముగ్గురు ప్రవాస భారతీయులు చోటు దక్కించుకున్నారు. అమెరికాలో అత్యంత ధనవంతులైన 400 మందితో కూడిన జాబితాను 'ఫోర్బ్స్' ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 72 బిలియన్ డాలర్ల సంపదతో వరుసగా 12వ ఏడాది ఆయన టాప్ పొజిషన్లో ఉన్నారు. గతేడాది పోలిస్తే ఆయన సంపద 6 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇండియన్ అమెరికన్, ఎఎంపీ అండ్ ఎఎంపీ కంపెనీ అధినేత భారత్ దేశాయ్ 2.2 బిలియన్ డాలర్ల సంపదతో 252 స్థానంలో నిలిచారు. కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్న రొమేష్ టీ వద్వానీ 2.1 బిలయన్ డాలర్ల ఆస్తులతో తర్వాత స్థానంలో ఉన్నారు. కాలిఫోర్నియా వెంటర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా 352 స్థానంలో నిలిచారు. ఆయన సంపద 1.5 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ లెక్కగట్టింది. ఇన్వెస్టర్ వారెన్ బఫెట్(58.5 బిలియన్ డాలర్లు), ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్(41 బిలియన్ డాలర్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. గతేడాది 36వ స్థానానికి పడిపోయిన ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్(19 బిలియన్ డాలర్లు) 20వ స్థానానికి ఎగబాకారు.


