Vijay Chandra
-
టీడీపీ ఎమ్మెల్యే.. మహిళా ఎంఆర్వోకి అర్ధరాత్రి వాట్సాప్ కాల్ చేసి దూషణ..
సాక్షి, పార్వతీపురం మన్యం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అర్ధరాత్రి మహిళా ఎంఆర్వోకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అనంతరం, సదరు మహిళా ఎంఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీడీపీ ఎమ్మెల్యే ప్లేటు ఫిరాయించారు. రివర్స్లో ఆమెపైనే ఆరోపణలు చేశారు.వివరాల ప్రకారం.. పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర.. మహిళా ఎంఆర్వోకు అర్ధరాత్రి వాట్సాప్లో కాల్ చేశారు. ఈ క్రమంలో అసభ్య పదజాలంతో ఆమెను దూషించారు. దీంతో, సదరు మహిళా ఎంఆర్వో.. పోలీసులకు ఆశ్రయించారు. అనంతరం, టీడీపీ ఎమ్మెల్యే బోనెల.. బహిరంగంగా బ్లాక్మెయిల్కు దిగారు. సదరు అధికారి.. ఎస్టీ మహిళ కావడంతో తనపై కేసు నమోదు అవుతుందున్న భయంతో ఎంఆర్వోపై తీవ్ర ఆరోపణలు చేశారు.ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర స్పందిస్తూ..‘భూమి విషయమై మాట్లాడేందుకు అర్ధరాత్రి ఎంఆర్వోకు నేను ఫోన్ చేశాను. ఆమె ఎత్తకపోవడంతో వాట్సాప్ కాల్ చేశాను. ఎంఆర్వో ఆఫీసు అవినీతిమయంగా తయారైంది. ఎంఆర్వో మానసిన పరిస్థితి సరిగా లేదు. ఎంఆర్వోపై శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా. ఆమె క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.మరోవైపు... ఎంఆర్వోతో అనుచితంగా మాట్లాడిని ఎమ్మెల్యే తీరుపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు స్పందిస్తూ.. మహిళా ఎంఆర్వోకు అర్ధరాత్రి ఎమ్మెల్యే ఫోన్ చేయడం సరికాదు. ఆమెను వేధింపులకు గురిచేయడమేంటని ప్రశ్నించారు. -
రాజన్న రాజ్యం వైఎస్ జగన్తోనే సాధ్యం: మల్లాది
-
రా...
ఎక్కడని నన్ను వెతుకుతావు భగ భగ మండుతున్న పద్య పాదాలమీంచి నడిచి రా ఝుం ఝుం మని వీచే గాలుల్లోకి రా అడవుల్లో వాగుల్లో కొండల్లో కోనల్లో సమూహంగా పరిగెత్తే మహిషాల గుంపుల్లోకి రా వేటగాళ్ళని వెంటాడి వెంటాడి వేటాడే క్రోధారుణిమ మొహాల్లోకి రా చింతనిప్పుల కళ్ళతో వర్తులంగా ఆకాశంలోంచి గిరికీలు కొట్టే గెద్ద చూపుల్లోకి రా నాగరిక సమాజం తరిమేసిన శిశువుల్లో అడవి పెంచి పెద్ద చేసిన డాన్ బాస్కోల్లోకి రా వాడి నిశ్శేషం కోసం బోధి వృక్షం క్రింద సాము చేస్తున్న వారి ముందు నిల్చో - విజయచంద్ర 9438720409 -
వైఎస్ఆర్ పాత్రలో విజయచందర్
రియల్లైఫ్ క్యారెక్టర్లు చేయడంలో విజయచందర్ మేటి. ఆయన పోషించిన జీసెస్, శిరిడీసాయి, ప్రకాశం పంతులు, ఎన్టీఆర్ పాత్రలే అందుకు నిదర్శనాలు. త్వరలో ఆయన జనహృదయనేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్రెడ్డి పాత్రలో తెలుగు ప్రజల ముందుకు రానున్నారు. ‘మా నేత రాజన్న’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రానికి కంకణాల శ్రీనివాసరెడ్డి దర్శకుడు. షేక్ సైదా సూరజ్ నిర్మాతలు. ఈ చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్లో వైభవంగా జరిగింది. ముహూర్తపు దృశ్యానికి మోహన్ కెమెరా స్విచాన్ చేయగా, వైఎస్ఆర్సీపీ నాయకుడు రెహమాన్ క్లాప్ ఇచ్చారు. వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. విజయచందర్ మాట్లాడుతూ -‘‘తెలుగుజాతికి వన్నె తెచ్చిన మహనీయులు టంగుటూరి ప్రకాశం, ఎన్టీఆర్, వైఎస్ఆర్. ఈ ముగ్గురిలో టంగుటూరి, ఎన్టీఆర్ పాత్రలు చేసేశాను. ఇప్పుడు వైఎస్సార్ పాత్ర చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను నటించడం యాదృచ్ఛికం. ఆ మహానేతే నా వెనకుండి నాతో ఈ పాత్ర చేయించుకుంటారనుకుంటున్నాను’’ అన్నారు. డిసెంబర్లో సినిమా విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. వైఎస్ఆర్ పాత్ర చేయడానికి విజయ్చందర్ ముందుకు రావడంతో మాకు కొండంత బలం వచ్చిందని నిర్మాత నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి మాటలు: తులసి శ్రీనివాసరావు, సహ నిర్మాత: మస్దాని సూరజ్.