breaking news
vigilance attak
-
అనుమతులు లేకుండా స్వీట్ డ్రింక్ తయారీ
విశాఖ సిటీ ,చోడవరం: అనుమతులు లేకుండా స్వీట్ డ్రింక్స్ తయారుచేస్తున్న సెంటర్పై విజిలెన్స్, ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు గురువారం దాడులు చేశారు. చోడవరం మండలం నర్సాపురం గ్రామంలో నిర్వహిస్తున్న ఈ సెంటర్పై రెండు శాఖల అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. లోకల్ డ్రింక్ పేరుతో ఇక్కడ తయారుచేస్తున్న స్వీట్ డ్రింక్ను పాత పెప్సీ, బ్రీజర్, ఇతర సీసాల్లోనింపి గ్రామీణ ప్రాంతంలో విక్రయిస్తున్నారు. నీటిలో పంచదార, ఎసెన్స్, కొన్ని రంగులు ఒక మిషన్ ద్వారా మిక్స్చేసి ఆ ద్రావణాన్ని సీసాల్లో నింపి అమ్ముతున్నారు. సంపత్ వినాయక సంతోషిమాత డ్రింక్ పేరున నడుస్తున్న ఈ లోకల్ డ్రింక్ తయారు చేసేందుకు ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో దాడులు చేసినట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు. అనుమతులు లేకుండా శీతల పానీయం తయారీ చేయడం వల్ల ప్రజలకు ప్రమాదమని, ఈ మేరకు ఈ సెంటర్పై దాడి చేసి కేసు నమోదుచేసినట్టు విజిలెన్స్ డీఎస్పీ పి.ఎం. నాయుడు, ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఫుడ్ సేఫ్టీ అధికారి బి.వేణుగోపాల్, గజిటెడ్ ఫుడ్ ఇనస్పెక్టర్ కె. వెంకటరత్నం తెలిపారు. అయితే ఉత్పత్తి చేసిన డ్రింక్స్, శీతలపానీయాలను విక్రియించేం దుకు ఫుడ్ కంట్రోల్ శాఖ నుంచి ఈ సెంటర్కు అనుమతి ఇస్తూ లైసెన్సు ఉంది. దీనిని పరిశీలించిన అధికారులను ఇక్కడ ఏ లేబుల్ లేకుండా స్వీట్ డ్రింక్స్ సీసాల్లో నింపి ఉన్న 15 కేసులను అధికారులు సీజ్చేశారు. కొన్ని బాటిళ్లను శాంపిల్స్ కోసం సీజ్చేసి తీసుకెళ్తున్నట్టు ఫుడ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. -
రైస్ మిల్లుపై విజిలెన్సు దాడులు
రెండు ఆటోలు రూ. 24 లక్షల విలువైన బియ్యం, ధాన్యం సీజ్ కాపవరం (కోరుకొండ ) : మండలంలోని కాపవరంలోని సూర్య మహాలక్ష్మి మోడ్రన్ రైస్ మిల్లుపై విజిలెన్సు అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రూ. 24 లక్షల విలువ చేసే బియ్యం, ధాన్యం, రెండు ఆటోలు, రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని, 6ఏ కేసు నమోదు చేశారు. ఈ మిల్లుపై విజిలెన్సు దాడులు జరగడంతో కోరుకొండ మండలంలోని పలువురు తమ మిల్లులను, షాపులను మూసివేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ డీఎస్పీ పీఆర్ రాజేంద్రకుమార్, సీఐ ఎన్వీ భాస్కరరావు, విజిలెన్సు తహసీల్దార్ జి. గోపాలరావు, రాజమహేంద్రవరం ఏఎస్ఓ ప్రసాద్, ఎంఎస్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజేంద్రకుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఈ దాడిలో రెండు ఆటోలతో పాటు 650 కేజీల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామన్నారు. మిల్లులో ఉన్న 33 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీన పరుచుకున్నట్టు తెలిపారు. ఎటువంటి బిల్లులూ లేని 1640 క్వింటాళ్ల ధాన్యం, 31 క్వింటాళ్ల పీఎల్ బియ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు .