breaking news
Versova Police Station
-
దర్శకుడి ఇంట్లో కోటి రూపాయలు చోరీ
ముంబై: బాలీవుడ్ దర్శకుడు, నటుడు సతీష్ కౌశిక్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. 1.2 కోట్ల రూపాయలుపైగా చోరీ అయ్యాయి. ఈ మేరకు సతీష్ కౌశిక్, ఆయన భార్య ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వెర్సోవా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన క్రియేటిక్ వర్క్ కోసం ఈ డబ్బు తెచ్చానని, సోమవారం బ్యాంకులో వేద్దామనుకునేలోపు చోరీకి గురయ్యిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సతీష్ కౌశిక్ పనిమనిషి సాజన్ కుమార్ను పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగతనం జరిగిన నాటి అతడు కనిపించకపోవడంతో అనుమానాలకు బలమిస్తోంది. -
పరారీలో ఓం పురి, బాలీవుడ్ నటుడిపై గృహ హింస కేసు!
బాలీవుడ్ నటుడు ఓం పురిపై గృహ హింస కేసును ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో నమోదైంది. ఓం పురిపై ఆయన భార్య నందితా ఆగస్టు 23 తేదిన వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో నందితా పురిని కూపర్ హాస్పిటల్ కు పంపామని, ఆతర్వాత తమకు మెడికల్ రిపోర్టు కూడా ఇచ్చిందని పోలీసులు తెలిపారు. ఓం పురి తనపై కర్రతో దాడి చేశాడని నందితా పురి ఫిర్యాదులో తెలిపిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదైనప్పటి నుంచి ఓంపురి కనిపించకుండా పోయాడని, ఆయన కోసం వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు. ఓం పురిపై నందితా రాసిన జీవిత కథ తర్వాత వారి మధ్య విభేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 'అన్ లైక్లీ హీరో: ది స్టోరి ఆఫ్ ఓం పురి' అనే పుస్తకాన్ని 2009లో ప్రచురించింది. ఈ పుస్తకంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శృంగార సంఘటనలను ప్రచురించడంతో ఓం పురి ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి వారి మధ్య విభేధాలు కొనసాగుతునే ఉన్నాయి. ఆక్రోష్, ఆర్ధ సత్య, హెరా ఫెరీ చిత్రాల్లో తన నటనతో అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.