-
రమ్య కేసు విచారణ వాయిదా
హైదరాబాద్: రమ్య కేసు విచారణ వచ్చే నెల 2 కు వాయిదా పడింది. రమ్య తండ్రి వెంకటరమణ మాట్లాడుతూ ఈ కేసులో మాకు న్యాయం జరుగుతుందని అనుకోవడం లేదు. ఇప్పుడు ట్రైల్స్ ప్రారంభమైతే ఈ కేసు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. సెకండ్ ఛార్జ్షీట్ ఇంత వరకు కోర్ట్లో ఫైల్ చేయలేదు. ఈ కేసు ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపడతాం అన్నారు. కానీ ఇప్పుడు సెషన్కోర్ట్ అంటున్నారు. సెషన్కోర్ట్కి ఈ కేసు వెళ్తే కాలయాపన తప్ప న్యాయం జరగుతుందని మేం భావించడం లేదు. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి రమ్య చట్టం తీసుకురావాలని విన్నవించాం. కానీ ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఈ కేసులో మైనర్లకు మద్యం అమ్మిన వారి పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నా, అయినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
కడచూపునకు నోచుకోకనే..
వలస కుటుంబాన్ని ఛిద్రం చేసిన కారు కళ్లేదుటే భార్య, కుమారుడి దుర్మరణం ఆస్పత్రిపాలైన భర్త విషాదంలో గుడిపల్లె గ్రామం బెంగళూరు మహా నగరంలో కూలి పనులు దొరుకుతాయని, తద్వారా నాలుగు డబ్బులు సంపాదించుకోవడంతోపాటు బిడ్డను చదివించుకోవచ్చన్న ఆశ ఆ నిరుపేద తల్లిదండ్రుల్లో కలిగింది. వారు బిడ్డను తీసుకుని బెంగళూరు నగరానికి వెళ్లారు. అక్కడ కారు రూపంలో వచ్చిన మృత్యువు తల్లి, కుమారుడిని బలితీసుకుంది. తండ్రి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. మృతులకు బుధవారం సాయంత్రం బి.కొత్తకోట మండలం బీరంగి గ్రామం గుడిపల్లె ఎస్సీకాలనీలో అంత్యక్రియలు నిర్వహించారు. బి.కొత్తకోట: మండలం బీరంగి గ్రామం గుడిపల్లె ఎస్సీకాలనీకి చెందిన పి.వెంకటరమణ(48), పి.శ్యామల(40) దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు పి.నందకుమార్(8) ఉన్నాడు. వ్యవసాయ కూలీలైన వీరు గుడిపల్లెలో 10 కుంటల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగుచేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ కొడుకును చదివించుకోవాలని వెంకటరమణ ఆశపడ్డాడు. 14 రోజుల క్రితం భార్య, కొడుకును తీసుకుని బెంగళూరు వెళ్లాడు. నగరంలోని కాటం నెల్లూరు గేట్ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. నందకుమార్ను కేఆర్పురలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించాడు. మంగళవారం రాత్రి వెంకటరమణ, శ్యామల కుమారుడు నందకుమార్తో కలిసి బియ్యం కొనుగోలు చేసేందుకు బజారుకు వెళ్లారు. బియ్యం, సరుకులు తీసుకుని తిరిగి బయలుదేరారు. సప్తగిరి కల్యాణ మండపం ఎదురుగా రోడ్డును దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ముగ్గురినీ ఢీకొంది. వెంకటరమణ త్రుటిలో తప్పించుకుని కిందపడిపోయాడు. శ్యామల, నందకుమార్పై కారు దూసుకె ళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వెంకటరమణను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బుధవారం సాయంత్రం శ్యామల, నందకుమార్ మృతదేహాలను బెంగళూరు నుంచి స్వగ్రామం గుడిపల్లెకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో విషాదం ప్రమాదంలో మరణించిన భార్య, కుమారుడిని కడసారి చూపునకు నోచుకొని దయనీయ పరిస్థితి వెంకటరమణది. బిడ్డ చదువుకోసం వెళితే దేవుడు ఇలా చేశాడా అంటూ పలువురు రోదించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ట్రాక్టర్ బోల్తా...ఇద్దరు మృత్యువాత
వైఎస్సార్ జిల్లా సంబేపల్లి మండలం మోతుకువాండ్లపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు చనిపోయారు. మోతుకువాండ్లపల్లికి చెందిన నర్సింహారెడ్డి, డ్రైవర్ గుత్తి వెంకటరమణ కలసి ట్రాక్టర్లో కలకడ నుంచి మోతుకువాండ్లపల్లి వైపు వెళ్తున్నారు. సమీపంలోని హంద్రీనీవా కాల్వ వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద ఆ ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో నర్సింహారెడ్డి(55), వెంకటరమణ(25) అక్కడికక్కడే చనిపోయారు. -
నాయనా..నేనూ వస్తున్నా..
తనయుడి మృతితో తల్లడిల్లిన తండ్రి విగతజీవిగా బిడ్డను చూసి ఆగిన గుండె తండ్రీకొడుకుల శవయాత్రతో ఘొల్లుమన్న బీరంగి కన్నకొడుకు మరణవార్త అందుకున్న తండ్రి ఇంటిముందు షామియానా వేయించాడు. సమాధి గుంత తవ్వించాడు. అంత్యక్రియలకు వచ్చే బంధువుల కోసం భోజనాలు సిద్ధం చేయించాడు. కొడుకు మృతదేహం ఇంటికి రాగానే ‘ఏమిరా నాయనా.. నాకు మట్టిపోయాల్సిన నీవే వెళ్లిపోయావా.. అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అంతే కొడుకు శవం పక్కనే తానూ శవంగా మారాడు. గంటల వ్యవధిలోనే తండ్రీకొడుకులు మృతి చెందడంతో బి.కొత్తకోట మండలం బీరంగి విషాదంలో మునిగిపోయింది. బి.కొత్తకోట: బీరంగికి చెందిన సీహెచ్ చిన్న వెంకటరమణ(65)కు ఇద్దరు భార్యలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. మొదటి భార్య రెండో కుమారుడు చాకల జయచంద్ర(35)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతడు ఏడాదిగా బెంగళూరులో కులవృత్తి చేసుకునేవాడు. గత నెలలో బీరంగికి తిరిగి వచ్చేశాడు. కడుపు నొప్పి రావడంతో వారం క్రితం బెంగళూరులో వైద్యం చేయించుకున్నాడు. శనివారం మళ్లీ నొప్పి రావడంతో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు తిరుపతి రుయాకు తరలించారు. చికిత్సపొందుతూ జయచంద్ర సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు మృతిచెందాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు జయచంద్ర తండ్రి చిన్న వెంకటరమణకు ఫోన్ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో షాకయ్యాడు. కుమారుడు లేడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కాస్సేపటికి తేరుకుని అంత్యక్రియలకు ఏర్పాటుచేశాడు. ఇంటిముందు షామియానాలు వేయించాడు. సమాధి గుంతను తవ్వించాడు. దూరప్రాంతం నుంచి వచ్చే బంధువులకు భోజన ఏర్పాట్లు కూడా చేయించాడు. ఉదయం 9 గంటలకు జయచంద్ర మృతదేహం ఇంటి వద్దకు తీసుకువచ్చారు. విగత జీవుడుగా కుమారుడు కనిపించగానే వెంకటరమణ దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. ‘ఏమిరా నాయనా.. నాకు మట్టిపోయాల్సిన నీవు నా కళ్లముందరే వె ళ్లిపోయావా...’ అంటూ ఒక్కసారిగా మృతదేహం వద్దే కుప్పకూలిపోయాడు. సోమ్ముసిల్లి పడిపోయి ఉంటాడని భావించిన స్థానికులు, కుటుంబ సభ్యులు సపర్యలు చేశారు. ఎంతకూ లేవకపోవడంతో శంకరాపురంలోని వైద్యుడిని పిలిపించారు. ఆయన పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఈ సంఘటనతో బీరంగిలో విషాదం అలుముకొంది. త ండ్రీకొడుకుల మృతదేహాలను రెండు పాడెలపై తీసుకెళ్తుండగా గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. ఇద్దరికీ ఒకేచోట అంత్యక్రియలు నిర్వహించారు. -
మనసు దోచుకున్నాడు..
పోలీసులకు టీ అందిస్తున్న వ్యక్తి పేరు శీలంశెట్టి వెంకటరమణ. వృత్తి దొంగతనం. 200లకు పైగా దొంగతనాలతోపోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన చరిత్ర అతనిది. ఎన్నిసార్లు జైలుకు వెళ్లొచ్చినా మార్పు రాలేదు. మళ్లీ ధ్యాసంతా దొంగతనాల పైనే. 2002లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసినా అతనిలో చలనం కలగలేదు. ఆఖరికి తనపై ఉన్న కేసులకు విసుగెత్తి స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు. అతనిలో మార్పు వస్తుందనే నమ్మకంతో ఎలాగైనా మార్చాలని సంకల్పించిన పోలీసులు.. ఎట్టకేలకు విజయం సాధించారు. ఆరు నెలల పాటు వెంకటరమణకు, అతని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి మంచి మనిషిగా మార్చారు. కృష్ణా జిల్లా రాజరాజేశ్వరీపేట ఇతని స్వస్థలం. పదేళ్ల వయసు నుంచే చెడు సావాసాలతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇళ్ల లో దొంగతనాలు చేస్తూ జీవనం సాగించేవాడు. తాను చేస్తున్న పనికి ముఖం చూపించుకోలేక భార్యాపిల్లలకు, బంధువులకు దూరంగా బతికేవాడు. పేదరికం, చిన్నతనంలో తెలియనితనంతో దొంగగా మారానని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే భార్యాపిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని పూర్తిగా మారిపోయానని కన్నీటి పర్యంతమయ్యాడు వెంకటరమణ. అతడు నలుగురిలో తలెత్తుకుని జీవించేందుకు నగర క్రైం డీసీపీ నవీన్కుమార్ సహకారంతో హైదరాబాద్లోని ఉప్పల్ పోలీసులు.. దాదాపు 40 వేలతో ఓ టీస్టాల్ ఏర్పాటు చేయించారు. ఈ టీస్టాల్ను అదనపు డీసీపీ శ్రీనివాస్, క్రైం ఏసీపీ సాయి మనోహర్, మల్కాజిగిరి ఏసీపీ రవిచందన్రెడ్డితో కలసి బుధవారం ప్రారంభించారు. ప్రతి నేరస్తుడు తన నేరప్రవృత్తిని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొస్తే తమ వంతు సాయమందిస్తామని ఏసీపీ రవి చందన్రెడ్డి పేర్కొన్నారు. వారికి వివిధ రంగాల్లో శిక్షణనిచ్చి గౌరవంగా బతికేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. - హైదరాబాద్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement