breaking news
venkatasubba Reddy
-
బండమీదికొత్తపల్లె వద్ద వ్యక్తి దారుణ హత్య
వేంపల్లి మండలం టి.వెలంవారిపల్లె గ్రామానికి చెందిన శనివారపు వెంకటసుబ్బారెడ్డి(40) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అనంతపురం జిల్లా తలుపుల మండలం బండకొత్తమీదిపల్లె సమీపంలో వేటకొడవళ్లతో నరికి చంపారు. అనంతరం చెట్లపొదల్లో పడేసి పరారయ్యారు. టి.వెలంవారిపల్లి గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి అనే వ్యక్తి హత్య కేసులో ఈయన ప్రధాన నిందితుడు. రామచంద్రారెడ్డి బంధువులే వెంకటసుబ్బారెడ్డిని హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై వేంపల్లె, తలుపుల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మరోసారి తెగబడ్డారు
ముదివర్తి (విడవలూరు), న్యూస్లైన్: మండలంలోని ముదివర్తికి చెందిన వైఎస్సార్సీపీ నేత కొండూరు వెంకటసుబ్బారెడ్డిపై మరోసారి సోమవారం ఉదయం హత్యాయత్నం జరిగింది. సినీ ఫక్కీలో మహిళా డీలర్ ఈ హత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు, పోలీస్ల కథనం మేరకు.. వెంకటసుబ్బారెడ్డి రోజూలాగానే సోమవారం ఉదయం 5 గంటలక నిద్రలేచి వరండాలో దినపత్రికలను చదువుతున్నారు. 6 గంటల సమయంలో అదే గ్రామంలోని గాంధీ గిరిజన కాలనీకి చెందిన చౌకడిపో డీలర్ గొర్రె సుజన తన ముఖానికి మంకీ క్యాప్ ధరించి చేతిలో గిఫ్ట్ బాక్స్ను తీసుకుని ఆ బాక్స్ కింద కత్తితో ఇంటిలోకి వచ్చింది. పని మనిషి చలికి మంకీ క్యాప్ వేసుకుని వచ్చి ఉంటుందని భావించి ఆయన దినపత్రికలు చదువుతున్నాడు. అయితే సుజన వెంకటసుబ్బారెడ్డి కూర్చున్న కుర్చీ వెనుక వైపు వెళ్లి అతని మెడపై కత్తిలో గాయపరించింది. దీంతో ఆయన అప్రమత్తమై వెనుకకు తిరిగి ఆమెను పట్టుకునే లోపలే మరోసారి అతని తల భాగంపై నరికింది. దీంతో ఆయన కుర్చీలో నుంచి కింద పడిపోయాడు. మరో మారు అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా అతను తేరుకుని లేచి ఆమె చేతిలోని కత్తిని పట్టుకుని, ఎవరు నీవంటూ మాస్క్ తొలగించి చూసే సరికి ఆమె చౌకడిపో డీలర్ గొర్రె సుజనగా గుర్తించి అవాక్కయ్యాడు. వెంకట సుబ్బారెడ్డిపై జరిగిన హత్యాయత్యాన్ని గుర్తించిన భార్య కొండూరు సునీతమ్మ (ముదివర్తి సర్పంచ్) బయటకు పరుగులు తీసి పెద్దగా కేకలు వేసింది. దీంతో నిందితురాలు సుజన కత్తిని అక్కడే వదలి వేసి పారిపోయే ప్రయత్నం చేసింది. ఇంతలో చుట్టు పక్కల వాళ్లు అక్కడకు చేరుకుని ఆమెను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ విషయమై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడిన వెంకటసుబ్బారెడ్డిని నెల్లూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న విడవలూరు ఎస్ఐ అమీర్జాన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడ లభించిన మాస్క్, గిప్ట్బాక్స్, కత్తిని స్వాధీనం చేసుకుని, నిందితురాలు సుజనను అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరులోని జయభారతి వైద్యశాలలో చికిత్స పొందుతున్న కొండూరు వెంకటసుబ్బారెడ్డినినెల్లూరు రూరల్ డీఎస్పీ వీఎస్ రాంబాబు, కోవూరు సీఐ మాణిక్యరావు పరామర్శించి విచారించారు. 45 రోజుల్లో రెండోసారి 45 రోజుల వ్యవధిలో కొండూరు వెంకటసుబ్బారెడ్డిపై హత్యాయత్నం జరగడం ఇది రెండో సారి కావడం గమనార్హం. అక్టోబర్ 22వ తేదీన ముదివర్తిలోని ఆయన నివాసంలో కరెంట్ తీగలతో హతమార్చేందుకు ప్రయత్నిం చగా అది విఫలమైంది. మళ్లీ సోమవారం కత్తితో అతనిపై హత్యాయత్నం జరగడంతో ముదివర్తి ఉలిక్కి పడింది. గతంలో జరిగిన హత్యాయత్నం సమయంలో పోలీస్లు సరైన రీతిలో స్పందించి ఉంటే మరోమారు ఇలా జరిగేది కాదని స్థానికులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్డులు రద్దు చేయించారన్న అనుమానంతో.. ముదివర్తిలో 23వ నంబర్పై రేషన్ దుకాణాన్ని గొర్రె సుజన నిర్వహిస్తోంది. తన దుకాణంలో 300కు పైగా బోగస్ కార్డులు ఉన్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న తహశీల్దార్ రమణయ్య బోగస్ కార్డులను రద్దు చేశారు. అయితే ఈ పనిని కొండూరు వెంకటసుబ్బారెడ్డి చేయించారన్న అనుమానంతో అతన్ని హతమార్చేందుకు వారం రోజులుగా పక్కా ప్రణాళికతో పధకం పన్నినట్లుప్రాథమిక విచారణలో తెలింది. అయితే వెంకటసుబ్బారెడ్డిని హత మార్చమని ఆమెను ఎవరైనా పురమాయించారన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. -
చేనేత వస్త్రాలను ఆదరించండి
తిరుపతి కల్చరల్, న్యూస్లైన్ : చేనేత కార్మికులు తయారు చేసే వస్త్రాలను ఆదరించి తద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి పిలుపు నిచ్చారు. ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో ని త్యాగరాజమండపంలో ఏర్పాటు చేసిన ‘చేనేత తోరణాల వస్త్ర ప్రదర్శన’ను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా చేనేత వస్త్ర తయారీ కేవలం భారతదేశంలోనే ఉందన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మారుతున్న కాలాని కి అనుగుణంగా చేనేత వస్త్రాలను త యారు చేసి ప్రజలకు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ పరంగా అనేక పథకాలు అందిస్తున్నా వీరికి మరింత ప్రోత్సాహక పథకాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజ లందరూ చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి కార్మికులను ప్రోత్సహించాలని కోరారు. చేనేత జౌళి శాఖ సంచాల కుడు పి.జయరామయ్య మాట్లాడు తూ కార్మికులు తయారు చేసిన వ స్త్రాలను సొసైటీల ద్వారా ప్రదర్శన లు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగి స్తున్నామన్నారు. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న సమైక్యాంధ్ర ఉద్య మ నేపథ్యంలో వస్త్ర ప్రదర్శనలకు విరామం వచ్చిందన్నారు. నూతన సంవత్సరం, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని 23 జిల్లాలకు చెందిన చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను ప్రదర్శన లో ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్ర దర్శన 11వ తేదీ వరకు రోజూ ఉ దయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందన్నారు. ఇందులో అన్ని రకాల చేనేత వస్త్రాలు సరసమైన ధరలకు లభిస్తాయన్నారు. అప్కో డెరైక్టర్ మిద్దెలహరి, చేనేత కార్మిక యూనియన్ జిల్లా అధ్యక్షుడు కుప్పయ్య పాల్గొన్నారు. ఏజేసీకి వినతి చేనేత తోరణాల వస్త్ర ప్రదర్శన ప్రారంభానికి విచ్చేసిన జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డికి చేనేత కార్మికుల సమస్య లు పరిష్కరించాలని కోరుతూ చేనే త కార్మిక యూనియన్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 45 వేల కుటుంబాలు చేనేత వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నాయ ని తెలిపారు. కార్మికులకు ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు కల్పించి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశా రు. వినతి పత్రం సమర్పించిన వారి లో కేవీ.కుప్పయ్యశెట్టి, ఆకులవాసు ఉన్నారు.