breaking news
vastu dosha
-
‘అసెంబ్లీకి వాస్తు దోషం ఉంది’
భోపాల్ : వాస్తు, గ్రహదోషాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ రాజకీయ నాయకులు మాత్రం వాటిని విపరీతంగా విశ్వసిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా ఇటువంటి వారు అధికంగానే ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. మధ్యప్రదేశ్ శాసనసభకు వాస్తు దోషం ఉందని.. అందువల్లే ప్రజాప్రతినిధులు అర్థాంతరంగా మరణిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కేపీ సింగ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తక్షణమే శాసనసభ భవానికి వాస్తు శాంతి చేయించాలని ఆయన పేర్కొన్నారు. 2013 నుంచి ఇప్పటివరకూ 9 మంది ఎమ్మెల్యేలు హఠాత్తుగా మృతి చెందారని కేపీ సింగ్ చెప్పారు. ప్రస్తుత సభకు ఇంకా ఏడాది కాలపరిమితి ఉన్న నేపథ్యంలో.. ప్రకృతి మరిన్ని ప్రాణాలను కోరుతున్నట్లు కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సభకు రావాలంటేనే భయమేస్తోందని అన్నారు. ప్రస్తుత విధాన సభకు శాస్త్రప్రకారం వాస్తు పూజ చేసి, ఇతర దోష నివారణ చర్యలు చేపట్టాలని కేపీసింగ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. ఇదిలా ఉండగా.. 1993 నుంచి మధ్యప్రదేశ్ శాసనసభకు వాస్తు దోషం ఉందనే వాదనలు బలంగా విపిస్తున్నాయి. -
కొత్త సచివాలయానికి ఈశాన్య గండం?
సాక్షి, హైదరాబాద్: వాస్తుదోషం పేరిట ఇప్పడున్న తెలంగాణ సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చినా అవే తిప్పలు తప్పవా?..కొత్త సచివాలయం నిర్మించ తలపెట్టిన ఛాతీ ఆస్పత్రి స్థలానికి ఈశాన్యంలో వాస్తు దోషం ఉందా?..ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఆ స్థలాన్ని పరిశీలిస్తున్న వాస్తు నిపుణులు ఇదే చెబుతున్నారు. ప్రస్తుత సచివాలయానికి వాస్తుదోషం ఉందని.. సచివాలయాన్ని ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రి స్థలంలోకి మార్చుతామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి తగ్గట్టే ఛాతీ ఆస్పత్రి స్థలంలో వాస్తుదోషాలను తేల్చేందుకు వాస్తు నిపుణులు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రికి వాస్తు సలహాదారుగా వ్యవహరిస్తున్న ఓ నిపుణుడితోపాటు మరికొందరు రెండు రోజులుగా ఆ స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఆ స్థలంలో ఈశాన్యం వైపు ఓ అక్రమ నిర్మాణంతో ఏర్పడ్డ కోత వల్ల వాస్తుపరమైన సమస్యలేర్పడినట్టు వారు గుర్తించారు. దానికి విరుగుడుగా ఆ భాగాన్ని ప్రతిపాదిత స్థలం నుంచి వేరు చేసేలా గోడ నిర్మిస్తే సరిపోతుం దని భావిస్తున్నట్లు సమాచారం. లోపాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి సరిచేసే పనులు ప్రారంభించనున్నారు. ఇక ప్రతిపాదిత స్థలంలో ఏ వైపు ఏముండాలన్నది వారు గుర్తిస్తున్నారు. వాస్తు నిపుణుడి ఎంపికలో సమస్యలు ముఖ్యమంత్రికి వాస్తు సూచనలిస్తున్న వ్యక్తికి రోడ్లు భవనాల శాఖలో వాస్తు కన్సల్టెంట్గా పోస్టింగ్ ఇవ్వాలని తొలుత భావించారు. అయితే సాంకేతికంగా ఆ పోస్టు ఏర్పాటు సాధ్యం కాకపోవటంతో బిల్డింగ్ కన్సల్టెంట్గా నియమించాలని నిర్ణయించారు. సంబంధిత ఫైలును రోడ్లు భవనాల శాఖ అధికారులు ఆర్థిక శాఖకు పంపారు. కానీ బిల్డింగ్ కన్సల్టెంట్కు సివిల్ ఇంజనీరింగ్ అర్హత ఉండాలి. సదరు నిపుణుడికి విద్యార్హత లేకపోవటంతో ఆర్థిక శాఖ ఫైలును తిప్పి పంపినట్టు తెలిసింది. సివిల్ ఇంజనీరింగ్ విద్యార్హత లేదని, ఆయనకు ఎంఏ పట్టా మాత్రమే ఉందని పేర్కొం టూ రోడ్లు భవనాల శాఖ అధికారులు మళ్లీ ఫైల్ను ఆర్థిక శాఖకు పంపారు. వెరసి సదరు నిపుణుడికి సాంకేతిక కారణాలతో పోస్టు ఇచ్చే అవకాశం కనిపించటం లేదు. -
వాస్తు లొల్లి @ తెలంగాణ స్టేట్
-
వాస్తు.. వివాదమస్తు
సచివాలయం తరలింపుపై విపక్షాల మండిపాటు గతంలోనూ తరలింపునకు పలువురి యత్నాలు వెనక్కి తగ్గిన అప్పటి ముఖ్యమంత్రులు ఆనవాయితీగా సాగిన వాస్తు మార్పులు గేట్లు.. చాంబర్ల మార్పులతో సర్దుబాటు దోషమున్నా.. ప్రత్యామ్నాయాలున్నాయి: వాస్తు నిపుణులు సాక్షి, హైదరాబాద్: న్యూయార్క్.. లండన్.. సింగపూర్ తరహాలో స్మార్ట్ సిటీలు... ఆకాశ హర్మ్యాలు.. స్కైవేలు... ఫై్ల ఓవర్లు... అన్నింటా అధునాతనం.. అంతర్జాతీయ స్థాయిని తలపించే బృహత్తర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం.. వాస్తు దోషం ఉందంటూ సచివాలయాన్ని తరలిస్తుందా..? ఏకంగా రూ.150 కోట్ల ఖర్చుతో కొత్త సచివాలయం నిర్మిస్తుందా...? రాష్ట్రంలో అందరి నోటా ఇదే హాట్ టాపిక్. ‘సచివాలయానికి భయంకరమైన వాస్తు దోషం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్లేవరూ ముందర పల్లేదు..’ అని స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుక్రవారం నాటి కేబినేట్ భేటీ అనంతరం ప్రకటించారు. అది మొదలు సచివాలయంలో అధికారులు, ఉద్యోగులందరిలోనూ ఇదే అంశంపై చర్చోపచర్చలు ఆసక్తికరంగా మారాయి. వాస్తు దోషముంటే నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలుంటాయని అదే శాస్త్రం చెబుతోందని వాస్తు నిపుణులు అంటున్నారు. దీంతో ఇప్పుడున్న స్థలంలోనే మార్పులు చేర్పులు చేసుకునే ప్రత్యామ్నాయాలు ఆలోచించకుండా ఏకంగా సెక్రెటేరియట్ తరలింపు నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారుతోంది. ‘సీఎం హోదాలోని వ్యక్తి వాస్తు గురించి మాట్లాడటం.. ప్రజల్లో మూఢ నమ్మకాలను ప్రచారం చేసినట్లయింది. ముఖ్యమంత్రికి వాస్తు పిచ్చి పట్టుకుంది..’ అని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలు సీఎం తీసుకున్న నిర్ణయంపై విరుచుకుపడ్డారు. దీని వెనుక మరేదైనా ఆంతర్యముందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘భారత ప్రజల జీవన విధానంలో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యముంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తు సిద్ధాంతాన్ని నమ్మడం ఆహ్వానించదగ్గ పరిణామం. సచివాలయానికి వాస్తుదోషం ఉన్న మాట వాస్తవమే. కొన్ని అనుకూలమైన అంశాలు కూడా ఉన్నాయి. రాజ ప్రసాదాలు, రాజ భవనాలకు నలు దిక్కులా రోడ్డు ఉండాలనే నియమం కూడా ఉంది. తూర్పున హుస్సేన్ సాగర్ ఉండటంతో పాటు తూర్పు, ఉత్తరాన గేట్లు ఉండటం కూడా మంచిదే. పశ్చిమ నైరుతి భాగం పెరగటం, నైరుతి దిశలో వీధిపోటు, హోంసైన్స్ కాలేజీ, ఆర్బీఐ నుంచి వచ్చే రోడ్ల కారణంగా భయంకరమైన దోషాలే ఉన్నాయి. దీంతో పాలకులకు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కానీ వీటికీ పరిష్కార మార్గాలున్నాయి. నైరుతి దిశలో ఎతై్తన గోడ కట్టి ఈ స్థలాన్ని వేరు చేసే వీలుంది. అటువైపున ఉన్న భవనాన్ని వాడకుండా ఉన్నా దోష నివారణ జరుగుతుంది’ అని వాస్తు నిపుణులు రాచ సురేశ్ అభిప్రాయపడ్డారు. వాస్తుకు సంబంధించిన నమ్మకం పాలకులకు ఉండడం కొత్తేమీ కాదని, సచివాలయం తరలింపునకు గతంలోనూ పలువురు ముఖ్యమంత్రులు ప్రయత్నించారని ఒక రిటైర్డ్ అధికారి తెలిపారు. ‘గతంలో సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నాంపల్లిలో ఇప్పుడున్న గృహకల్ప స్థలానికి సచివాలయాన్ని మార్చాలని యోచించారు. తీరా ఆ ప్రాంతాన్ని చదునుచేశాక విరమించుకున్నారు. అంజయ్య సీఎంగా ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ ప్రాంతానికి తరలించాలన్న ప్రతిపాదనపై కసరత్తు జరిగింది. విజయభాస్కరరెడ్డి హయాంలో ఇప్పుడు అనుకుంటున్న చెస్ట్ ఆసుపత్రికి తరలించాలనే ప్రయత్నం జరిగింది. కానీ.. చారిత్రక కట్టడాలు ఉన్నాయనే కారణంగా ఉపసంహరించుకున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అమలవుతుందా..? లేదా..? అనేది వేచి చూడాల్సిందే అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రులకు వాస్తుపై ఉన్న నమ్మకం, పండితులు చెప్పిన శాస్త్రం ఆచరించి, గేట్లు, తమ ఛాంబర్లను మార్చుకోవటం ఆనవాయితీగానే కొనసాగింది. అందులో భాగంగా ఇప్పటివరకు సచివాలయానికి మూడు వైపులా గేట్లను మార్చారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండుసార్లు గేట్లు మార్చారు. అయినా నాదెండ్ల, చంద్రబాబుల వెన్నుపోట్లు ఆయనను వెంటాడాయి. కానీ ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు సీఎంగా ఇదే సచివాలయ కేంద్రంగా సుదీర్ఘంగా తొమ్మిదేళ్లు పాలించారు. రాష్ట్ర విభజనకు ముందు తూర్పున ఉన్న గేటును వాస్తు నమ్మకంతోతెలంగాణ ప్రభుత్వం ఉత్తర దిశలో నిర్మించింది. కనీసం ఈ గేట్ల నిర్మాణం కూడా పూర్తి కాకుండానే సచివాలయాన్ని మార్చాలని ఆకస్మిక నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత వాహనాల రంగు, కేబినెట్లో సంఖ్యాబలం, వివిధ పథకాల ముహూర్తాలు ఇలా అన్నింటా ఆయన తనకంటూ సలహాలిచ్చే పండితుల నిర్ణయాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారనే వాదనలున్నాయి. సచివాలయం తరలింపు నిర్ణయం అందులో భాగమేనని, త్వరలోనే వాస్తు నిపుణుడు ఒకరిని ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తారనే ప్రచారం కూడా జోరందుకుంది.