breaking news
Varuna Yagam
-
టీటీడీకి చంద్రగ్రహణం పట్టింది
-
వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు నిండాలి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువుల మధ్య శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో సంపూర్ణమైంది. నాగార్జునసాగర్లోని విజయవిహార్ అతిథి గృహం వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన ఈ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు పాల్గొని రుత్వికుల మార్గదర్శకత్వంలో క్రతువులు నిర్వహించారు. కృష్ణమ్మకు సీఎం పూర్ణాహుతి సమర్పించారు. ‘రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి. కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలి. ప్రాజెక్టులు, చెరువులు నిండాలి..’అని ప్రార్థించారు. బ్రహ్మ ముహూర్తంలో.. సోమవారం ఉదయం 4 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో యాగాన్ని ప్రారంభించారు. ప్రారంభ క్రతువులో నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, ఆయన సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో 11 హోమ గుండాలతో వరుణ దేవుని అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ వైదిక విధానంలో హోమ క్రతువులు నిర్వహించారు. మధ్యాహ్నం 3.15 గంటలకు యాగశాలలోకి వచ్చిన సీఎం దంపతులు..3:24 గంటలకు పూర్ణాహుతి సమర్పించారు. ‘కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు సమృద్ధిగా పడాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులతో పాటు అన్ని ప్రాజెక్టులు నిండాలి. రాష్ట్రంలోని ప్రతి చెరువు, ప్రతి కుంట జలకళను సంతరించుకోవాలి. భూగర్భ జలాలు పెరగాలి. పంటలు పుష్కలంగా పండాలి. రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాలి. రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలి. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలి..’అని ముఖ్యమంత్రి వరుణ దేవుడిని ప్రార్థించారు. భారతీయ సంస్కృతిలో వర్షాలు కురవాలని యాగాలు, యజ్ఞాలు, పూజలు నిర్వహించడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక సంప్రదాయం. కాగా వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్నినో కారణంగా రాష్ట్రంలో ఈసారి వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ మహా వరుణయాగాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, పి.సుదర్శన్రెడ్డి, మాజీ మంత్రి కె.జానారెడ్డి, ఎమ్మెల్యేలు కుందూరు జయవీర్రెడ్డి, నేనావత్ బాలునాయక్, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్కుమార్రెడ్డి, మందుల సామేలు, ఎమ్మెల్సీ శంకర్నాయక్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కృష్ణమ్మ ఒడ్డున మార్మోగిన వేదఘోష సూర్యకిరణాలు ఇంకా కృష్ణమ్మ జలాలను తాకకముందే.. నాగార్జునసాగర్ పరిసరాల్లో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సోమవారం తెల్లవారుజాము నుంచే వేద మంత్రాలు మార్మోగాయి. చతుర్వేద పారాయణంతో యాగ క్రతువు ప్రారంభమైంది. ప్రధాన యాగ క్రతువుల కోసం 32 మంది రుత్వికులు యాగశాలలో నిర్దేశించిన స్థానాల్లో ఆశీనులు కాగా, మిగిలిన రుత్వికులు నిరంతర వేద పారాయణం, జపంలో పాల్గొన్నారు. చతుర్వేద పారాయణం అనంతరం అగ్ని ప్రతిష్ఠాపన నిర్వహించారు. హోమకుండాల్లో పవిత్ర అగ్నిని ప్రజ్వలింపజేసి, వరుణ దేవుడిని ఆవాహన చేస్తూ హోమాలు నిర్వహించారు. ఆకాశం–జలం–భూమి–మానవాళి మధ్య సమతుల్యత నెలకొనాలని ఆకాంక్షిస్తూ వేద మంత్రాల నడుమ హోమ ద్రవ్యాలను అగ్నికి సమర్పించారు. ఒకవైపు కృష్ణమ్మ విశాల జలరాశి, మరోవైపు హోమకుండాల్లో ఎగసిపడుతున్న అగ్నిజ్వాలలు, వాటి మధ్య ప్రతిధ్వనించిన వేదఘోషతో సాగర్ తీరం భక్తిభావంతో నిండిపోయింది. వరుణారాధనతో విజయపురికి ప్రాచీన అనుబంధం మహా వరుణ యాగం నిర్వహిస్తున్న ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యం కూడా ఉందని యాగ నిర్వాహకులు పేర్కొన్నారు. నేటి నాగార్జునసాగర్ ప్రాంతం ఒకనాటి విజయపురిగా ప్రసిద్ధి చెందిందని, ఈ ప్రాంతంలో ప్రాచీన కాలంలోనే వరుణారాధన జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని వేద పండితులు వివరించారు. వరుణుడితో సంబంధం ఉన్న ఒక ప్రాచీన ప్రతిమ ప్రస్తుతం నల్లగొండ మ్యూజియంలో భద్రపరచబడి ఉందని వారు పేర్కొన్నారు. ఈ చారిత్రక నేపథ్యం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న మహా వరుణ యాగానికి మరింత ఆధ్యాత్మిక విశిష్టత చేకూరిందని తెలిపారు. శతాబ్దాల కిందట జలాల కోసం ఇదే నేలపై వినిపించిన వరుణ ప్రార్థన, ఇప్పుడు మరోసారి కృష్ణమ్మ ఒడ్డున వేదఘోషగా ప్రతిధ్వనిస్తోందన్న భావన యాగానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన వేద పండితులు, అర్చకులు యాగ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. ప్రధాన అర్చకులు ఆచార్య వెంకటాచార్యులు, నరేష్ శర్మ, వెంకట రామశర్మ, ఆదిత్య శర్మతో పాటు పలువురు వేదపండితులు యాగ క్రతువులను నిర్వహించారు. రోజంతా వరుణ యాగం కొనగసాగగా, మధ్యాహ్నం 3.24 గంటలకు మహా పూర్ణాహుతితో ముగిసింది. -
మహా వరుణయాగం అంటే...
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న మహావరుణ యాగంపై రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాలతోపాటు రైతుల్లోనూ ఆసక్తి ఏర్పడింది. సకాలంలో వర్షాలు కురిసి, పంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. సనాతన హిందూ ధర్మంలో యజ్ఞయాగాదులకు అత్యున్నత స్థానం ఉండగా, వేదకాలం నుంచి వరుణ దేవుడి ఆరాధన ఉంది. ఋగ్వేదం ప్రకారం వరుణుడు కేవలం వర్షానికే కాకుండా రుతం (విశ్వ నియమం), సృష్టి సమతుల్యతను కాపాడే సర్వోన్నత చక్రవర్తిగా వర్ణించారు.యాగంలో భాగంగా 108 మంది రుత్వికులు ఏకధాటిగా చేసే వేదమంత్రాల ఉచ్ఛారణ ఒక గొప్ప తపస్సే. వర్ష పాశుపత మంత్రాలు, ’కరీరీ ఇష్టి’వంటి శక్తివంతమైన వైదిక సూక్తాలను జపించడం ద్వారా వాతావరణంలో సానుకూల మార్పులు వస్తాయని నమ్ముతారు. మన ఇతిహాసాల ప్రకారం కరువు వచి్చనప్పుడల్లా రాజులు, మహర్షులు వరుణ యాగాలు చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. కృత్రిమ వర్షాల కోసం చేసే ‘క్లౌడ్ సీడింగ్’(కెమికల్స్ చల్లడం) ప్రక్రియకు, మన వేదాల్లోని ’కరీరీ ఇష్టి’విధానానికి దగ్గరి పోలికలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం మేరకు..కరీరీ ఇష్టి అంటే వర్షాన్ని రప్పించే అద్భుత క్రతువు. కృష్ణ యజుర్వేదంలోని మైత్రాయణీ సంహిత ఆధారంగా తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నప్పుడు వర్షాల కోసం చేసే అత్యంత శక్తివంతమైన వైదిక యాగమే ఈ ’కరీరీ ఇష్టి’.కృష్ణ వర్ణ సిద్ధాంతం: ఈ క్రతువులో ఉపయోగించే ప్రతి వస్తువు నలుపు రంగులో (కృష్ణ వర్ణం) ఉంటుంది.. ఋత్వికులు ధరించే వస్త్రాలు, హోమ ద్రవ్యాలు, చివరికి అగ్నికి సమర్పించే వెదురు, బియ్యంతో చేసిన అన్నం కూడా నల్లగా ఉంటాయి. నల్లటి మేఘాలను ఆకర్షించడానికి ఇవి దోహద పడతాయని భావిస్తారు.కరీర ఫల ఆహుతి: ’కరీర’అనే ఒక ప్రత్యేకమైన అడవి పొద పండ్లను ఎండబెట్టి, వాటిని హోమ గుండంలో ప్రత్యేక మంత్రాలతో ఆహుతి ఇస్తారు. దీని వల్ల వాతావరణంలో తక్కువ పీడనం ఏర్పడి, మేఘాలు త్వరగా వర్షిస్తాయని నమ్ముతారు.వర్ష పాశుపత హోమం శివుని అత్యంత ఉగ్ర రూపమైన ’పాశుపత’తత్వాన్ని ప్రకృతి అనుకూలతకు మళ్లించే ప్రక్రియే ఈ హోమం. జల స్వరూప శివారాధన ద్వారా అభిషేక ప్రియుడు. లయకారుడైన పరమశివుడిని శాంతింపజేసి, ప్రకృతిలో సమతుల్యతను తీసుకురావడానికి రుత్వికులు ’పాశుపతాస్త్ర మంత్రాలు’జపిస్తూ ఈ హోమం చేస్తారు. పర్జన్య శాంతివేదాల ప్రకారం వర్షాన్నిచ్చే మేఘ రూప దేవతను ’పర్జన్యుడు’అంటారు. ’పర్జన్య సూక్తం’పఠిస్తూ హోమం చేయడం ద్వారా ఆకాశంలో మేఘ గర్జనలు మొదలై, పిడుగుల వంటి నష్టం కలగకుండా శాంతమైన, మేలు చేసే వర్షాలు కురుస్తాయి. ఈ రెండు విశిష్ట ప్రక్రియల ద్వారా గాలిలోని తేమ శాతం పెరిగి, స్థానిక వాతావరణం చల్లబడి, ఆ పరిసర ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆశిస్తారు.ఉపయోగించే మూలికలువరుణ వృక్ష మూలిక: ఇదే ఈ యాగంలో ప్రధాన ద్రవ్యం. వరుణ బెరడును ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో దీనిని మూత్ర, కిడ్నీ సంబంధ వ్యాధుల నివారణిగా వాడుతారు. యాగంలో ఈ వృక్షం ఎండిన కొమ్మలు, బెరడును హోమ ద్రవ్యంగా సమర్పిస్తారు. కృష్ణ తిలాలు: ఈ యాగంలో నలుపు రంగు ద్రవ్యాలకు ప్రాధాన్యం. నల్ల నువ్వులతో హోమం చేయడం ద్వారా వాతావరణంలో దట్టమైన సానుకూల ధూమం (పొగ) ఏర్పడి మేఘాలను ఆకర్షించడానికి తోడ్పడుతుందని నమ్ముతారు. సుగంధి వేళ్లు (వట్టివేరు): వాతావరణాన్ని చల్లబరచడానికి, వర్షపు మేఘాలకు అవసరమైన తేమను ప్రసాదించడానికి వట్టివేరును ఆహుతిగా ఇస్తారు. యాగ సమిధిలు: యాగశాలలో 11 హోమకుండాల్లోప్రత్యేకమైన నవగ్రహ, యాగ సమిధలను ఉపయోగిస్తారు. అందులో మర్రి, జువ్వి, రావి, మేడి, ఉత్తరేణి, జమ్మి తదితర పంచక్షీర వృక్షాలు, నవధాన్యాలు, ఆవు నెయ్యి ఉపయోగిస్తారు. -
సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణ యాగం: టీటీడీ ఛైర్మన్
సాక్షి, తిరుపతి జిల్లా: సమృద్ధిగా వర్షాలు కురవడానికి వరుణ యాగం నిర్వహిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. గత నెలలో తిరుమలలో జరిగిన వరుణయాగం వల్ల వర్షాలు కురిసాయన్నారు. శ్రీనివాస మంగాపురంలో శత కుండాత్మక మహాశాంతి వరుణయాగంలో భాగంగా వేడుకగా శుక్రవారం ఉదయం.. ఆచార్య రుత్విక్ వరణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్తో పాటు ఈవో ధర్మారెడ్డి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ వరుణ యాగానికి ఇవాళ సాయంత్రం అంకురార్పణ జరగనుందని తెలిపారు. గత నెలలో తిరుమలలో జరిగిన వరుణ యాగం వల్ల వర్షాలు కురిసాయని, రానున్న రెండేళ్లలో వర్షపాతం తక్కువ నమోదవుతుందని వాతావరణ శాఖ సూచన మేరకే వరుణ యాగం నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. చదవండి: కుమార్తెకు ఆదర్శ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు -
దుర్గాఘాట్లో వరుణ యాగం
-
వర్షాల కోసం గుజరాత్ సర్కార్ పూజలు
సాక్షి, గాంధీనగర్ : గుజరాత్లో వరుణ దేవుడి కరుణ కోసం విజయ్ రూపానీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ పూజలు చేసేందుకు సన్నద్ధమైంది. వరుణ దేవుడి కటాక్షం కోసం అన్ని జిల్లాల్లో 41 యాగాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గుజరాత్లోని 33 జిల్లాలు, ఎనిమిది నగరాల్లో మే 31న యజ్ఞాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. రికార్డు స్ధాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటిన క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వరుణ యాగాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు తెలిపారు. చెరువులు, నదుల్లో పూడికతీతకు ప్రభుత్వం చేపట్టిన సుజలాం సుఫలం జల్ అభియాన్ కార్యక్రమంలో భాగంగానే వరుణ యాగాలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మే 31న జరిగే వరుణ యాగాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొంటారని, అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారని డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ తెలిపారు. ఈ వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో గుజరాత్ ముందవరుసలో ఉంది. -
పెంచలకోనలో శాస్త్రోక్తంగా వరుణయాగం
రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో కొలువైన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వరుణ యాగాన్ని ఆదివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారి పుష్కరిణిలో అర్చకులు వరుణ జపం నిర్వహించారు. అనంతరం స్వామివారి ముఖమండపంలో వర్షాలు కురిసేందుకు వరుణయాగం నిర్వహించారు. అనంతరం స్వామి వారి అంత్రాలయంలో మూలమూర్తికి 108 కలశాల్లోని జలాలు, సుగంధ ద్రవ్యాలతో అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు పెంచలయ్యస్వామి, రామయ్యస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురవాలని, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వరుణయాగం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయపాలకవర్గ అధ్యక్షుడు తానంకి నానాజీ, పాలకవర్గసభ్యులు సోమయ్య, జ్యోతమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి పోచారం దంపతుల వరుణయాగం
బిర్కూర్ : నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండల కేంద్రంలోని తిరుమల దేవస్థానంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు శనివారం ఉదయం వరుణయాగం నిర్వహించారు. దేవస్థానం ఆవరణంలోని గణపతి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. -
నేడు ఆర్ట్స్ కళాశాల మైదానంలో వరుణయాగం
అనంతపురం అగ్రికల్చర్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో వరుణుడి కటాక్షం కోసం శనివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో వరుణయాగం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ (ఏపీ ఎల్డీఏ) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) డాక్టర్ పీడీ కొండలరావు సాక్షితో మాట్లాడుతూ...డీఆర్డీఏ, నగరపాలక సంస్థ అధికారుల సహకారంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 3 వేల మంది మహిళలు, పరంజ్యోతి ఆలయం నుంచి భక్తులు, అలాగే పెద్ద సంఖ్యలో పురోహితులు యాగంలో పాల్గొంటారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు యాగం ప్రారంభమవుతుందన్నారు. -
యాదాద్రిలో ముగిసిన వరుణ యాగం
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని శివాలయంలో ఐదు రోజులుగా జరుగుతున్న వరుణ యాగం బుధవారం ముగిసింది. ఉదయం నుంచి రుద్రక్రమార్చన, హవనం అనంతరం మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఐదు రోజులుగా రుష్యశృంగ మహా మునికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు పూర్ణాహుతి అనంతరం విష్ణు పుష్కరిణిలో నిమజ్జనం చేశారు. తర్వాత దేవతా ఉద్వాసన పలికారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బి. నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో వరుణయాగం
యాదగిరిగుట్ట: నల్లగొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో నాలుగు రోజుల పాటు వరుణయాగం నిర్వహించనున్నారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఈ యాగం ఈ నెల 24 వరకు జరుగుతుంది. ఈ మేరకు ఆలయ ఆర్చకులచే యాగం నిర్వహిస్తున్నట్టు ఈవో గీతారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని, పంటలు సంవృద్ధిగా పండాలని ఈ యాగం చేపట్టినట్లు ఆమె తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వరుణయాగాన్ని విజయవంతం చేమాలని కోరారు. -
వర్షాల కోసం తెలంగాణలో వరుణయాగం
-
జలాశయంలో నీరు నిండాలని వరుణయాగం
-
వర్షాల కోసం వరుణయాగం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. జూన్ నెల చివరికి వచ్చినా ఇంకా వర్షాల జాడలేదు. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వడగాలులు వీస్తున్నాయి. వడదెబ్బకు వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వడగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ఈ జిల్లాలో నిన్న ఒక్కరోజే వడదెబ్బకు 23 మంది మృతి చెందారు. ఈ పరిస్థితులలో జనం వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో వర్షాలు కురవాలంటూ విజయవాడ కనకదుర్గ గుడిలో ఆలయ అధికారులు వరుణయాగం చేపట్టారు.


