breaking news
Vanzara
-
‘మోదీ, షాలను అరెస్ట్ చేయాలనుకున్నారు’
అహ్మదాబాద్: సంచలనం సృష్టించిన ఇష్రాత్ జహాన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో సీబీఐ.. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షాను అరెస్టు చేయాలనుకుందని మాజీ డీఐజీ వంజారా కోర్టుకి తెలిపారు. అదృష్టం బాగుండి వారిద్దరూ తప్పించుకున్నారని వ్యాఖ్యానించారు. ఇష్రాత్ జహాన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన సీబీఐ ప్రత్యేక స్థానంలో మంగళవారం విచారణకు హాజరయ్యారు. కాగా, సరైన ఆధారాలు చూపించడంలో సీబీఐ విఫలమైందంటూ 2014లో కోర్టు అమిత్ షా, మోదీలకు క్లీన్చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. విషయం.. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై హత్యాయత్నానికి కుట్ర జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. ఇష్రాత్ జహాన్, ఆమె స్నేహితులు జావేద్ అలియాస్ ప్రాణేశ్, పాకిస్తానీ యువకులు జీషాన్ జొహార్, అంజాద్ రాణాలను తీవ్రవాద దళంగా పోలీసులు అనుమానించారు. ఈ నలుగురు మోదీని హత్య చేయడానికి కుట్ర పన్నారని భావించి.. నాటి డీఐజీ వంజారా నేతృత్వంలో వారిని కాల్చి చంపారు. అయితే మృతులు తీవ్రవాదులు కాదనే విషయం సీబీఐ విచారణలో వెల్లడైంది. వంజారా కుట్ర పూరితంగా వ్యవహరించడం వల్లే నలుగురు అమాయకులు బలయ్యారని సీబీఐ కేసు నమోదు చేసింది. కాగా, కేసు నుంచి తమను విముక్తం చేయాలని వంజారా, మరో పోలీసు ఉన్నతాధికారి ఎన్.కే.అమిన్ వేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు తిరస్కరించింది. -
వంజారా లేఖపై గందరగోళం.. రాజ్యసభ వాయిదా
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై ఆ రాష్ట్ర మాజీ డీజీపీ వంజారా రాసిన లేఖ విషయంలో తీవ్ర గందరగోళం చెలరేగడంతో రాజ్యసభ పావుగంట పాటు వాయిదా పడింది. గురువారం సభ సమావేశమైన కొద్ది సేపటికే జేడీయూ, సమాజ్వాదీ సభ్యులు ఆ లేఖ విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక్కసారిగా గళమెత్తారు. అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సభ్యులకు ఎంతగా విజ్ఞప్తి చేసినా సభ అదుపులోకి రాలేదు. దీంతో ఆయన సభను పావుగంట పాటు వాయిదా వేశారు. మూడు బూటకపు ఎన్కౌంటర్ల కేసులో ఆరోపణలున్న ఐపీఎస్ అధికారి వంజారా మంగళవారం నాడు తన పదవికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తనను మోసం చేశారని ఆరోపణలతో భారీ లేఖాస్త్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. నరేంద్ర మోడీపైన, మాజీ హోం మంత్రి అమిత్ షాపైన తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ఉగ్రవాదులని ఆరోపణలున్నవారిని బూటకపు ఎన్కౌంటర్లలో హతమార్చడానికి వారిద్దరూ ప్రోత్సహించారని ఆయన చెప్పారు.