breaking news
Ustad imrat Khan
-
ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ శాస్త్రీయ సంగీతకారుడు ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ (83) అనారోగ్యం కారణంగా అమెరికాలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కొడుకు శుక్రవారం వెల్లడించారు. సితార్, సుర్బహర్లను వాయించడంలో ఇమ్రత్ ఖాన్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. గుండెపోటు రావడంతో మిస్సౌరిలోని సెయింట్ లూయిస్ వైద్యశాలలో ఇమ్రత్ కన్నుమూశారు. ఇమ్రత్ అంత్యక్రియలు శనివారం జరుగుతాయి. ఇమ్రత్ ఖాన్ తన జీవితాన్ని సితార్, సుర్బహర్లను వాయించేందుకే అంకితం చేశారు. గతేడాదే కేంద్రం ఆయనకు పద్మశ్రీ అవార్డును ఇవ్వగా, తన ప్రతిభను కేంద్రం ఆలస్యంగా గుర్తించిందంటూ అవార్డును తిరస్కరించారు. ఇమ్రత్ ఖాన్ కుటుంబానికి 400 ఏళ్ల సంగీత చరిత్ర ఉంది.బాస్ సితార్గా పిలిచే సుర్బహర్ వాయిద్య పరికరాన్ని వీరి వీరి కుటుంబమే తయారు చేసింది. -
పద్మశ్రీని తిరస్కరించిన ఉస్తాద్
షికాగో: ప్రముఖ సితార్, సుర్బహార్ విద్వాంసుడు ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ (82) ఇటీవలే తనకు కేటాయించిన ‘పద్మశ్రీ’ అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా తనకున్న పేరు ప్రఖ్యాతులకు ఈ అవార్డు తక్కువని.. అయినా చాలా ఆలస్యంగా తనను గుర్తించారన్నారు. సెయింట్ లూయిస్లో ఉంటున్న ఉస్తాద్ను షికాగోలోని భారత కాన్సులేట్ అధికారులు సంప్రదించగా.. ‘నా జూనియర్లు ఎప్పుడో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. దశాబ్దాలు ఆలస్యంగా నాకు ఈ అవార్డు వచ్చిందని భావిస్తున్నా’ అని తెలిపారు.