-
ఇంటర్నెట్ వాడకంలో మహిళల జోరు..
న్యూఢిల్లీ: నగరాల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. మెట్రోలు, టైర్ 1 నగరాల్లో ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్న మహిళల సంఖ్య ఈ ఏడాది 30 శాతం పెరగనున్నదని ఐఏఎంఏఐ-ఐఎంఆర్బీ నివేదిక తెలిపింది. పదిలక్షలకు మించిన జనాభా ఉన్న 35 నగరాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందిన ఈ నివేదికన ప్రకారం.. 2013లో 1.6 కోట్లుగా ఉన్న మహిళా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 30% వృద్ధితో ఈ ఏడాది 2.07 కోట్లకు పెరగొచ్చని అంచనా. పట్టణాల్లో పురుషుల ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 25 శాతం పెరిగింది. ఈ ఏడాది జూన్కల్లా భారత్లో 24.3 కోట్లమంది ఇంటర్నెట్ యూజర్లున్నారని అంచనా. ఇంటర్నెట్ ఉపయోగించే వారిలో అధిక వృద్ధి కళాశాల విద్యార్ధుల విభాగంలో ఉంది. గత ఏడాది 45.1 లక్షలుగా ఉన్న వీరి సంఖ్య ఈ ఏడాది 62% వృద్ధితో 72.9 లక్షలకు చేరింది. పట్టణాల్లో నెట్ను వాడుతున్న పాఠశాల బాలి కల సంఖ్య గతేడాది 21.5 లక్షలు కాగా.. ఈ ఏడాది 34% వృద్ధితో 28.8 లక్షలకు చేరింది. ఉద్యోగినులు కాని మహిళల సంఖ్య 49.3 లక్షల నుంచి 18% వృద్ధితో 58.3 శాతానికి పెరిగింది. ఇక ఉద్యోగినుల సంఖ్య 44.1 లక్షల నుంచి 8 శాతం వృద్ధితో 47.7 లక్షలకు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో రోజూ ఇంటర్నెట్ను యాక్సెస్ చేస్తున్న వారిలో ఉద్యోగినుల్లో 60% మంది, ఉద్యోగినులు కాని వారు 40% మంది ఉన్నారు. -
హైదరాబాద్ చూసేందుకు అందరికీ ఆసక్తి
దేశంలో పట్టణీకరణ ఇంకా బాగా పెరగాల్సి ఉందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. పట్టణాల్లో కాలుష్య సమస్య మీద ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. మెట్రోపొలిస్ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో 46 శాతం ప్రజలు పట్టణాల్లోనే ఉన్నారని, ప్రధానంగా విద్య, వైద్యం, ఉద్యోగం లాంటి అవసరాల కోసం పల్లె ప్రజలు కూడా పట్టణాల బాట పడుతున్నారని చెప్పారు. మొత్తం ప్రపంచంలో చూసుకుంటే 60 శాతం జనాభా పట్టణాల్లోనే ఉందని ఆయన తెలిపారు. ప్రపంచంలోని నగరాల మధ్య అవగాహన, అభిప్రాయాల మార్పిడికి మెట్రోపొలిస్ వేదికగా నిలిచిందని వెంకయ్య అన్నారు. అభివది్ధిలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్ను చూసేందుకు ఎంతోమంది ఉత్సాహం చూపుతున్నట్లు చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement