breaking news
Uravakonda Assembly Constituency
-
జగన్ బ్లాక్బస్టర్.. బాబు డిజాస్టర్
ఒకే రోజు ఇద్దరు నేతల సభలు జరిగాయి. ఆ సభలలో వారు మాట్లాడిన విషయాలు మీడియాలో రిపోర్టు అయ్యాయి. ఆ నేతలు ఎవరో కారు. ఒకరు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిమోహన్ రెడ్డి కాగా, మరొకరు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీచ్కు, చంద్రబాబు స్పీచ్కు ఎంత తేడా ఉందో పరిశిలిస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉపన్యసించింది పార్టీ క్యాడర్కు సంబంధించిన సభలో కాగా, చంద్రబాబు మాట్లాడింది రా..కదలిరా.. అన్న సభలో. జనం విషయంలో ఈ రెండిటిని పోల్చనవసరం లేదు. ఉత్తరాంధ్ర అంతటికీ కలిపి భీమిలి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్వహించిన సభలో లక్షల మంది హాజరయ్యారు. చంద్రబాబు సభలు ఉరవకొండ, పీలేరు నియోజకవర్గాలకు సంబంధించినవి. అయినప్పటికీ ఈ రెండు సభలలో కనిపించిన స్పందనను పోల్చవచ్చు. భీమిలి సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి విషయానికి విపరీతమైన రెస్పాన్స్ కనిపించింది. అదే చంద్రబాబు సభలో ముందు భాగంలో ఉన్నజనం మినహాయిస్తే వెనుకవైపు అంతా ఖాళీగా కనిపించడం సాధారణం అయిపోయింది. స్పందన కూడా అంతంతమాత్రమే. అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి ఏమిటంటే? వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం ఏమి చేసిందో, తద్వారా ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో వివరించడానికి ప్రాధాన్యత ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు ఎక్కడా తన పద్నాలుగేళ్ల పాలనలో ఫలానాది సాధించాను.. అని చెప్పలేకపోయారు. ఈ విషయం ఆదివారం నాడు తెలుగుదేశం భజనపత్రిక ఈనాడులో వచ్చిన వార్తను చదివితే అర్దం అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనసభలో యుద్దానికి సిద్దమా! అని తన క్యాడర్ను ప్రశ్నించి వారి నుంచి సిద్దం అనే జవాబును రాబట్టుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంఖం పూరించి, నగరా మోగించిన ఘట్టం అక్కడ ఉన్న లక్షలాది మందిని ఆకట్టుకుంది. చంద్రబాబు తన సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికు సమాధానం చెబుతున్నట్లుగా సమరానికి సై అన్నారు. దానిని ప్రధాన హెడింగ్గా ఈనాడు పెట్టుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్పీచ్లో చెప్పిన కొన్ని విషయాలు చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కురుక్షేత్ర యుద్దానికి సిద్దమయ్యామని, తమను పాండవులుగా ఆయన అభివర్ణించుకుంటూ ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదని, అర్జునుడు అని, టీడీపీ, జనసేన, రామోజీ, రాధాకృష్ణల వంటివారి కుట్రలను ఎదుర్కోబోతున్నానని, అర్జునుడు మాదిరి ఎదుటివారు పద్మవ్యూహం పన్నినా తాను ఛేదించగలనన్న అర్ధం వచ్చేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. 175 సీట్ల లక్ష్యం గురించి మరోసారి ఉద్ఘాటించి చంద్రబాబు కూడా గెలవడానికి లేదని ధీమాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు హామీలు, తన హామీలను పోల్చి వివరిస్తూ.. ఇది అబద్దానికి, నిజానికి మద్య ఉన్న యుద్దం అని ఆయన అన్నారు. తద్వారా చంద్రబాబు 2014లో వందల కొద్ది హామీలు ఇచ్చి 90శాతం ఎగ్గొట్టిన వైనాన్ని, తాను ఇచ్చిన హామీలలో 99శాతం పూర్తి చేసిన తీరును వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ అర్ధం అయ్యేలా వివరించారు. వృద్దాప్య పెన్షన్లను ఇళ్లవద్దే అందిస్తున్నామని, బడులను మార్చివేశామని, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లీనిక్స్ మొదలైన మార్పులను ఆయన సభలో గుర్తు చేశారు. ఆ రకంగా చంద్రబాబు తన సభలలో చెప్పినట్లు కనిపించలేదు. ఈనాడు పత్రికలో ఒక్క లైన్ కూడా అలాంటివాటి ప్రస్తావన లేకపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రత్యేకించి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందుబాటులోకి తెచ్చి ప్రపంచంతో పోటీ పడే విద్యను అందిస్తున్నామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సీబీఎస్ఈ, బైజూస్ కంటెంట్, పిల్లలకు టాబ్లు ఇలా ఏ రకంగా చూసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్పు కనిపిస్తుందని ఆయన ధైర్యంగా చెప్పగలిగారు. అదే చంద్రబాబు తన సభలలో తన మార్పు ఏమిటో ఎక్కడా చెప్పలేకపోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండున్నర లక్షల కోట్లను ప్రజల ఖాతాలలతో వేసిన విషయాల గురించి చెబుతూ, చంద్రబాబు టైమ్ లో పేదల బ్యాంకు ఖాతాలను, తన పాలన టైమ్ లో బ్యాంక్ ఖాతాలలో జమ అయిన డబ్బును చూసుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనడం విశేషం. ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తున్నామని అన్నారు. చంద్రబాబు టైమ్ లో ఎవరికీ ఇళ్ల స్థలం ఇవ్వలేకపోయారు. అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికు కలిసి వచ్చే పాయింట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్పీచ్ లో కొన్ని అంశాలనే ప్రస్తావించారు. నిజానికి ఉత్తరాంధ్రలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పి ఉండి ఉంటే ఇంకా బాగుండేది. మూలపేట పోర్టు, సమీపంలోనే ఫిషింగ్ హార్బర్, గిరిజన విశ్వవిద్యాలయం, పలాసలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, భారీ నీటి పథకం, విశాఖలో ఐటి రంగంలో వస్తున్న కంపెనీలు మొదలైన వాటి గురించి కూడా వివరించి ఉండాలి. ఇన్ని లక్షల మంది హాజరైన సభలో అవి కూడా చెప్పి ఉండాల్సిందని ఎక్కువ మంది భావన. అయితే ఇతర వ్యక్తులు ఆ విషయాలన్ని ప్రస్తావించారు. అది వేరే సంగతి. చంద్రబాబు తన స్పీచ్లో ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిను తిట్టడం, శాపనార్దాలు పెట్టడానికే ప్రాధాన్యం ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యరంగాల గురించి, ప్రజలకు వాటి ఆవశ్యకత గురించి ప్రసంగిస్తుంటే, చంద్రబాబు మాత్రం మద్యం గురించి ఎక్కువ మాట్లాడి అప్రతిష్టపాలవుతున్నారనిపిస్తుంది. మద్యం ధరలు, బ్రాండ్ల గురించి 74ఏళ్ల వయసులో మాట్లాడడం ఏ మాత్రం బాగోలేదు. ప్రజలకు మద్యం సేవించవద్దని చెప్పాల్సిన నేత, వాటిని ఎలా తాగాలో చెబుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో దెబ్బతినని రంగం లేదని చంద్రబాబు అంటున్నారు. కాని ఏ రంగం ఎలా దెబ్బతిందో చెప్పలేకపోతున్నారు. స్కూళ్లను బాగు చేయడం మంచిది కాదని, విలేజ్ క్లినిక్స్ పెట్టడం సరికాదని, ఇళ్లవద్దకే పెన్షన్లు తీసుకువెళ్లి వృద్దులకు ఇవ్వడం తప్పని, వాలంటీర్ల వ్యవస్థ వృధా అని, గ్రామ, వార్డు సచివాలయాలు అనవసరమని కూడా చంద్రబాబు అనగలరా? ఆ ఊసులే చంద్రబాబు తేలేకపోతున్నారు. మరి ఏ రంగం నష్టపోయింది?.. అంటే తను విమర్శించడానికి సబ్జెక్ట్ లేక, జనరల్గా విమర్శలు చేస్తూ పెద్ద గొంతుతో మాట్లాడుతున్నారనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్కీమ్ల వల్ల లబ్ది పొందినవారంతా తన స్టార్ కాంపెయినర్స్ అని అంటే, చంద్రబాబు దానికి పోటీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులు తన స్టార్ కాంపెయినర్లు అని చెబుతున్నారు. ఇంతకీ ఎవరు బాధితులో చెప్పలేకపోయారు. వైఎస్ఆర్సీపీలో సీట్ల కేటాయింపు, కొన్ని అసంతృప్తులు మొదలైనవి చంద్రబాబు మాట్లాడడం తెలివితక్కువతనంగా కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన పొత్తు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు, కొన్ని చోట్ల టీడీపీలో గొడవలు పెట్టుకుని ఎదుటివారిని అంటే ప్రజలు తెలుసుకోలేరనుకుంటే భ్రమే అవుతుంది. అంతేకాదు.. ఇంతకాలం లోకేష్ రెడ్ బుక్ అని ప్రచారం చేసి నవ్వులపాలైతే, చంద్రబాబు కూడా అదే బాటలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల చిట్టా రాస్తున్నానని, అందరిని అరెస్ట్ చేస్తానని చెప్పడం ద్వారా బెదిరింపు రాజకీయాలకే ప్రాదాన్యం ఇవ్వాలని చూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ను రాయలసీమ ద్రోహి అని పిచ్చి ఆరోపణ చేశారు కాని, దానికి సంబంధించిన ఆధారాలు చూపలేదు. నిజానికి పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విస్తరణకు అడ్డుపడిన చంద్రబాబు ద్రోహి అవుతారు కాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతారు? అవుకు రెండో టన్నెల్ను, వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ద్రోహి అవుతారు. పద్నాలుగేళ్లు అధికారంలో ఉన్నా.. చేయని చంద్రబాబు ద్రోహి అవుతారు! కానీ.. ఏది ఏమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ సూపర్ హిట్ అవడం, ఒక నిర్దిష్ట లక్ష్యం సాధించినట్లుగా కనిపిస్తే, చంద్రబాబుది రొటీన్గా రొడ్డకొట్టుడు ఫ్లాఫ్ సభగా మిగిలింది. ఒక ఎజెండా లేకుండా, ప్రజలకు ఏమి చేస్తామో చెప్పలేక నిస్సహాయస్థితిలో చంద్రబాబు ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారన్న విషయం తేలికగానే అర్ధం అవుతుంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అక్కచెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు
సాక్షి, అనంతపురం (ఉరవకొండ) : ‘ప్రజలకు ఏ మంచీ చేయని వారికి, ప్రజలను మోసం చేసిన వారికి ఇంత మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు. అయితే మీ బిడ్డ వాళ్లెవరినీ నమ్ముకోలేదు. వీళ్లందరి కంటే ఎక్కువగా నాకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని గట్టిగా చెబుతున్నాను. మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిన ఇళ్లలోని అక్కచెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం ఆయన వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగవ విడత నిధుల విడుదల సభలో మాట్లాడారు. ‘జెండాలు జత కట్టడమే వారి అజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ అజెండా’ అని తెలిపారు. వారందరికీ భిన్నంగా తనకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు.. రాజకీయ చరిత్రలో ఎవరికి ఉండరన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లుగా నిలవాలని కోరారు. జరుగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలవాలన్నారు. మనం వేసే ఓటు.. నొక్కే బటన్ ఎందుకు నొక్కుతున్నామో మనసులో పెట్టుకోవాలని చెప్పారు. మీరు వేసే ఓటు ఒక్క జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవడమే కాదు.. పేద కుటుంబాలు పేదరికం నుంచి బయట పడేందుకనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జగన్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటేనే అది జరుగుతుందని మనసులో పెట్టుకోవాలని చెప్పారు. వారికి మంచి చేసిన చరిత్రే లేదు ‘చంద్రబాబుకు, ఆయన ఎల్లో మీడియాకు, ఆయన గజదొంగల ముఠాకు మంచి చేసిన చరిత్ర లేదు. చెడు మాత్రమే చేసిన చరిత్ర వారిది. ఎప్పుడూ మోసాలే. చంద్రబాబుకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, వీరందరికీ ఒక దత్తపుత్రుడు తోడు. ఇటువంటి వారికి రోజూ సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తోంది. నిజంగా ఇది కలికాలమే’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఏ మంచి చేయకపోయినా, ఏ పథకాలు అమలు చేయకపోయినా చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు చాలా మంది ఉన్నారని, చంద్రబాబును భుజాన ఎత్తుకుని మోసే పెద్ద ముఠా ఉందని చెప్పారు. వాళ్లందరూ పక్క రాష్ట్రంలో ఉంటారన్నారు. ‘పక్క రాష్ట్రంలో పరి్మనెంట్ రెసిడెంట్గా ఉన్న చంద్రబాబు దత్తపుత్రుడు, చంద్రబాబు వదిన, మరో స్టార్ క్యాంపెయినర్, పక్క పార్టీలోకి వెళ్లిన మరో స్టార్ క్యాంపెయినర్, ముగ్గురు మీడియా అధిపతులు పొరుగు రాష్ట్రంలో ఉంటారు. అక్కడ ఉన్న మీడియా అధిపతులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీళ్లందరూ చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లే. వీరు కాకుండా రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘమంతా కూడా.. ఆయన్ను జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతున్నారు. ఇంకొంత మంది స్టార్ క్యాంపెయినర్లు కూడా చంద్రబాబుకు తో డుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న పసుపు కమలాలు.. ఇంకొంత మంది స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. అమరావతిలో బాబు భూములకు బినామీలు ఉన్నట్లు.. మనుషుల్లో, ఇతర పార్టీల్లో రకరకాల రూపాల్లో బినామీలుగా చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లుగా కనిపిస్తారు. టీవీల్లో విశ్లేషకుల పేరుతో కనిపిస్తారు. మే«దావుల పేరుతో వేదికల్లో కనిపిస్తారు. వీళ్లందరూ బాబు కోసం పని చేస్తారు. కారణం దోచు కోవడం, పంచుకోవడంలో వీళ్లందరూ కూడా భాగస్వాములే కాబట్టి’ అని సీఎం జగన్ నిప్పులు చెరిగారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్కు రూ.33 కోట్లు జీడిపల్లి రిజర్వాయర్కు సంబంధించి ఆర్ఆండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చే పనులు వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఉరవకొండ నియోజకవర్గంలో కొత్తగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు రూ.33 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.