breaking news
united Sisters Foundation
-
డిసెంబర్ 4న అమరావతి గోయింగ్ పింక్«థాన్
విజయవాడ (లబ్బీపేట) : మహిళల ఆరోగ్యం, రొమ్ము క్యాన్సర్ల పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో డిసెంబర్ 4వ తేదీ అమరావతి గోయింగ్ పింక్థాన్ను నిర్వహించనున్నట్లు యునైటెడ్ సిస్టర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మిలింద సోమన్ పేర్కొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ఈ పింక్థాన్ను మూడు కేటగిరీలుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం మొగల్రాజపురంలోని ది ఫుడ్లాంజ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమరావతి గోయింగ్ ఫింక్థాన్ వివరాలను వెల్లడించారు. యునైటెడ్ సిస్టర్స్ ఫౌండేషన్, ఎరెనా ఈవెంట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పింక్థాన్లో పలు సంస్థలు భాగస్వాములు కానున్నట్లు వివరించారు. ఈ పింక్థాన్ 10 కి.మీ., 5 కి.మీ., 3 కి.మీ.లు ఇలా మూడు కేటగిరీలుగా నిర్వహించనున్నామని చెప్పారు. ఈ పరుగులో 3 నుంచి 4 వేల మంది మహిళలు పాల్గొంటారని భావిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ మంజుభార్గవి, యునైటెడ్ సిస్టర్స్ ప్రతినిధి నీలిమ, డాక్టర్ శైలజ, రమేష్ హాస్పటల్స్కు చెందిన డాక్టర్ సుదర్శన్ పాల్గొన్నారు. -
రొమ్ము క్యాన్సర్పై యుద్ధం
ఖైరతాబాద్: మహిళల్లో రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు యునెటైడ్ సిస్టర్స్ ఫౌండేషన్ సహకారంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ‘పింక్థాన్’ పేరుతో రన్ నిర్వహించారు. 10కే, 5కే, 3కే విభాగాల్లో సాగిన రన్లో సుమారు ఏడు వేల మంది పాల్గొన్నారు. గతంలో ముంబ యి, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి మహా నగరాల్లో ఈ తరహా మారథాన్ నిర్వహించామని తొలిసారి సిటీలో ఏర్పాటు చేసినట్టు ఎస్బీఐ సీజీఎం సి.ఆర్. శశికుమార్ తెలిపారు. రన్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. రన్లో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పి.రఘురామ్, ఫిట్నెస్ నిపుణుడు సోమన్, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.