-
ఒబామా వ్యాఖ్యలపై సీతారామన్ మండిపాటు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం మైనారిటీల హక్కుల్ని కాపాడలేకపోతే, ఆ దేశం ఎప్పటికైనా విడిపోయే ప్రమాదం ఉందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఒబామా హయాంలోనే అమెరికా.. సిరియా, యెమెన్, సౌదీ అరేబియా, ఇరాక్ తదితర ఆరు ముస్లిం మెజారిటీ దేశాలపై వేలాది బాంబులు వేసిందని ఆరోపించారు. ఇది నిజం కాదా? అటువంటి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేస్తే నమ్మేదెవరు?’ అని ఆమె ప్రశ్నించారు. ప్రధాని మోదీని ఓవైపు ముస్లిం మెజారిటీ దేశాలు కీర్తిస్తుంటే మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు భారత్లోని ముస్లింల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నిర్మలా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 13 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు, అందులో ఆరు ముస్లిం మెజారిటీ దేశాలని ఆమె గుర్తుచేశారు. -
కేంద్ర ఆర్థిక మంత్రితో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ
సాక్షి, ఢిల్లీ: కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్తో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం భేటీ అయ్యారు. టీటీడీకి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు. గతంలో వుడా(విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చెల్లించిన రూ.219 కోట్లను వడ్డీతోసహా రీఫండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం రీఫండ్ చేయాలని కేంద్రాన్ని విజయసాయిరెడ్డి కోరారు. చదవండి: కేంద్రమంత్రి రవిశంకర్ప్రసాద్తో మంత్రి బుగ్గన భేటీ ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు -
హోటల్స్లో ఫుడ్పై అదనపు ట్యాక్స్ లేదు..
- కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెన్నై: హోటళ్లలో ఆహార పదార్థాలకు జీఎస్టీ ద్వారా అదనంగా పన్నులేవీ విధించలేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆదివారం చెన్నైలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. పాత పన్నుకు సమానంగా కొత్త పన్నును విధించామని, అందువల్ల వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఒక్కో వస్తువుకు, సేవలకు ఏమేర పన్ను విధించాలో జీఎస్టీ కౌన్సిల్ స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించిందని మంత్రి నిర్మల గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న పన్ను కంటే తక్కువ పన్ను విధింపునకే తాము ప్రాధాన్యమిచ్చినట్లు పేర్కొన్నారు. -
వీసా ఆందోళనలు : రంగంలోకి మంత్రి
న్యూఢిల్లీ : హెచ్-1బీ వీసాపై రేకెత్తిన ఆందోళనల నేపథ్యంలో వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ రంగంలోకి దిగనున్నారు. అమెరికా వీసా విధానంపై టెక్ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్తో త్వరలోనే మంత్రి భేటీ కానున్నట్టు సోమవారం తెలిపారు. అమెరికా ఇటీవల హెచ్-1బీ వీసాలో సవరణలు చేపట్టడానికి తీసుకొచ్చిన బిల్లు ఇండియన్ ఐటీ ఇండస్ట్రిపై ప్రభావం చూపనుందని తెలిపారు. మన టెకీస్ అక్కడ పనిచేస్తున్నారన్నారు. ఈ విషయంపై అమెరికా అథారిటీలపై నిరంతరం టచ్లో ఉంటున్నామని మంత్రి చెప్పారు. ''హెచ్-1బీ వీసాలో మార్పులు ప్రతిపాదించడం కచ్చితంగా భారత్పై ప్రభావం చూపనుంది. ఈ విషయంపై పార్లమెంటరీ సమావేశాలనంతరం నాస్కామ్తో చర్చిస్తాం. అమెరికాలో ఎక్కువగా పేరులోకి వచ్చిన దేశీయ కంపెనీలు, ఆ వాతారణంలో ఎలా పనిచేస్తున్నాయనే దానిపై వారితో సంప్రదింపులు జరుపుతాం. ఎలాంటి వ్యూహాలను వారు అమలుచేస్తున్నారో కూడా తెలుసుకుంటాం'' అని చెప్పారు. నాస్కామ్ ప్రత్యేక బృందం సైతం ఈ నెల 22-24 మధ్యలో అమెరికాకు వెళ్లనుంది. కొత్తగా ఏర్పడిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ వర్గాలతో, సెనేటర్లతో సమావేశం కానుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన అనంతరం దేశీయ ఐటీ కంపెనీల్లో ఆందోళనలు రేపుతూ హెచ్-1బీ వీసా విధానంలో మార్పులను ప్రతిపాదించారు. ఈ బిల్లు ప్రకారం హెచ్-1బీ వీసా హోల్డర్స్కు ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనం రెట్టింపు కానుంది. విదేశీ ఉద్యోగులకు వీసా జారీలు కఠినతరం కానున్నాయి. దీంతో దేశీయ ఐటీ కంపెనీలపై నిర్వహణ వ్యయాల భారం భారీగా పడనుంది. -
విశాఖ-చెన్నై కారిడార్పై అధ్యయనం పూర్తి
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు సంబంధించి ఏడీబీ (ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్) అధ్యయనం పూర్తయిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విదేశీ ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన డాష్ బోర్డ్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఏడీబీ అధ్యయనం పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఐఐఎఫ్టీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థలను కాకినాడ ఎక్స్పోర్ట్ జోన్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించిందన్నారు. ఎన్ఐడీ-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ను విజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే తాత్కాలిక భవనంలో తరగతులు ప్రారంభించామన్నారు. విదేశీ ఎగుమతులు, దిగుమతుల వ్యవహారాలను పూర్తి పారదర్శకతతో నిర్వహించడానికే డాష్బోర్డ్ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. డెరైక్టర్ జన రల్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ దీన్ని నిర్వహిస్తుంద ని వివరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement