-
స్థానిక లాక్డౌన్లతో భారీగా ఉద్యోగాలు కోల్పోయిన ప్రజలు
దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా చాలా రాష్ట్రాలు స్థానికంగా లాక్డౌన్లు విధించాయి. ఈ లాక్డౌన్ల వల్ల 75లక్షల మందికి పైగా తమ ఉద్యోగాలను కోల్పోయారు. నిరుద్యోగిత రేటు కూడా గత నాలుగు నెలల కంటే గరిష్ట స్థాయి 8 శాతానికి చేరుకున్నట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఇ) సోమవారం తెలిపింది. ఒకవేల ఇది ఇలాగే కొనసాగితే దేశానికి సవాలుగా మారనుందని సీఎంఐఇ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహేష్ వ్యాస్ తెలిపారు. "మార్చితో పోలిస్తే ఏప్రిల్ నెలలో 75 లక్షల ఉద్యోగాలు కోల్పోయారు. అదే నిరుద్యోగిత రేటు పెరగడానికి కారణమైంది "అని ఆయన చెప్పారు. జాతీయ నిరుద్యోగిత రేటు గణాంకాల ప్రకారం 7.97 శాతానికి చేరుకుంది. పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగిత రేటు 9.78 శాతం, గ్రామీణ నిరుద్యోగం 7.13 శాతంగా ఉన్నాయి. మార్చిలో జాతీయ నిరుద్యోగిత రేటు 6.50 శాతంగా ఉంది. గత ఏడాది పోలిస్తే కేసుల సంఖ్య వేగంగా పెరగడంతో రాష్ట్రాలు స్థానికంగా లాక్డౌన్లు విధించాయి. అంతిమంగా లాక్డౌన్ ప్రభావం ఉద్యోగాల మీద పడింది. గత ఏడాది నిరుద్యోగిత రేటు 24 శాతం పోలిస్తే అంతగా లేకున్నప్పటికి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అన్నారు. ఇది ఇలా ఉంటే దేశంలో రోజుకు 4 లక్షల కొత్త కరోనా కేసులు, 3,000 మందికి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. చదవండి: బ్యాంకుల్లో నిరుపయోగంగా రూ.60 వేల కోట్లు? -
పారిశ్రామిక ప్రగతిపై ఆశలు
కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏడాది కాలంలో పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతూ క్షేత్రస్థాయిలో వాటి అమలుపై దృష్టిసారిస్తూనే.. మరోవైపు పారిశ్రామిక ప్రగతి వైపు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. జిల్లాలో అపారంగా అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తగిన ప్రో త్సాహం అందించడం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు ఆర్థికాభివృద్ధి ధ్యేయంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఇప్పటికే వివిధ రకాల పరిశ్రమలను నెలకొల్పేందుకు ఇప్పటికే నిబంధనలను సడలించిన సర్కారు తాజాగా శుక్రవారం నూతన విధానాన్ని ప్రకటించింది. సీఎం కేసీఆర్ హైదరాబాద్లో నూతన పారిశ్రామిక విధానం పేరిట భారీ సదస్సును నిర్వహించి పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలు, ఎదురవుతున్న సమస్యలు, రుణాల మంజూరు, సర్కారు విధివిధానాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పరిశ్రమలను విరివిగా స్థాపించేందుకు కఠినతరంగా ఉన్న కొన్ని నిబంధనలను సడలించుకొని పారిశ్రామిక ప్రగతిని మరింత వేగవంతం చేయనున్నట్లు ప్రకటించారు. ఫెర్టిలైజర్, పవర్, టెక్స్టైల్స్, సిమెంట్ పరిశ్రమలకు పెద్దపీట జిల్లాలో నూతన పారిశ్రామిక విధానం అమల్లోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు కొత్తగా 42 యూనిట్లకు వివిధ శాఖల నుంచి 59 అనుమతులు మంజూరు చేశారు. రూ.24.79 కోట్లతో వీటిని అమలు చేస్తున్నారు. వీటి ద్వారా 460 మందికి ఉపాధి లభించనుంది. జిల్లాలో ఇప్పటివరకు వర్క్షాప్లు, దాణా కేంద్రాలు, గ్రానైట్ పరిశ్రమలు, రైస్మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. నూతన పారిశ్రామిక విధానం అమలయ్యూక పరిశ్రమలను నెలకొల్పేందుకు జిల్లాలో 55 వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఇప్పటికే జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు గుర్తించారు. వీటి ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించారు. ప్రధానంగా ఫర్టిలైజర్, విద్యుత్, టెక్స్టైల్స్, సిమెంట్ పరిశ్రమలను నెలకొల్పితే పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థికాభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. = ఇప్పటికే రామగుండంలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. మరో 2400 మెగావాట్ల పనులను నల్గొండ జిల్లా దామరచెర్లకు తరలిస్తారనే ప్రచారం జరుగుతోంది. అరుుతే జిల్లాలో విద్యుచ్చక్తి ఉత్పత్తికి అనువైన ప్రదేశమని గుర్తించడంతో మిగతా 2400 మెగావాట్ల ఉత్పత్తి పనులు సైతం రామగుండంలోనే జరగనున్నాయని తెలుస్తోంది. = బసంత్నగర్లో ఉన్న కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ వంటి కర్మాగారాలు నెలకొల్పేందుకు జిల్లా అనువుగా ఉందని అధికారులు గుర్తించినట్లు సమాచారం. జగిత్యాల డివిజన్ పరిధిలోని చాలా గుట్టల్లో సున్నపురాయి నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయని, సిమెంటు పరిశ్రమకు అనుకూలమని అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. = సిరిసిల్లలో ఇది వరకే టెక్స్టైల్స్ పార్కు ఉన్నా ఆశించిన మేర అభివృద్ధి జరగకపోవడంతో చేనేత కార్మికుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. దీంతో సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ టెక్స్టైల్స్ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి సిరిసిల్లను వస్రోత్పత్తిని కేంద్రంగా, టెక్స్టైల్స్ పరిశ్రమ కొత్త శోభను సంతరించుకొనేలా తీర్దిదిద్దాలని వ్యూహరచన చేశారు. = రామగుండంలో మూసివేసిన ఎఫ్సీఐ స్థానంలో రూ.5వేల కోట్ల పెట్టుబడితో గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం నిర్మాణానికి సంబంధించిన పనులు చురుకుగా జరుగుతున్నారుు. ఫర్టిలైజర్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోని అనేక సమీక్షలు చేశారుు. ఇటీవలనే కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎఫ్సీఐని సందర్శించి పునరుద్దరణ పనులు వేగవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. పై నాలుగు ప్రాధాన్య రంగాల్లో విరివిగా పరిశ్రమలు వచ్చి జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడానికి సర్కారు శ్రీకారం చుట్టింది. అనుమతుల్లో జాప్యం జరుగదు ఇక నుంచి పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక యువతకు, పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇక్కట్లు లేకుండా ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించడం, 15 రోజుల నుంచి 45 రోజుల్లో ఏ ప్రాజెక్టుకైనా అనుమతులు లభించేలా చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని పరిశ్రమల శాఖ కార్యాలయంలో ప్రతి మంగళ, శుక్ర వారాల్లో అన్ని శాఖల అధికారులు ఒకే దగ్గర ఉండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అనుమతులు వెంట వెంటనే ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో అనుమతుల్లో జాప్యం జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో లాగా కార్యాలయాల చుట్టూ పరిశ్రమల అనుమతి కోసం తిరగాల్సిన పనిలేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం నిరుద్యోగ నిర్మూలన, ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement