-
జింబాబ్వేకు మరో విజయం
నాగ్పూర్:వరల్డ్ టీ 20లో జింబాబ్వే మరో విజయాన్ని సాధించింది. గ్రూప్-బిలో స్కాట్లాండ్తో ఉత్కంఠభరితంగా సాగిన క్వాలిఫయింగ్ మ్యాచ్లో జింబాబ్వే 11 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత టాస్ గెలిచిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. జింబాబ్వే ఆదిలోనే సిబందా(4), కెప్టెన్ మసకద్జ(12)ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినా సీన్ విలియమ్స్ (53) ఆదుకున్నాడు. ఆ తరువాత ముతాంబమి(19), వాలర్ (13) చిగుంబరా(20)లు ఓ మోస్తరుగా ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. అనంతరం 148 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన స్కాట్లాండ్ 42 పరుగులకే ఐదు వికెట్లను నష్టపోయింది. అయితే ఆ తరువాత బెర్రింగ్టన్(36), మోమ్సేన్(31), డేవీ(24) దూకుడును ప్రదర్శించి జింబాబ్వే జట్టులో ఆందోళన రేకెత్తించారు. కాగా, స్వల్ప వ్యవధిలో స్కాట్లాండ్ వికెట్లను కోల్పోవడంతో 19.4 ఓవర్లలో 136 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. జింబాబ్వే బౌలర్లలో వెల్టింగ్టన్ మసకద్జ నాలుగు వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. గత మ్యాచ్ లో హాంకాంగ్ ను జింబాబ్వే ఓడించిన సంగతి తెలిసిందే. -
స్కాట్లాండ్ విజయలక్ష్యం 148
నాగ్ పూర్: వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ గురువారం గ్రూప్-బిలో స్కాట్లాండ్తో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్లో జింబాబ్వే 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే ఆదిలోనే సిబందా(4), కెప్టెన్ మసకద్జ(12)ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. కాగా, సీన్ విలియమ్స్ (53), ముతాంబమి(19)లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దడంతో తేరుకుంది. చివర్లో వాలర్ (13) చిగుంబరా(20)లు ఓ మోస్తరుగా ఆడటంతో జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. స్కాట్లాండ్ బౌలర్లలో ఇవాన్స్, వాట్, షరిఫ్లు తలో రెండు వికెట్లు సాధించారు. -
బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే
నాగ్ పూర్: వరల్డ్ టీ 20లో భాగంగా ఇక్కడ గురువారం గ్రూప్-బిలో స్కాట్లాండ్తో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్లో జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సూపర్-10 దశకు అర్హత సాధించేందుకు జరుగుతున్న తొలి రౌండ్ పోరులో ఇప్పటికే జింబాబ్వే ఒక మ్యాచ్ గెలవగా, స్కాట్లాండ్ ఆడిన మొదటి మ్యాచ్లో ఓటమి పాలైంది. ఇరు జట్లను బలబలాలను పరిశీలిస్తే జింబాబ్వేనే కాస్త మెరుగ్గా ఉంది. ఇక స్కాట్లాండ్ జట్టు సమష్టి ప్రదర్శనే నమ్ముకుని బరిలోకి దిగుతోంది. -
8 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం
ధర్మశాల: క్వాలిఫయంగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ 8 పరుగుల తేడాతో నెదర్లాండ్పై విజయం సాధించింది. నిర్ణీత 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్ చివరి వరకు పోరాడి ఓడింది. తొలి నుంచి కూడా వికెట్లు తీయడంలో బంగ్లా బౌలర్లు సఫలం కావడంతో విజయం సులభమైంది. ఓ దశలో నెదర్లాండ్ 10 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. కానీ, బ్యాట్స్మెన్స్ భాగస్వామ్యం నెలకొల్పడంలో విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. స్టెఫాన్ మైబర్గ్ 29, కెప్టెన్ పీటర్ బోరెన్ 29, బెన్ కూపర్ 20, టామ్ కూపర్ 15 పరుగులు చేసినా చివర్లో బౌలర్లు చేతులేత్తేశారు. బంగ్లా బౌలర్లు అమిన్ హుస్సేన్ రెండు, షకిబుల్ హసన్ 2 వికెట్లు తీయగా, నాసిర్ హుస్సన్, మొర్తజా తలో వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసినా బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్ సౌమ్య సర్కార్ 15 పరుగులకే వెనుతిరిగినా... మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 58 బంతుల్లో 83 (3 సిక్సర్లు, 6 ఫోర్లు) పరుగులు చేసి నాట్ ఔట్గా నిలిచాడు. వరుస వికెట్లు కోల్పోతున్న ఇక్బాల్ ధీటుగా ఆడుతూ టీమ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. నెదర్లాండ్ బౌలర్లు వేన్ డెర్ గుగ్టెన్ మూడు వికెట్లు, వాన్ మీకెరెన్ రెండు వికెట్లు తీయగా మెర్వీ, బోర్రెన్ తలో వికెట్ తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా తమీమ్ ఇక్బాల్ ఎంపికయ్యాడు. మరో మ్యాచ్ ధర్మశాలలో రాత్రి 7 గంటలకు ఐర్లాండ్, ఒమన్ ల మధ్య జరుగును. -
వరల్డ్ టీ 20: నెదర్లాండ్ విజయలక్ష్యం 154
ధర్మశాల: వరల్డ్ టీ-20లో భాగంగా బుధవారం హిమచలప్రదేశ్ ధర్మశాల స్టేడియంలో నెదర్లాండ్తో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దాంతో నెదర్లాండ్ జట్టుకు 154 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన నెదర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన బంగ్లా ఓపెనర్ సౌమ్య సర్కార్ 15 పరుగులకే వెనుతిరిగాడు. మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ వరుస వికెట్లు కోల్పోతున్న ధీటుగా ఆడుతూ 58 బంతుల్లో 83 (3 సిక్సర్లు, 6 ఫోర్లు) పరుగులు చేసి నాట్ ఔట్గా నిలిచాడు. షబ్బీర్ రెహ్మన్ 15 పరుగులు, మహ్మదుల్లా 10 పరుగులు చేయగా మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. కాగా, నెదర్లాండ్ బౌలర్లు వేన్ డెర్ గుగ్టెన్ మూడు వికెట్లు, వాన్ మీకెరెన్ రెండు వికెట్లు తీయగా మెర్వీ, బోర్రెన్ తలో వికెట్ తీసుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement