-
ఐపీఎల్ రేటింగ్స్ ఎందుకు తగ్గాయ్! విశ్లేషించిన బిజినెస్ మ్యాగ్నెట్
క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించే కార్పోరేట్ కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోషన్కి సరైన వేదికగా భావించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ రేటింగ్స ఈ సీజన్లో దారుణంగా పడిపోయాయి. గతేడాదితో పోల్చితే 15 నుంచి 40 ఏళ్ల వయసులో వివిధ కేటగిరీల్లో సగటున 30 శాతం పైగానే వీక్షకుల సంఖ్య తగ్గిపోయింది. దీనిపై సియట్ టైర్స్ చైర్మన్ ప్రముఖ బిజినెస్ మ్యాగ్నెట్ హార్స్ హార్ష్ గోయెంకా స్పందించారు. ఐపీఎల్ టీవీ రేటింగ్స్ తగ్గడానికి హర్ష్ గోయెంకా తెలిపిన కారణాలు - ఎక్కువ మంది అభిమానుల మద్దతు ఉన్న ముంబై ఇండియన్స్, చైన్నై సూపర్ కింగ్స్ జట్లు వరుసగా ఓటమి పాలవుతుండటం - విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోని వంటి దిగ్గజాలు కూడా వరుసగా ఫెయిల్ అవుతుండటం - చాలా మ్యాచ్లు ఉత్కంఠ లేకుండా నీరసంగా ముగుస్తుండటం - ఎక్కువ మ్యాచ్లు ముంబై రీజియన్లో జరపడం వల్ల గ్యాలరీల్లో ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోవడం - కరోనా కారణంగా రెండేళ్ల పాటు టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోయిన జనాలు ఇప్పుడు ఎక్కువగా బయట తిరగాలి అనుకోవడం వల్ల ఈసారి ఐపీఎల్ రేటింగ్స్ తగ్గిపోయినట్టు హర్ష్ గోయెంకా వివరించారు. ఐపీఎల్ తాజా సీజన్ మొదటి వారానికి సంబంధించి బార్క్ ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో గతేడాదితో పోల్చితే వివిధ వయసుల వారీగా 15-21 గ్రూప్లో 38 శాతం, 22-30 గ్రూపులో 33 శాతం. 31-40 గ్రూపులో 32 శాతం మేర వీక్షకుల సంఖ్య తగ్గినట్టు తెలిపింది. రెండో వారం ఫలితాల్లో ఇది 40 శాతానికి చేరవచ్చని తెలిపింది. ఐపీఎల్ ప్రసార హక్కులను స్టార్టీవీ రూ.3,200 కోట్లకు దక్కించుకుంది. ఈ సీజన్ ద్వారా రూ.4000 కోట్ల రెవెన్యూ ఆశిస్తోంది. ఐపీఎల్లో 10 సెకన్ల యాడ్కి రూ.16.50 లక్షల ఫీజు వసూలు చేస్తోంది స్టార్. చదవండి: ప్రచారంలో పీక్స్.. మొబైల్ కొంటే పెట్రోల్, నిమ్మకాయలు ఉచితం -
దిగజారుతున్న మీడియా విలువలను కాపాడాలి
-
ఫేక్ టీఆర్పీ రేటింగ్ స్కాం గుట్టురట్టు
-
ఫేక్ టీఆర్పీ రేటింగ్ స్కాం గుట్టురట్టు
సాక్షి, న్యూఢిల్లీ : నకిలీ టీర్పీ రేటింగ్స్ పొందుతూ అక్రమాలకు పాల్పడుతున్న టీవీ రేటింగ్స్ స్కాంను ముంబై పోలీసులు బట్టబయలు చేశారు. జనాలకు డబ్బులిచ్చి, తమ ఛానల్ మాత్రమే చూడాలని మీటర్స్ను అమర్చి అక్రమంగా రేటింగ్స్ పెంచుకుంటున్న ఛానల్స్ను పోలీసులు గుర్తించారు. విధంగా అక్రమాలకు పాల్పడుతున్న ఛానల్స్లో ఓ ప్రముఖ జాతీయ మీడియాతో మహారాష్ట్రకు చెందిన మరో రెండు ఛానల్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గురువారం ముంబైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముంబై పోలీస్ కమిషనర్ పరయ్ బీర్ సింగ్.. టీవీ రేటింగ్స్ స్కాం వివరాలను గురువారం వెల్లడించారు. బార్క్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు ఫేక్ టీర్పీ రేటింగ్ వివరాలు తెలిశాయని తెలిపారు. దీనిలో బార్క్ మాజీ ఉద్యోగులతో పాటు మరికొంత మంది ప్రముఖులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఛానల్ మాత్రమే చూస్తామన్నవారికి ఉచిత టీవీతో పాటు కొంత నగదును సైతం అందిస్తారని పేర్కొన్నారు. తాజా స్కాంతో సంబంధముందని అనుమానిస్తున్న ఇద్దరు మరాఠీ టీవీ యజమానులను పోలీసులు అరెస్ట్ చేయగా.. మరికొంతమందికి నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారం టెలివిజన్తో పాటు, రాజకీయంగాను చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ స్కాంలో జాతీయ మీడియాకు చెందిన ఓ ప్రముఖ ఛానల్ యజమాని కూడా ఉన్నాడని సమాచారం. -
ఐపీఎల్-2020: అత్యధిక టీవీ రేటింగ్స్
అబుదాబి : యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్-2020 సీజన్కు అత్యధిక టీవీ రేటింగ్ వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అంచనా వేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్లో టోర్నీని నిర్వహించలేకపోతున్నామని, గతంలో కంటే ఈసారి అత్యధిక వీక్షకులు లీగ్ను చూస్తారని తెలిపారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించకపోవడం కారణంగా.. టీవీల ద్వారానే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఐపీఎల్ను వీక్షిస్తారని గంగూలీ అభిప్రాయపడ్డారు. దీని ద్వారా టీవీలకు అత్యధిక రేటింగ్ రానుందని సోమవారం నిర్వహించిన ఓ సమావేశంలో అన్నారు. సెప్టెంబర్ 19న ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మొత్తం మూడు వేదికల్లో మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దుబాయ్, అబుదాబి, షార్జా వేదికలుగా ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించనున్నారు. (సీఎస్కేలో ఖేదం.. ఆర్సీబీలో మోదం) షెడ్యూల్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే గత రన్నరఫ్ జట్టు సీఎస్కేను కరోనా వైరస్ వెంటాడుతోంది. జట్టులోని ఇద్దరు కీలక ఆటగాళ్లతో పాటు పదిమంది సిబ్బంది వైరస్ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామం లీగ్ షెడ్యూల్పై పడే అవకాశం ఉందని వార్తలూ వినిపించాయి. అయితే అనుకున్న షెడ్యూల్ ప్రకారమే లీగ్ను ప్రారంభిస్తామని ఇటీవల లీగ్ నిర్వహకులు ప్రకటించారు. మరోవైపు బిగ్ టోర్నీ కోసం భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఐపీఎల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. (రైనాకు సీఎస్కే దారులు మూసుకుపోయినట్లేనా..!)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
కుటుంబాన్ని బండ బూతులు తిట్టిన చంద్రబాబుతో పవన్ పొత్తు..!
తప్పక చదవండి
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement