breaking news
TRS Party Failures
-
Huzurabad: ఓట్ల కోసం కుట్రలు చేయడం సిగ్గుచేటు
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్లో అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని మంత్రులు తమ నియోజకవర్గాల్లో అమలు చేయించుకునే దమ్ము, ధైర్యం ఉంటే స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. మంత్రులు తమ నియోజకవర్గాలు, మంత్రిత్వశాఖలను గాలికి వదిలి హుజూరాబాద్ రాజకీయం కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారని, ఓటర్లను మభ్యపెట్టడానికి అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా మంత్రులు గంగుల కమలాకర్, హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్రావు తమ నియోజకవర్గాల్లోని దళితులకు మూడెకరాల భూమి, అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఎస్సీసబ్ ప్లాన్ నిధులతో ఎంతమందిని ఆదుకున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఒక్క ఈటల రాజేందర్ను ఓడించడానికి టీఆర్ఎస్ యంత్రాంగం, ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతున్నా నేటికీ ఆశించిన ఫలితం రాలేదన్నారు. సర్వేలన్నీ ఈటల రాజేందర్కు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మత రాజకీయాలకు అలవాటు పడిపోయి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేని దుస్థితిలో ఉందని దుయ్యబట్టారు. మజ్లిస్ చేతిలో కీలుబొమ్మగా మారిందని, నాటి నిజాం సర్కారుకు నేటి కేసీఆర్ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏమీ లేదని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్కు కౌంట్డౌన్ మొదలవుతుందని తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్గౌడ్, ఉపాధ్యక్షుడు కన్న కృష్ణ, జిల్లా కార్యదర్శి రాపర్తి ప్రసాద్, కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, రాపర్తి విజయ, కచ్చు రవి, పెద్దపల్లి జితేందర్, మీడియా ఇన్చార్జి కటకం లోకేశ్, ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. చదవండి: ప్రజల దృష్టిలో చిల్లర కావద్దు -
వైఎస్సార్సీపీ ప్లీనరీకి తరలిరావాలి
► పార్టీ జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్రాజ్ జనగామ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెల మూడో వారంలో హైదరాబాద్లో నిర్వహించనున్న ప్లీనరీకి కార్య కర్తలు భారీగా తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్ రాజ్ అన్నారు. పట్టణంలో శుక్రవారం వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు చిన్నపాగ వెంకటరత్నం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పా ల్గొని మాట్లాడారు. ప్లీనరీకి వైఎస్సా ర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా హా జరుకానున్నట్లు చెప్పారు. ప్లీనరీలో టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు, ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వం మూడెకరాల భూపంపిణీ విషయంలో వైఫల్యంతో పాటు లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి కేవలం వందల సం ఖ్యలో భర్తీచేయడం దారుణమన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పి మోసం చేస్తుందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీకి తెలంగాణలో మంచి భవిష్యత్ ఉం టుందని చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, కందికొండ భిక్షపతి, జిల్లా సంయుక్త కార్యదర్శి ఐలయ్య, ఎస్సీ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రొడ్డ కృష్ణ, చింతకింది శ్రీహ రి, మండల అధ్యక్షుడు బక్క జంపన్న, నాయకులు ఊరిడి శ్రీనివాస్, దేవరాయ ఆంజనేయులు, రడపాక భాస్కర్, జంగిశేఖర్, బొట్ల నవీన్, గుండె శ్రీకాంత్, దారావత్ నరేష్, కల్లెపు ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.