-
నల్లగొండ ఎంపీ స్థానానికి ఓ ముఖ్య నేత రాక?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్ నాయకత్వం నల్లగొండపై పట్టు సాధించేందుకు పెద్ద కసరత్తే చేస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు స్థానాలు గెలుచుకుంది. కాగా, కాంగ్రెస్ ఐదు స్థానాలతోపాటు, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న సీపీఐ ఒక స్థానం వెరసి ఆరు స్థానాలు గెలిచాయి. ఇందులో మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన భాస్కర్రావు, దేవరకొండనుంచి సీపీఐ తరఫున గెలిచిన రవీంద్రకుమార్.. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీ బలం ఉమ్మడి జిల్లాలో ఎనిమిది మందికి చేరింది. ఇక, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలో ప్రధాన పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు నల్లగొండ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఆ మాత్రం సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. అయితే, ఈసారి అలాంటి ఫలితాలు రాకుండా నల్లగొండలో పూర్తిస్థాయిలో పాగా వేసేందుకు టీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నల్లగొండ కొత్త జిల్లా పరిధిలోని అన్ని స్థానాలను గెలుచుకునే వ్యూహానికి పదును పెడుతోంది. దీంతో ఆ పార్టీ ఇప్పటినుంచే తమ చేతిలో లేని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలం పెంచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రధానంగా సీఎల్పీ నేత ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జునసాగర్, సీఎల్పీ ఉపనేత ఉన్న నల్లగొండ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారిం చారని చెబుతున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ డిప్యూటీ లీడర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచా రు. మరోవైపు సీఎల్పీ నేత జానారెడ్డి నాగార్జునసాగర్ నుంచి ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ ముగ్గురు నేతలకు చెక్పెట్టేందుకు అ ధికార టీఆర్ఎస్ అధినేత పక్కా స్కెచ్ తయా రు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ..మూడు నియోజకవర్గాల్లో బలోపేతంపై దృష్టి కాంగ్రెస్కు చెందిన ముగ్గురు ముఖ్య నేతలకు చెక్ పెట్టేందుకు వారి నియోజకవర్గాల్లో తమ బలంగా ఇంకా పెంచుకోవడమే లక్ష్యంగా వలసలను భారీగా ప్రోత్సహిస్తున్నారు. ఏ ఎన్నికల్లోనైనా కీలక పాత్ర పోషించే స్థానిక ప్రజాప్రతినిధులను కాంగ్రెస్నుంచి లాగేసుకుంటున్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నా యకుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయవచ్చని వలసలకు ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఇటీవల కొద్ది రోజుల కింద నాగార్జునసాగర్ నియోజకర్గంలో జానారెడ్డికి దగ్గరి అనుచరులు అనదగిన వారిని టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యుల వంటి స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు వారి ముఖ్య అనుచరులను కూడా భారీగానే చేర్చుకోవడం ద్వారా బలం పెచుకుంటున్నారు. నల్లగొండ ఎంపీ స్థానానికి ఓ ముఖ్యనేత రాక? ఈసారి ఎన్నికల్లో నల్లగొండలో కాంగ్రెస్ను పూర్తిగా మట్టికరిపించేందుకు టీఆర్ఎస్ వేస్తున్న మరో ఎత్తుగడ నల్లగొండ లోక్సభా నియోజకవర్గం నుంచి పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత బరిలోకి దింపడమని చెబుతున్నారు. ఫలితంగా నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో విజ యం తేలికవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోనే తక్కువ స్థానాలు గెలుచుకుంది. ఈసారి అలా జరగకుండా మెజారిటీ స్థానాలు పొందేందుకు నల్లగొండ ఎంపీగా ఒక ముఖ్యనేతను బరిలోకి దింపడం ఖాయమంటున్నారు. ఉద్యమ సమయంలో కూడా బలహీనపడుతున్నామనుకున్న సందర్భాల్లో టీఆ ర్ఎస్ అధినేత నియోజకవర్గాలు మార్చి పోటీచేసిన ఉదంతాలను ప్రస్తావిస్తున్నారు. కేసీఆర్ గతంలో కరీంనగర్, ఆ తర్వాత మహబూబ్నగర్, గత సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడతోపాటు వాటి పరిధిలోని అసెంబ్లీ సీట్లలోనూ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచేలా చేశారు. ఈ సారి కూడా నల్లగొండ ఎంపీ సీటు నుంచి అదే తరహాలో ఒక ముఖ్య నేతను బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
పార్టీ ముఖ్య నేతలతో కెసిఆర్ సమావేశం
హైదరాబాద్: పార్టీ ముఖ్య నేతలతో టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సమావేశమయ్యారు. మెదక్ జిల్లాలోని ఫామ్ హౌస్లో జరుగుతున్న ఈ సామావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, ముఖ్యనాయకుల్ని కూడా ఆహ్వానించారు. పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, ఎంపి మందా జగన్నాథం, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలు చివరి దశకు వస్తుండటం, ఇప్పటి వరకు తెలంగాణ బిల్లు ప్రస్తావన లేకపోవడం, భవిష్యత్లో అనుసరించవలసిన వ్యూహం, పార్టీ విలీన అంశం ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. పార్టీ ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశమవడం ఈ వారంలో ఇది రెండోసారి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 World Cup 2024: చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
మరికొన్ని గంటల్లో యాపిల్ ‘లెట్ లూస్ ఈవెంట్’
ముస్లిం సమాజం మారాలి: ప్రధాని మోదీ విజ్ఞప్తి
వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి
కేజ్రీవాల్కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!
ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్
వ్యవస్థలను మేనేజ్ చేసేది చంద్రబాబే: ఎమ్మెల్సీ లేళ్ల
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement