-
కర్నూలులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో రామోజీ 'షో'
-
మూడు వారాలైనా బడి మూతే..!
గిరిజనుల అమాయకత్వం, ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం, ట్రైబల్ వెల్ఫేర్ అధికారుల ఉదాసీనత వెరసి 45 మంది గిరిజన విద్యార్థులను విద్యకు దూరం చేశాయి. పాఠశాలలు తెరిచి 20 రోజులు అయినా ఆ గ్రామంలో మాత్రం రెండు నెలలు వరకు పాఠశాల తెరుచుకోదు. అప్పటి వరకు చిన్నారులు విద్యకు దూరంగా ఇళ్ళ వద్ద ఉండాల్సిందే. ఇది ఏటా జరిగే తంతే. రెక్కలు ముక్కలు చేసుకునైనా తమ పిల్లలను చదివించుకుందామన్న నిరుపేదల ఆశ అడియాశగా మారుతోంది. దీంతో అక్కడి పిల్లల భవిషత్ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం వారి పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది ఈ సంఘటనే చెప్తోంది. గుడ్లూరు: మండలంలోని పాజర్ల గ్రామం, ఎస్టీ కాలనీలో 150 గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామానికి కిలో మీటరు దూరంలో కాలనీ ఉండటంతో 20 సంవత్సరాల కిందట కాలనీలో ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్వంలో గిరిజన పాఠశాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 30 నుంచి 45 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా కూలి పనులు చేసుకుంటూ తమ పిల్లలను చదివించుకుంటున్నారు. అయితే గత నాలుగు సంవత్సరాలుగా పాఠశాల సక్రమంగా నడవడం లేదు. ఇక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయుడు సకాలంలో పాఠశాలకు వచ్చే వ్యక్తి కాదు. కాలనీ వాసులు రెండు సంవత్సరాలు క్రితం ఉన్నాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతని స్థానంలో ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు మహిళా ఉపాధ్యాయురాలును నియమించారు. ఆమె ఒక సంవత్సరం పాటు బాగానే చెప్పారు. ఆమె బదిలిపై వెళ్లడంతో రెండు సంవత్సరాలు నుంచి వస్తున్న ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలకు రాకపోవడం వల్ల విద్యార్థులకు మళ్లీ కష్టాలు తప్పడం లేదు. ఉపాధ్యాయుడు ఎప్పుడు పాఠశాలకు వస్తాడో ఎప్పుడు రాడో కూడా తెలియదని ఇక్కడి కాలనీ వాసులు చెబుతున్నారు. గత సంవత్సరం కూడా రెండు నెలలు వరకు పాఠశాలను తెరవక పోవడంతో కొంత మంది తల్లిదండ్రులు 3, 4, 5 తరగతులు చదువుతున్న 15 మంది పిల్లలను 4 కిలోమీటర్లు దూరంలో ఉన్న పోట్లూరులోని యూపీ పాఠశాలకు ఆటోలో పంపుతున్నారు. 1, 2 తరగతులు చదువుతున్న మిగతా 30 మంది చిన్నారులు ఇళ్ళ వద్దే ఉంటున్నారు. ఈ సంవత్సరం కూడా పాఠశాలలు తెరిచి 20 రోజులు అయినా కాలనీలో ఉన్న పాఠశాల ఇప్పటి వరకు తెరుచుకోలేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లలను బాగా చదివించుకోవాలని ఆశ ఉన్నా ఉపాధ్యాయుడు రాక పోవడంతో నిస్సహాయంగా ఉండాల్చిన పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల రూపాయలు ఫీజులు చెల్లించి ప్రైవేటు పాఠశాలలకు పంపలేని పరిస్థితి తమదని వారు వాపోయారు. ట్రైబల్ వెల్ఫేర్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఉపాధ్యాయుడు పాఠశాలకు సక్రమంగా రావడం లేదని వారు విమర్శిస్తున్నారు. ఈ పాఠశాల గురించి ప్రజాప్రతినిధులు కాని అధికారులు గాని పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు తమ గోడును ఆలకించి పాఠశాలను తెరిచి ఉపాధ్యాయుడు ప్రతి రోజు పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఏటా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాం పాఠశాలను సక్రమంగా నడపక పోవడంపై గత సంవత్సరం నుంచి ట్రైబల్ వెల్ఫేర్ అధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నామని మండల విద్యాశాఖాధికారి కల్లయ్య తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు పాఠశాలను తెరవలేదని సమాచారం అందించాం. దీనిపై డీఈఓకు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. పాఠశాలను త్వరగా తెరిపించాలి రెండు సంవత్సరాలు నుంచి పాఠశాలను సరిగా తీయక పోవడం వల్ల మా ముగ్గురు కుమార్తెలను ఆటోలో పొట్లూరులోని పాఠశాలకు పంపుతున్నాం. రోడ్డు కూడా బాగాలేదు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని భయంగా ఉంది. పాఠశాలను త్వరగా తెరిపించాలి.–హేమ, కాలనీ వాసి -
ఉపాధ్యాయుడు లేని గోకొండ పాఠశాల
బజార్హత్నూర్(బోథ్): మండలంలోని గోకొండ గ్రామంలోని ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలకు 23రోజులుగా ఉపాధ్యాయుడిని నియమించడంలేదు. గత మార్చిలో ఇక్కడ పని చేసిన ఉపాధ్యాయుడు సస్పెండ్ కాగా.. తిరిగి ఉపాధ్యాయుడిని నియమించలేదు. ఏరోజైనా ఉపాధ్యాయుడు రాకపోతాడా.. అని నిత్యం పాఠశాలకు వెళ్తున్న ఒకటి నుంచి ఐదు వరకు చదివే 45 మంది విద్యార్థులు నిరాశతో ఇంటికి తిరిగి వ స్తున్నారు. విద్యాధికారులకు ఎన్నిసార్లు తెలిపినా ఫలితం లేకుండాపోయిందని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. కనీసం టీసీలు రాసిస్తే భా రమైన ‘ప్రైవేట్’లోనైనా చదివిస్తామని ఆవేదన వ్యక్తంచేస్తున్నా రు. ఈ విషయమై ఎంఈవో శ్రీకాంత్ను సంప్రదించగా.. గోకొండ పాఠశాల ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోనిదని, ఇతర పాఠశాలల నుంచి ఎవరినైనా డిప్యూటేషన్పై పంపుతామంటే అదన పు ఉపాధ్యాయులు లేరని తెలిపారు. సీఆర్టీల రెన్యూవల్ ప్రక్రియ ఉపాధ్యాయుల బదిలీల కౌ న్సెలింగ్ తర్వాతే ఉంటుందన్నారు. విద్యార్థులు నష్టపోకుండా తాత్కాలిక ఉపాధ్యాయుడిని నియమించాలని ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. -
గిరిజన విద్యార్థికి డెంగీ?
భయాందోళనలో ప్రజలు కురుపాం : మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సీదరపు జగదీష్ (15)కు డెంగీ లక్షణాలు ఉన్నట్లు సమాచారం. జగదీష్ మూడు రోజులుగా మలేరియాతో బాధపడుతుండడంతో వసతిగహ సంక్షేమాధికారి చంద్రబాబు విద్యార్థిని కురుపాం సామాజిక ఆస్పత్రికి తలరించగా, అక్కడ వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించి డెంగీ కేసుగా అనుమానం వ్యక్తం చేశారు. దీంతో జగదీష్ను శనివారం హుటాహుటిన పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా వారం కిందట కురుపాం మండల కేంద్రానికి చెందిన ఉల్కా ఉమామహేశ్వరరావు(33) అనే వ్యక్తికి కూడా డెంగీ సోకిన సంగతి తెలిసిందే. కురుపాం మండల కేంద్రంలో రెండు డెంగీ కేసులు నమోదవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement