-
ఘనంగా ఆదివాసీ దినోత్సవం
సాక్షి, అమరావతి/పార్వతీపురం టౌన్/పాడేరు: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల్లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గిరిజన ఎమ్మెల్యేలు, నేతలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, అల్లూరి సీతారామరాజు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న సేవలను కొనియాడారు. 90 శాతం హామీలు నెరవేర్చాం.. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి జ్యోతి ప్రజ్వలన చేసి ఆదివాసీ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజనులకు ఇచ్చిన హామీల్లో 90 శాతానికి పైగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని, మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పుష్పశ్రీవాణి కొనియాడారు. కార్యక్రమంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, పీడిక రాజన్నదొర తదితరులు పాల్గొన్నారు. పాడేరులో ఘనంగా.. విశాఖ జిల్లా పాడేరులో ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన గిరిజన దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వి.వినయ్చంద్, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన గిరిజన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్, మాజీ మంత్రి మణికుమారి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ ఎస్టీ సెల్ నేతలు పాల్గొన్నారు. నాడు వైఎస్సార్ 32 లక్షల ఎకరాలకు పైగా భూముల్లో గిరిజనులకు హక్కులు కల్పించారని పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కుంభా రవిబాబు గుర్తుచేసుకున్నారు. నేడు సీఎం వైఎస్ జగన్ దాదాపు 50 వేల ఎకరాల భూమిని 24,500 మంది గిరిజన కుటుంబాలకు పంపిణీ చేసేందుకు నిర్ణయించారని కొనియాడారు. -
టీడీపీ సొంత కార్యక్రమంగా ఆదివాసీ దినోత్సవం
విజయనగరం(పార్వతీపురం): విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం టీడీపీ సొంత వ్యవహారంగా మారింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజనులు, గిరిజన నేతలు ఒక్కరు కూడా లేకుండానే సమావేశం ప్రారంభమైంది. అయితే సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తమను అనుమతించాలని కోరడంతో పోలీసులకు వారికి మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం వైఎస్ఆర్ సీపీ నేతలను పోలీస్ స్టేషన్కు తరలించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement