breaking news
Transport buses
-
డిమాండ్లు పరిష్కరించేంత వరకూ సమ్మె విరమించం
సాక్షి, చెన్నై: బోనస్, వేతన సవరణలపై ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ చెన్నై నగర ప్రభుత్వ రవాణా సంస్థ ఉద్యోగులు ఆకస్మిక సమ్మెకు దిగారు. రవాణా సంస్థ ఉద్యోగులు ఉదయం నుంచి సమ్మెకు పిలుపునివ్వటంతో నగరవ్యాప్తంగా తిరిగే 4000 బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. కార్యాలయాలు, వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్టాండులలో పడిగాపులు కాస్తూ, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇదే అదనుగా ఆటోవాలాలు అందినకాడికి దండుకుంటున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించమని రవాణా సంస్థ ఉద్యోగులు కరాఖండిగా చెప్పటంతో ప్రయణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బస్సుల్లో ప్యానిక్ బటన్ తప్పనిసరి
న్యూఢిల్లీ: మహిళా ప్రయాణికుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రజా రవాణా బస్సుల్లో ప్యానిక్ బటన్, సీసీ కెమెరా, వెహికల్ ట్రాకింగ్ పరికరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ బుధవారం చెప్పారు. వీటిని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనే నిబంధనలతో జూన్ 2న నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ‘నిర్భయ’ ఉదంతం తర్వాత మహిళ రక్షణ కోసం బస్సుల్లో ప్యానిక్ బటన్, సీసీ కెమెరా, జీపీఎస్ పరిజ్ఞానం కలిగిన వెహికల్ ట్రాకింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. రాజస్తాన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు చెందిన పది లగ్జరీ, పది ఆర్డినరీ బస్సుల్లో ప్యానిక్ బటన్లు, సీసీ కెమెరాల వినియోగానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. తాజాగా నోటిఫికేషన్ ప్రకారం 23 సీట్ల కంటే ఎక్కువ సామర్థ్యమున్న ప్రజారవాణా బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను జీపీఎస్తో అనుసంధానిస్తారు. వీటిని స్థానికపోలీస్ కంట్రోల్ రూమ్కు అనుసంధానిస్తారు. బస్సులో అనుకోని సంఘటన జరిగినట్లయితే అందులోని మహిళలు వెంటనే ఈ ప్యానిక్ బట్ను నొక్కొచ్చు. జీపీఎస్ ద్వారా సమాచారం దగ్గర్లోని పోలీస్ స్టేషన్కు చేరుతుంది. ఒకసారి ఎమర్జెన్సీ సిగ్నల్ వెళ్లిన తర్వాత సీసీ కెమెరాలు బస్సులోని సంఘటనను సెంట్రల్ కంట్రోల్ రూమ్కు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చేరవేస్తాయి.