-
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
సాక్షి, గుంటూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రత్తిపాడు మండలం కొండేపాడు నుంచి పొన్నూరు మండలం జూపూడి ఫంక్షన్ కి ట్రాక్టర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 30 మంది ఉన్నట్లు సమాచారం. మృతులు..మిక్కిలి నాగమ్మ, మామిడి.జాన్సీరాణి, కట్టా.నిర్మల, గరికపూడి.మేరిమ్మ, గరికపూడి.రత్నకుమారి, గరికపూడి.సుహొసినిగా గుర్తించారు. చదవండి:ఇల్లు కొనుక్కున్నా.. పట్టా వెనక్కి తీసుకోండి -
పంట అమ్ముకుని వస్తుండగా నదిలో పడ్డ ట్రాక్టర్.. 20మంది రైతులు..!
లక్నో: ఉత్తర్ప్రదేశ్లోని హర్దోయ్లో ఘోర ప్రమాదం జరిగింది. 20 మంది రైతులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ వంతెనపై నుంచి గర్రా నదిలో పడిపోయింది. ఈ ప్రమాందంలో ఇప్పటి వరకు ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు గల్లంతయ్యారు. మరో 14 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన బాధితుడు ముకేశ్గా గుర్తించినట్లు తెలిపారు హర్దోయ్ జిల్లా మేజిస్ట్రేట్ అవినాశ్ కుమార్. ‘ట్రాక్టర్ ట్రాలీలో వెళ్తున్న 20 మంది గర్రా నదిలో పడిపోయినట్లు సమాచారం అందింది. వారిలోంచి 14 మందిని సురక్షితంగా కాపాడారు. ముకేశ్ మృతదేహాన్ని వెలికితీశారు. గల్లంతైన ఐదుగురి కోసం గాలిస్తున్నా’మని తెలిపారు అవినాశ్ కుమార్. సంఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పీఏసీ బలగాలను మోహరించినట్లు చెప్పారు. ట్రాక్టర్, ట్రాలీని స్వాధీనం చేసుకున్నామని, గల్లంతైన వారందరినీ వెలికితీసిన తర్వాతే ఆపరేషన్ పూర్తవుతుందన్నారు. ఏం జరిగింది? బెగ్రాజ్పుర్ గ్రామానికి చెందిన రైతులు తమ పంటను సమీపంలోని మార్కెట్లో విక్రయించి ట్రాక్టర్లో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో పాలీ ప్రాంతంలో గర్రా నదిపై ఉన్న వంతెనపైకి రాగానే ట్రాక్టర్ టైర్ పేలింది. దీంతో అదుపు తప్పి ట్రాక్టర్ నదిలోకి దూసుకెళ్లింది. #UttarPradesh: Twenty people riding on a tractor-trolley fell into the #Garra river after the driver lost control of the vehicle and it fell off the bridge in #Hardoi on Saturday, officials said. Six people are missing in the tragedy. pic.twitter.com/sy5MYbfJmJ — Siraj Noorani (@sirajnoorani) August 27, 2022 ఇదీ చదవండి: భయానక రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి -
ట్రాక్టర్ ట్రక్ బోల్తా : 15 మహిళలకు గాయాలు
గూడూరు : బంధువు మృతి చెందటంతో చూసేందుకు ట్రాక్టర్ వెళ్లి తిరిగి వస్తుండగా ట్రక్ బోల్తాపడి 15 మంది మహిళలు గాయపడ్డాడు. ఈ సంఘటన మండలంలోని కొండాగుంట సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఓజిలి మండలం సగుటూరుకు చెందిన పలువురు మహిళలు గూడూరు రూరల్ మండలం చెన్నూరులో తమ బంధువు మృతి చెందడంతో అంత్యక్రియలకు హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా కొండాగుంట సమీపంలో చప్టా వద్ద ట్రాక్టర్ నుంచి ట్రక్ లింక్ విడిపోయి బోల్తాపడి పడింది. ఈ సంఘటనలో జీ చెంగమ్మ, మహాలక్ష్మమ్మ, కాంతమ్మ, చెంగమ్మ, అంకమ్మ, మస్తానమ్మతో పాటు మరో తొమ్మిది మంది స్వల్పంగా గాయపడ్డారు. రెండు 108 వాహనాల ద్వారా క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ట్రాక్టర్ బోల్తా.. యువతి మృతి
ఆదిలాబాద్ : వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ యువతి మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూరు మండలం భూతాయి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్లి వస్తున్న ట్రాక్టర్ గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో కామ్లే జ్యోతి(19) అనే యువతి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
పెళ్లి ట్రాక్టర్ బోల్తా: 10మందికి గాయాలు
బుచ్చయ్యపేట (విశాఖపట్నం) : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా కొట్టిన ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం విశాఖపట్నం జిల్లా బచ్చయ్యపేట మండలం బంగారమ్మ జంక్షన్ వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన పెళ్లి బృందం పెళ్లి కూతురికి సారె తీసుకెళ్తుండగా..ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement