-
ఏం చేద్దాం!
* పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ ఆత్మావలోకనం * నేడు గాంధీభవన్లో బృంద సమీక్షలు * సీనియర్ల అభిప్రాయాలతో భవిష్యత్తు కార్యాచరణ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఓటమి భారంతో కుంగిపోయిన పార్టీ శ్రేణుల్లో జవసత్వాలు నింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం నడుంబిగించింది. సార్వత్రిక ఎన్నికల గుణపాఠంతో తేరుకున్న నాయకత్వం.. భవిష్యత్తు వ్యూహంపై మేధోమథనం సాగిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత, ప్రజల అభిమానాన్ని చూరగొనే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం గాంధీభవన్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) పార్టీ బలోపేతంపై సీనియర్లతో బృంద సమీక్షలు జరుపుతోంది. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో జరిగే ఈ సమావేశంలో ముఖ్యనేతలు పార్టీ వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. పరాజయానికి దారితీసిన కారణాలను విశ్లేషిస్తునే.. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై ఈ భేటీలో చర్చించనున్నారు. 39 మంది సీనియర్లు, ముఖ్యనాయకులు ఈ గ్రూపుల చర్చల్లో పాలుపంచుకోనున్నారు. మాజీ మంత్రులు సర్వే సత్యనారాయణ, ప్రసాద్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, పార్టీ నేతలు కార్తీక్రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి ఈ బృందాలకు నేతృత్వం వహించనున్నారు. అధికార పార్టీ దూకుడుకు కళ్లెం వేయడంలో పార్టీ హైకమాండ్ విఫలమైందనే అభిప్రాయాలు వినిపిస్తుండడం, ఎన్నికల అనంతరం కొందరు పార్టీని వీడినా పట్టించుకోలేదనే విమర్శల నేపథ్యంలో అధిష్టానం ఈ సమీక్ష లు నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు జరిగే ఈ భేటీల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్కుమార్రెడ్డి కూడా పాల్గొంటారని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
కేసీఆర్ తొలి అడుగే... తప్పటడుగు: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో చెప్పిన మాయ మాటల్లాగే, కేసీఆర్ ప్రభుత్వ బడ్జెట్ మసిపూసి మారేడు కాయ చేసినట్లుగా ఉందని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. గాంధీభవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ బడ్జెట్ ప్రజలను ఎంతో నిరాశకు గురిచేసిందన్నారు. ‘సీఎం కేసీఆర్ తొలి అడుగే తప్పటడుగు అయింది. లక్ష కోట్ల బడ్జెట్ అయినా, రైతుల శ్రేయస్సును విస్మరించారు. విద్యుత్తుకు కావాల్సినన్ని నిధుల్లేవు. ఉద్యోగ కల్పన ఊసు మరిచార’ అని పొన్నాల వ్యాఖ్యానించారు. ‘విద్యుత్ రంగానికి కేటాయించింది రూ.1,636కోట్లు... మరి మూడేళ్లలో 20వేల మెగావాట్ల విద్యుత్ను ఎలా ఉత్పత్తి చేస్తారు’ అని నిలదీశారు. ఈ సమావేశంలో పొన్నాలతో పాటు కిసాన్, ఖేత్ మజ్దూరు కాంగ్రెస్ అధ్యక్షుడు కోదండరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
కరివేపాకులు చాలా రోజులు వరకు నిల్వ ఉండాలంటే..!
ఎంట్రీలు పడుతున్నాయ్.. బీ రెడీ!
బాహుబలి పోస్టర్ను రీక్రియేట్ చేసిన స్టార్..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
T20 వరల్డ్కప్లో సూపర్-8 బెర్త్లు ఖారారు.. షెడ్యూల్ ఇదే
‘డీప్ సీ మిషన్’ కలిగిన ఆరోదేశంగా భారత్
ఫండ్స్లో కొత్త ఇన్వెస్టర్ల జోరు
కానిస్టేబుల్ సురేష్కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
పాతకాలం విమానం కుప్పకూలి ఇద్దరి మృతి
ఢిల్లీలో రోగి.. గురుగ్రామ్లో వైద్యుడు.. 40 కి.మీ. దూరం నుంచి ఆపరేషన్
Advertisement