-
నేటి నుంచి అండర్–16 సెమీస్ మ్యాచులు
అనంతపురం సప్తగిరిసర్కిల్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్–16 సెమీఫైనల్ మ్యాచులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వెంకటగిరిలో అనంతపురం, తూర్పుగోదావరి జట్ల మధ్య సెమీస్ మ్యాచ్లో తలపడనుంది. కడపలోని ఏసీఏ గ్రౌండ్లో కడప, వైజాగ్ జట్ల మధ్య సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు సెమీస్ మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్–ఏ విభాగంలో వైజాగ్, తూర్పుగోదావరి జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలవగా, గ్రూప్–బీలో అనంతపురం, కడప జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. దీంతో ఆయా జట్లను సెమీస్లో తలపడనున్నాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లు సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు వెంకటగిరిలో జరిగే ఫైనల్ పోటీల్లో తలపడనున్నాయి. -
జాతీయ క్రీడా దినోత్సవ సంబరాలు
– నేటి నుంచి మూడు రోజుల క్రీడాపండుగ – డీఎస్ఏ, ఆర్డీటీ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు – 29న ర్యాలీ, సాయంత్రం ముగింపు కార్యక్రమాలు అనంతపురం సప్తగిరిసర్కిల్: జిల్లాలోని క్రీడాకారులకు శుభవార్త. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ (డీఎస్), ఆర్డీటీ సంస్థలు ప్రత్యేక క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నాయి. డీఎస్ఏ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జిల్లాస్థాయిలో బాక్సింగ్, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ పోటీలు ఉండగా.. ఆర్డీటీ ఆధ్వర్యంలో అనంత క్రీడా గ్రామంలోని అకాడమీలకు చెందిన 170 మంది క్రీడాకారులను భాగస్వాములను చేసి క్రికెట్, యోగా, అథ్లెటిక్స్, ఫుట్బాల్, హాకీ పోటీలు నిర్వహిస్తున్నారు. 170 మంది క్రీడాకారులను 11 మంది సభ్యులతో కూడిన 17 జట్లుగా విడగొట్టి వారిని అన్ని క్రీడల్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకున్నారు. జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారుల పేర్లను ఆయా జట్లకు కేటాయించి వారికి మూడు రోజులు పోటీలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు ప్రతిరోజు జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించి వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరచిన ఉత్తమ క్రీడాకారులను రోజుకు ముగ్గురు చొప్పున సత్కరించనున్నారు. సత్కారం అందుకుంటున్న వారి వివరాలు 27–08–2017 : డాక్టర్ అక్బర్ సాహెబ్ – టేబుల్ టెన్నిస్, ప్రకాష్–ఫుట్బాల్, ముద్దుకృష్ణ–అథ్లెటిక్స్ 28–08–2017 : అబ్దుల్ రజాక్–టెన్నిస్, చంద్రమౌళి–షట్టిల్, మునీర్బాషా–హాకీ 29–08–2017 : నరేష్–వాలీబాల్, విశ్వనాథచౌదరి–కబడ్డీ, శ్రీకాంత్రెడ్డి–బాస్కెట్బాల్ ర్యాలీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 29న ఉదయం టవర్క్లాక్ నుంచి డీఎస్ఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పెద్ద ఎత్తున హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. -
నేటి నుంచి ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ
అనంతపురం అగ్రికల్చర్: ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి విత్తన పంపిణీ శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. అందుకు సంబంధించి యాప్ కూడా సిద్ధమైనట్లు వెల్లడించారు. బయోమెట్రిక్ పద్ధతిలో కంది, ఉలవ, అలసంద, పెసర, మేత జొన్న, కొర్ర, గోరుచిక్కుడు విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇక హైబ్రిడి రకానికి చెందిన జొన్న, మొక్కజొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు విత్తనాలకు కిలోకు రూ.50 రాయితీ వర్తింపజేశారు. అలాగే బహుధాన్యపు కిట్లు పంపిణీ చేయనున్నారు. ఉచితంగా ఇచ్చే విత్తనాలకు సంబంధించి యాప్ సిద్ధం కావడంతో శనివారం నుంచి 35 మండలాల్లో పంపిణీ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు 1.15 లక్షల క్వింటాళ్లు ప్రత్యామ్నాయ విత్తనాలు కేటాయించగా, అందులో అత్యధికంగా 50 వేల క్వింటాళ్లు ఉలవలు సరఫరా చేశారు. ప్రస్తుతానికి 35 మండలాలకు కొంతవరకు విత్తనాలు సరఫరా అయినట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. అందులో జొన్నలు 590 క్వింటాళ్లు, సజ్జలు 150 క్వింటాళ్లు, కొర్ర 77 క్వింటాళ్లు, పెసలు 1,055 క్వింటాళ్లు, ఉలవలు 1,010 క్వింటాళ్లు, అలసందలు 155 క్వింటాళ్లు, కందులు 6 క్వింటాళ్లు, మొక్కజొన్న 722 క్వింటాళ్లు జిల్లాకు చేరినట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో అన్ని రకాల విత్తనాలు 21వ తేదీ నుంచి ఇవ్వనున్నట్లు సమాచారం. విత్తనాలు కావాల్సిన రైతులు ఆయా మండలాల్లోని ఏఓ కేంద్రాలను సంప్రదించాల్సి ఉంటుంది. -
శ్రావణం.. శుభప్రదం
సందర్భం : నేటి నుంచి నోముల మాసం ప్రారంభం సకల దేవతలకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర శ్రావణ మాసం రానేవచ్చింది. అన్ని మాసాలలోనూ ఎంతో శుభప్రదమైనదని పురాణాలు చెపుతున్న ఈ మాసంలో శుభకార్యాలు, నోములు, వ్రతాలు..అన్నీ అధికంగా పలకరిస్తాయి. ఈ మాసం వచ్చిదంటే మహిళల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. అంతటా ఒకటే సందడి..హడావుడి నెలకొని ఉంటుంది. పెళ్లి పనులతో కొందరు.. కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలకు శ్రావణ పట్టీలు పెట్టే వేడుకలతో మరికొందరు తలమునకలుగా ఉంటారు. కుటుంబ సుఖసౌఖ్యాల కోసం చేసే నోములతో, వ్రతాలతో ఈ నెలంగా ఇట్టే గడచిపోతుంది. అమావాస్యతో ఆషాడానికి వీడ్కోలు పలుకుతూ పండుగల మాసం సోమవారంæ నుంచి ప్రారంభం కానుంది. - అనంతపురం సందడిగా సాగే ప్రధాన పండుగలన్నీ శ్రావణంలోనే కనపడతాయి. ఆగస్టు 4న వరలక్ష్మీ వ్రతం, 7న రాఖీ పౌర్ణిమ... సనాతన ధర్మాన్ని చాటుతుంటాయి. అందరూ సమానమన్నట్టు బలరామకృష్ణు్ణల జయంతి, హయగ్రీవ జయంతి వంటివి భక్తిభావాలను మరింత పెంచుతాయి. 15న రానున్న శ్రీకృష్ణభగవానుని జన్మాష్టమి పర్వదినం శ్రావణ మాసానికే తలమానికంగా నిలుస్తుంది. శ్రావణ బహుళ విధియనాడు శ్రీ మంత్రాలయ రాఘవేంద్రుల ఆరా«ధనా ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతాయి. అలాగే మంగళగౌరి వ్రతం, నాగపంచమి, సామాన్య భక్తులే గాక రైతులు కూడా పంటలు సమృద్ధిగా పండాలని, ప«శు సంపద వర్దిల్లాలని ప్రత్యేకంగా పూజలు చేసే పొలాల అమావాస్య కూడా ఇదే మాసంలో రావడం విశేషం. మహా శివునికీ ప్రీతికరమే.. అన్నిటికి మించి పరమశివునికి కార్తీకం తర్వాత ఇష్టమైనది శ్రావణమాసమేనని శివపురాణం చెబుతోంది. ఈ మాసంలో చేసే శనిత్రయోదశి పూజలు, తైలాభిషేకాలు, మహారుద్రాభిషేకాలు పరమపద మోక్ష ప్రాప్తి కల్గిస్తాయని పురాణపండితులు చెబుతున్నారు. అదే విధంగా ఉపవాస దీక్షలకు ఇందులో అధిక ప్రాధాన్యముంటుంది. ముఖ్యంగా మహిళలు సుమంగళిగా జీవించాలని ఐదవతనం కోసం చేసే వివిధ నోములు, వ్రతాలతో ఆలయాలే కాదు ఇంటి పరిసరాలు పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో కళకళలాడుతాయి. శ్రావణ పూజలు అత్యంత శుభప్రదం శ్రావణం సమస్త హైందవ జాతిని ఏకం చేసే మహత్తర సాధనంగా చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. సర్వపాపల హరణకు, సకల శుభ యోగాలకు శ్రావణ మాస పూజలు శ్రేష్టమైనవి. పవిత్ర శ్రావణంలో వచ్చే ప్రతి దినమూ మంగళకరమే. – సాయినాథ దత్త, పురోహితులు, అనంతపురం -
నేటి నుంచి అండర్–16 మహిళ క్రికెట్ పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అండర్–16 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలను ఆదివారం నుంచి నిర్వహిస్తున్నట్లు క్రికెట్ సంఘం జిల్లా కార్యదర్శి కేఎస్ షాహబుద్దీన్ తెలిపారు. జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీటీ సహకారంతో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోటీలు ఆదివారం నుంచి ఈ నెల 13 వరకు సాగుతాయన్నారు. ఈ పోటీల్లో సౌత్జోన్కు చెందిన అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు జట్లు పోటీల్లో తలపడతాయన్నారు. అండర్–19 మహిళ క్రికెట్ పోటీలు ఈ నెల 15 నుంచి 20 వరకు జరుగుతాయన్నారు. క్రీడా పోటీలను స్థానిక అనంత క్రీడా గ్రామంలోని బీ–గ్రౌండ్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అండర్–16 పోటీలు 25 ఓవర్ల ఫార్మాట్లోను, అండర్–19 పోటీలు 50 ఓవర్ల ఫార్మాట్లో జరుగుతాయన్నారు. అండర్–16 మ్యాచ్ల వివరాలు తేదీ తలపడే జట్లు 9-07-17 కడప–కర్నూలు ఉదయం 9–07–17 అనంతపురం–నెల్లూరు మధ్యాహ్నం 10–07–17 చిత్తూరు–నెల్లూరు ఉదయం 10–07–17 అనంతపురం–కర్నూలు మధ్యాహ్నం 11–07–17 అనంతపురం–కడప ఉదయం 11–07–17 చిత్తూరు–కర్నూలు మధ్యాహ్నం 12–07–17 నెల్లూరు–కర్నూలు ఉదయం 12–07–17 కడప–చిత్తూరు మధ్యాహ్నం 13–07–17 చిత్తూరు–అనంతపురం ఉదయం 13–07–17 కడప–నెల్లూరు మధ్యాహ్నం అండర్–19 మ్యాచ్ల వివరాలు తేదీ తలపడే జట్లు 15–07–17 కడప–కర్నూలు 15–07–17 అనంతపురం–నెల్లూరు 16–07–17 చిత్తూరు–నెల్లూరు 16–07–17 అనంతపురం–కర్నూలు 18–07–17 అనంతపురం–కడప 18–07–17 చిత్తూరు–కర్నూలు 19–07–17 నెల్లూరు–కర్నూలు 19–07–17 కడప–చిత్తూరు 20–07–17 చిత్తూరు–అనంతపురం 20–07–17 కడప–నెల్లూరు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement