breaking news
TNF
-
లండన్లో బోనాలు ప్రారంభం
లండన్: ఇంటిటా బోనాలు, ప్రతి ఇంటా బోనాల పేరుతో తెలంగాణ ఎన్నారై ఫోరమ్(టీఎన్ఎఫ్) లండన్లో బోనాల ఉత్సవాలను మంగళవారం ఘనంగా ప్రారంభించింది. కరోనా దృష్ట్యా ఏటా వేలాది మంది కలిసి చేసుకునే పండగను, ఈసారి ఎవరి ఇళ్లలో వారే జరుపుకుంటునట్లు టీఎన్ఎఫ్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ వెల్లడించారు. ఈ మేరకు టీఎన్ఎఫ్ మహిళా విభాగం కో–ఆర్డినేటర్లు మీనా అంతరి, శౌరీ గౌడ్, వాణి అనసూరి, సాయి లక్ష్మి, దివ్య, శిరీష ఆశ, సవితా జమ్ముల, సీతా లత, అమృత, శ్వేత, జయశ్రీ, శ్రీవాణి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడిన తర్వాత ఒడి బియ్యంతో విందు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. బోనాల పండగ విశిష్టతపై లండన్ వేదికగా వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని టీఎన్ఎఫ్ ప్రెసిడెంట్ ప్రమోద్ గౌడ్ పేర్కొన్నారు. -
లండన్లో ఘనంగా పీవీ శత జయంతి ఉత్సవాలు
లండన్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ఎన్నారై ఫోరమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జయప్రకాశ్ నారాయణ్, పీవీ తనయ వాణి దేవి, లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ, పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల పాల్గొని ప్రసంగించారు. జయప్రకాశ్ నారాయణ్ మాట్లాడుతూ పీవీని చైనా సంస్కరణలకు ఆద్యుడు డెంగ్ జియావోపింగ్తో పోల్చారు. భారతదేశం పీవీ తెచ్చిన ఆర్థిక సంస్కరణలతో గాడిలో పడిందన్నారు. ‘ఆనాటి నుండి నేటి వరకు అందరూ పీవీ విధానాలనే అనుసరిస్తున్నారు. పంజాబ్ లో శాంతి నెలకొల్పడంలో ఆయన సఫలం అయ్యారు. కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించడంలో చాలా వరకు సఫలం అయ్యారనే చెప్పుకోవొచ్చు. ఇంకో 15 ఏళ్లు పీవీ ప్రధానిగా ఉండి ఉంటే ప్రగతి చైనాను అధిగమించేవాళ్లం’ అని అన్నారు. పీవీ తనయ వాణి దేవి మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు కూతురిని కావడం నాకు గర్వంగా ఉంది. ఆయన స్థిత ప్రజ్ఞుడు. ఎలాంటి సందర్భాల్లోనూ కోపం తెచ్చుకోని వ్యక్తి. సమయపాలన, క్రమశిక్షణ ఆయన విజయానికి మెట్లు. బాల్యం నుంచే ఆయన ఏకసంతాగ్రాహి అని మా నానమ్మ చెబుతుండేవారు. రెండున్నర ఏళ్లకే కఠిన పద్యాలను కంఠస్తం చేశారు. అందరూ ఆయన్ను మృదు స్వభావి అనుకుంటారు కానీ మహారాష్ట్రలో తుపాకుల శిక్షణనిచ్చారు. పీవీ రచనలు, ఆయన అందుకున్న బహుమతులు, ఆయనకు ఇష్టమైన వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేశామని చెప్పారు. ‘పీవీతో మా నాన్న మంచి అనుబంధం ఉంది. 2016లో ఇండియాకు వచ్చినప్పుడు హైదరాబాద్లోని పీవీ జ్ఞానభూమిని సందర్శించాను. ప్రపంచ రాజకీయ నాయకులకు ఆయన మార్గదర్శి. బ్రిటన్లో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తా’ అని ఎంపీ వీరేంద్ర శర్మ తెలిపారు. మహేశ్ బిగాల మాట్లాడుతూ తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు ప్రోత్సాహంతో 51 దేశాల్లో పీవీ శత జయంతి ఉత్సవాలను జరుపుతున్నట్లు తెలిపారు. సంవత్సరం పొడవునా పీవీ జయంతి కార్యక్రమాలను నిర్వహించాలని టీఈఎన్ఎఫ్ ప్రెసిడెంట్ గంప వేణుగోపాల్ ప్రతిపాదించగా, పాల్గొన్న అన్ని సంఘాలు స్వాగతించాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షుడు సుమన్ రావు, యుక్త సంస్థ తరఫున కిల్లి సత్యప్రసాద్, మహేశ్ జమ్ముల, అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, దుబాయ్, బహ్రయిన్ తదితర దేశాలకు చెందిన 130 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శత జయంతి సందర్భంగా టేన్ఫ్ అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్ అధ్యక్షతన జరిగిన మరో కార్యక్రమంలో సంస్థ కార్యవర్గంతో పాటు టీడీఎఫ్ ప్రతినిధులు కమలాకర్ రావు, శ్రవణ్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ జాగృతి ప్రతినిధులు సుమన్ రావు, కిషోర్ మునగాల, సంతోష్ ఆకుల, కిల్లి ప్రసాద్, యుక్త, రాములు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జీపీఐ ఆధ్వర్యంలో జరిగిన ఇంకో కార్యక్రమంలో ఉదయ్ నాగరాజు, వైరాజిస్టు బాల శ్రీనివాస్, లండన్ కార్పొరేటర్ ప్రభాకర్ ఖాజా, ఉదయ్, రెహానా, మోహన్ మద్ది, విజన్ తెలంగాణకు చెందిన శ్రీధర్ గౌడ్, నాట్స్కు చెందిన గంగసాని రాజేశ్వర్ రెడ్డి పాల్గొని విజయవంతం చేశారు. -
బోనమెత్తిన తెలుగు సినీ నటి
రాయికల్(కరీంనగర్ జిల్లా): తెలంగాణ ఎన్నారై ఫోరం (టీఎన్ఎఫ్) ఆధ్వర్యంలోలండన్లో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలకు సినీనటి పూనమ్ కౌర్ హాజరై బోనమెత్తారు. యుకే నలుమూలల నుంచి సుమారు 700 మందికి పైగా తెలంగాణ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్రం నుంచి రామచంద్రు తేజావత్ (రిటైర్డ్ ఐఏఎస్), స్థానిక ఎంపీలు వీరేంద్రశర్మ, సీమ మల్హోత్రా, బాలాజీ (ఇండియన్ హైకమిషనర్-లండన్) ముఖ్య అతిధులుగా హాజరై ప్రసంగించారు. రామచంద్రు తేజావత్ మాట్లాడుతూ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన ఎన్నారైలు తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ పెట్టుబడుల్లో భాగస్వామ్యులవ్వాలని పిలుపునిచ్చారు. విదేశాల్లో భారతీయ ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సంప్రదాయ బద్దంగా అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపును జరుపుకున్న తీరు ప్రవాస తెలంగాణ బిడ్డలనే కాకుండా స్థానికులను కూడా మంత్రముగ్దులని చేసింది.