-
ప్రజల్లేని ఊరు.. తిమ్మాపూర్
నల్గొండ: రికార్డుల్లో రెవెన్యూ గ్రామమైన తిమ్మాపూర్లో నేడు ఒక్కరూ నివాసం లేకపోవడంతో ప్రజలు లేని పల్లెగా మారింది. 70 సంవత్సరాల క్రితం వ్యవసాయబావుల వద్ద ఐదు కుటుంబాలు (వంగాల మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీరాంరెడ్డి, మధూసరెడ్డి, కుమ్మరి నర్సింహ) ఇళ్లు నిర్మించుకొని 60 సంవత్సరాల పాటు తిమ్మాపూర్ గ్రామంలో జీవనం సాగించారు. కాలక్రమంలో అంటువ్యాధులు ప్రబలి కొందరు ఊరు వదిలి పోగా మరికొందరు ఉపాధిని వెతుక్కుంటూ నెమ్మాని, పరడ, హైదరాబాద్, కరీంనగర్, నల్లగొండ, ఏపీ లింగోటం, నార్కట్పల్లి, చిట్యాల, వెంకటేశ్వర్లబావి, శేరిబావి వంటి గ్రామాలకు వెళ్లి నివసిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పాడుబడిన ఇళ్లు, బావులు, పశువుల కొట్టాలు, గోడలు, పంట పొలాలు మాత్రమే దర్శనమిస్తాయి. ఇలాంటి గ్రామాన్ని బేచిరాక్గావ్ (దీపం వెలగని గ్రామం)గా పిలుస్తుంటారు. గతంలో ఐదు కుటుంబాలు నివాసం.. 2011 జనాభా లెక్కల ప్రకారం తిమ్మాపూర్ గ్రామంలో 5 కుటుంబాలు నివసించేవి. గ్రామం మొత్తం జనాభా 20 మంది వారిలో 12 మంది పురుషులు, 8 మంది సీ్త్రలు ఉన్నారు. వీరిలో 9 మంది కూలీ పనులు చేసేవారిలో 8 మంది పురుషులు, ఒక సీ్త్ర ఉన్నారు. 55.56 శాతం అక్షరాస్యత కలిగిన గ్రామంలో ఇద్దరు మాత్రమే ఓటర్లు ఉండటం విశేషం. ఆంజనేయస్వామి విగ్రహం తరలింపు తిమ్మాపూర్లో గల ఆంజనేయస్వామి దేవాలయంలో గ్రామ ప్రజలు ఆంజనేయస్వామికి పూజలు చేసేవారు. అంటు వ్యాధులు ప్రబలడంతో గ్రామస్తులంతా ఒకరు తరువాత ఒకరు ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో గ్రామమంతా ఖాళీ అయ్యింది. దీంతో ఆంజనేయస్వామి విగ్రహాన్ని కట్టంగూర్ మండలంలోని ఎరసానిగూడెం గ్రామస్తులు తీసుకెళ్లి ఆలయం నిర్మించి ప్రతిష్ఠించుకున్నారు. తిమ్మాపూర్ పరిధిలో 500 ఎకరాలు.. కట్టంగూర్ మండంలంలో 22 గ్రామ పంచాయతీలకు గాను 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వాటిలో ఒకటి తిమ్మాపూర్. ఈ ఊరి పేరుతో రెవెన్యూ రికార్డుల్లో భూములు ఉన్నాయి. కానీ ఆ ఊరిలో వరిసాగు, చెట్లు, పక్షులు, గేదెలు, పశువులు, భూమి తప్ప జనం కనిపించరు. ఆ గ్రామం పేరుతో అధికారులు గ్రామసభలు నిర్వహిస్తారు. వ్యవసాయ భూమి సాగు వివరాలు, ఇతర విషయాలు రికార్డుల్లో నమోదవుతాయి. గ్రామం రెవెన్యూ పరిధి కావడంతో సంబంధిత అధికారులే భూములను పర్యవేక్షిస్తారు. తిమ్మాపూర్ గ్రామ పరిధిలో సర్వే నంబర్ 59లో 500 ఎకరాల భూములున్నాయి. ఈ భూముల్లో సుమారు 180 మంది రైతులు పత్తి, వరి, పెసర, కంది పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంగా పచ్చని పొలాల మద్య ఆహ్లాదకరంగా కనువిందు చేస్తుంది. నెమ్మానిలో ఉంటున్నాం పరడ, నెమ్మాని గ్రామాల మధ్య తిమ్మాపూర్ ఉంటుంది. అక్కడే ఐదు కుటుంబాలు నివసించేవి. చుట్టూ చెట్లు కొండలతో అడవిని తలపించేలా ఉండేది. మా తాత, నాన్న అందరం 60 సంవత్సరాల పాటు జీవనం సాగించాం. ఇప్పుడు నార్కట్పల్లి మండలం నెమ్మానిలో నివాసం ఉంటున్నాం. పాస్ పుస్తకాల్లో రెవెన్యూ గ్రామం తిమ్మాపూర్, కట్టంగూర్ మండలం అని ఉండడంతో నార్కట్పల్లిలో ప్రభుత్వం ద్వారా సరఫరా అయ్యే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఇబ్బంది అవుతోంది. – వంగాల అనంతరెడ్డి, రైతు, నెమ్మాని -
గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం
-
ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు దుర్మరణం
-
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, పెద్దాపురం : తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సామర్లకోట మండలం తిమ్మాపురం ఏబీడీ రోడ్డు వద్ద ఓ లారీ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దర్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లారీ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ కూల్చివేతలు ఆపండి..
సాక్షి, విశాఖపట్నం: భీమిలి మండలం చేపల తిమ్మాపురంలో మత్స్యకారులకు చెందిన ఇళ్ల కూల్చివేతను ఆపేయాలని కేంద్ర ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ కలెక్టర్ యువరాజ్ను కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక లేఖ రాశారు. 30 ఏళ్ల క్రితం మత్స్యకారులకు కేటాయించిన 15 ఎకరాల స్థలంలో ఇళ్లు, ఇతర కట్టడాలు నిర్మించుకున్నారని పేర్కొన్నారు. కానీ రాజకీయ ఒత్తిళ్లు, ఇతరుల ప్రయోజనాల కోసం ఇటీవల అధికారులు వాటిని దౌర్జన్యంగా కూల్చివేశారన్నారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. దీనిపై ఈ నెల 21న బాధిత మత్స్యకారులు జిల్లా మంత్రిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారని తెలిపారు. దీంతో మంత్రి స్పందించి ఇకమీదట మిగిలిన ఇళ్ల కూల్చివేత ఆపేయాలని అధికారులను ఆదేశిస్తానని, బాధితులకు కొత్తగా ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే పంచాయతీ అధికారులు మాత్రం మిగిలిన ఇళ్లను కూల్చేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే ఇళ్ల కూల్చివేత ఆలోచనను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు మత్స్యకార నాయకులు, బాధితులు శనివారం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement