breaking news
The three-Test series
-
మూడో స్పిన్నర్ ఎవరు?
పోటీలో ముగ్గురు బౌలర్లు శ్రీలంకతో టెస్టు సిరీస్కు భారత జట్టు ప్రకటన నేడు న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును గురువారం (నేడు) ఎంపిక చేయనున్నారు. సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇందుకోసం ఇక్కడ సమావేశమవుతోంది. బంగ్లాదేశ్తో ఫలితం తేలని ఏకైక టెస్టులో ఉన్న జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అయితే శ్రీలంకతో సిరీస్ కాబట్టి మూడో స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఎవరిని ఎంపిక చేస్తారనేదే కాస్త ఆసక్తికరంగా మారింది. ఈ స్థానం కోసం ప్రధానంగా ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. రేసులో కరణ్, మిశ్రా! శ్రీలంకతో సిరీస్కు ప్రధాన స్పిన్నర్లుగా అశ్విన్, హర్భజన్ ఉండటం ఖాయమే. వైవిధ్యం కోసం లెగ్ స్పిన్నర్ లేదా లెఫ్టార్మ్ స్పిన్నర్ను అదనంగా తీసుకునే అవకాశం ఉంది. బంగ్లాతో సిరీస్లో జట్టులో ఉన్నా మ్యాచ్ ఆడని కరణ్ శర్మ గాయంనుంచి కోలుకున్నాడు కాబట్టి అతని ఎంపికకే అవకాశాలెక్కువ. అయితే వెటరన్ అమిత్ మిశ్రా పేరును కూడా సెలక్టర్లు పరిశీలిస్తున్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ స్థానం కోసం అక్షర్ పటేల్ లేదా ప్రజ్ఞాన్ ఓజాలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. పటేల్ ఇటీవల వన్డేల్లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. జట్టులో స్థానం కోల్పోయిన అనంతరం యాక్షన్ మార్చుకున్న ఓజా పునరాగమనం చేసే స్థాయిలో అద్భుత ప్రదర్శన ఏమీ ఇవ్వలేదు. శ్రీలంక వికెట్ల స్వభావం దృష్ట్యా తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు అవసరమనే ఆలోచన చేస్తే... ఒక పేసర్ను తగ్గించి నలుగురు స్పిన్నర్లను లంకకు తీసుకెళ్లొచ్చు. అలాంటి పరిస్థితి వస్తే మిశ్రా, అక్షర్ ఇద్దరూ జట్టులోకి రావచ్చు. ఇక వన్డే జట్టులోనూ చోటు కోల్పోయిన జడేజాకు ఇప్పట్లో చాన్స్ దక్కకపోవచ్చు. బంగ్లాదేశ్ సిరీస్కు జట్టును ఎంపిక చేసిన అనంతరం గాయంతో తప్పుకున్న లోకేశ్ రాహుల్ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మరో వైపు 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేస్తే ప్రధాన కీపర్గా సాహా ఉంటాడు. అదనంగా మరో ఆటగాడిని ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తే రిజర్వ్ కీపర్గా నమన్ ఓజాకు చాన్స్ దక్కవచ్చు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో ఆగస్ట్ 12న గాలేలో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. -
దక్షిణాఫ్రికాదే సిరీస్
కేప్టౌన్: వెస్టిండీస్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను దక్షిణాఫ్రికా జట్టు 2-0తో గెలుచుకుంది. దీంతో పాటు ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్వన్గా తన ర్యాంకును నిలబెట్టుకుంది. ఓపెనర్ డీన్ ఎల్గర్ (103 బంతుల్లో 60 నాటౌట్; 7 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీ సహాయంతో చివరి రోజు మంగళవారం 124 పరుగుల లక్ష్యాన్ని సఫారీ 37.4 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. డి విలియర్స్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఆమ్లాకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ పురస్కారం దక్కింది. అల్విరో పీటర్సన్ రిటైర్మెంట్: దక్షిణాఫ్రికా ఓపెనర్ అల్విరో పీటర్సన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. ప్రస్తుత సిరీస్ను 2-0తో నెగ్గిన అనంతరం సహచరుల మధ్య తన వీడ్కోలు నిర్ణయం ప్రకటించాడు. -
భారీ స్కోరు దిశగా పాక్
షెహజాద్ సెంచరీ న్యూజిలాండ్తో టెస్టు అబుదాబి: ఓపెనర్లు అహ్మద్ షెహజాద్ (126 బ్యాటింగ్), మహ్మద్ హఫీజ్ (96)లు సత్తా చాటడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న టెస్టులో పాకిస్థాన్ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఆదివారం ప్రారంభమైన మొదటి టెస్టు తొలి రోజు ఆటముగిసే సమయానికి... పాకిస్థాన్ వికెట్ నష్టానికి 269 పరుగులు చేసింది. టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి వికెట్కు 178 పరుగులు జోడించిన ఓపెనర్లు పాక్కు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. 96 పరుగులు చేసిన హఫీజ్ అండర్సన్ బౌలింగ్లో ఆవుటై కొద్దిలో సెంచరీని కోల్పోయాడు. షెహజాద్తో పాటు అజహర్ అలీ (46 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.