breaking news
third party insurance rates
-
వాహనదారులకు షాక్! ఇప్పుడు ఇవి కూడా పెంచేశారు!!
ధరల పెరుగుదల, పన్ను పోటు, సబ్సిడీల కోత, రాయితీలకు మూత.. ఇలాగే కొనసాగుతోంది కేంద్రం వ్యవహారం. అదుపు తప్పిన ద్రవ్యోల్బణంతో ఇప్పటికే బతుకుబండి లాగించడం కష్టంగా మారింది. పెట్రోలు, డీజిల్ ధరలు తలచుకుంటేనే కళ్లు బైర్లు కమ్ముతున్నాయ్.. ఇప్పుడున్నవి చాలవనీ మరో భారాన్ని వాహనదారులపై మోపింది కేంద్రం. వెహికల్ ఏదైనా సరే ముందు జాగ్రత్తగా ఇన్సురెన్సు చేయించడం తప్పనిసరి చేశారు. అయితే ఇన్సురెన్సులో అనేక కేటగిరీలు ఉన్నా తక్కువ ప్రీమియంతో అందరికీ అందుబాటలో ఉండేది థర్డ్ పార్టీ ఇన్సురెన్స్. ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే వాహానదారులు థర్డ్ పార్టీ ఇన్సురెన్సును క్రమం తప్పకుండా చెల్లిస్తుంటారు. ఇప్పుడీ థర్డ్ పార్టీ ఇన్సురెన్సు చెల్లింపులను పెంచింది కేంద్రం. సవరించిన ధరలు 2022 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. సవరించిన థర్డ్పార్టీ ఇన్సురెన్సు వివరాలు ఇలా ఉన్నాయి. - 1000సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన కార్లకు థర్డ్పార్టీ ఇన్సురెన్స్ను రూ.2,094గా నిర్ణయించారు. గతంలో 2019-20లో ఈ మొత్తం రూ.2,072గా ఉండేది - 1000 నుంచి 1500 సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన కార్లకు రూ.3,416గా థర్డ్పార్టీ ఇన్సురెన్సు అమల్లోకి రానుంది. గతంలో ఇది రూ.3,221కి పరిమితమైంది. - చిత్రంగా బడాబాబులు ఎక్కువగా ఉపయోగించే 1500 సీసీ ఆపై సామర్థ్యం కలిగిన కార్లకు థర్డ్పార్టీ ఇన్సెరెన్సును రూ.7,890గా సవరించింది. గతంలో ఇది మరో రూ.7,897గా ఉండేది. ఈ ఒక్క కేటగిరీలోనే రూ.7 ప్రీమియం తగ్గింది. - ఇక ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే 150 నుంచి 350 సీసీ వరకు థర్డ్పార్టీ ప్రీమియం రూ. 1,366గా నిర్ణయించారు. 350 సీసీ ఉన్న బైకులకు ఈ మొత్తం రూ.2,804గా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి - ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి 30 కిలోవాట్స్ సామర్థ్యం ఉంటే థర్డ్పార్టీ ఇన్సురెన్సు రూ.1,780గా నిర్ణయించారు. 30 నుంచి 65 కిలోవాట్స్ మధ్యన అయితే రూ.2,904గా ఉంది. - కమర్షియల్ గూడ్స్ క్యారియర్లకు (12,000 కేజీల నుంచి 20,000 కేజీలు) సంబంధించి థర్డ్పార్టీ ప్రీమియంని రూ.35,313లకు పెంచారు. గతంలో ఇది రూ.33,414గా ఉండేది. ఇక 40 వేల కేజీలు దాటిన కమర్షియల్ వెహికల్స్కి రూ.44,242గా ప్రీమియం ఉంది. కేంద్రం చేతుల్లోకి గతంలో వాహనాల ఇన్సురెన్సులు విధివిధానాలను ఇన్సురెన్సు రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఐఏ) ఆధీనంలో ఉండేది. కాగా ఈసారి ఈ బాధ్యతలు కేంద్రం తీసుకుంది. ఈ మేరకు తొలిసారిగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ థర్డ్ పార్టీ ఇన్సురెన్సుల సవరణ బాధ్యతలు తీసుకుంది. చదవండి: మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు -
దిగొచ్చిన థర్డ్ పార్టీ బీమా చార్జీలు
పెంచిన రేట్లను కొంత తగ్గిస్తూ ఐఆర్డీఏ ఆదేశాలు న్యూఢిల్లీ: వాహన బీమా పాలసీల్లో థర్డ్ పార్టీ బీమా చార్జీలను భారీగా పెంచుతూ ఇటీవల తీసుకున్న నిర్ణయంలో మార్పులు జరిగాయి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన రేట్లను కొంత మేర తగ్గిస్తూ బీమా నియంత్రణ సంస్థ(ఐఆర్డీఏ) తాజా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రక్కుల యజమానులకు ఉపశమనం లభించింది. సవరించిన థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా ఐఆర్డీఏ తన ఆదేశాల్లో పేర్కొంది. వాస్తవానికి రేట్లను తగ్గించినప్పటికీ గతేడాదితో పోలిస్తే ప్రస్తుత రేట్లు కొంచెం ఎక్కువే. తగ్గిన రేట్లు: 1,000 సీసీ నుంచి 1500 సీసీ వరకు కార్లపై థర్డ్ పార్టీ బీమా ప్రీమియం రూ.3,132 నుంచి రూ.2,863కు దిగొచ్చింది. 1500సీసీ కంటే అధిక సామర్థ్యం ఉన్న కార్లకు ప్రీమియం రూ.8,630 నుంచి రూ.7,890కు తగ్గింది. 1000 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న కార్ల రేట్లలో మార్పులు లేవు. వీటికి ప్రీమియం రూ.2,055. ద్విచక్ర వాహనాల్లో 150సీసీ అంతకంటే ఎక్కువ సామర్థ్యంగల వాటి ప్రీమియం రేట్లూ తగ్గాయి. సరుకు రవాణా ట్రక్కులపై (40,000కిలోలు పైగా ఉన్నవి) ప్రీమియం రూ.36,120 నుంచి రూ.33,024కు తగ్గింది. లారీ, ట్రక్కుల యజమానులు థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లను భారీగా పెంచడాన్ని నిరసిస్తూ ఇటీవల సమ్మె నిర్వహించిన విషయం విదితమే.